యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

మిషన్ ఒలింపిక్ సెల్ సభ్యులుగా అంతర్జాతీయ అథ్లెట్లు మెరుగైన ఫలితాల కోసం కేంద్రీకృత మార్పులను సూచించగలరు: శ్రీ అనురాగ్ ఠాకూర్

Posted On: 13 DEC 2021 6:03PM by PIB Hyderabad

ప్రధాన ఆంశాలు:

  • కొత్త సభ్యులుగా ఏడుగురు మాజీ అంతర్జాతీయ ఆటగాళ్లతో సహా పునర్నిర్మించిన ఎంఓసిని ఉద్దేశించి క్రీడా మంత్రి ప్రసంగించారు
  • క్రీడల కోసం డబ్బు ఖర్చు చేయడానికి ప్రభుత్వం వెనుకాడదు మరియు బడ్జెట్‌ను పెంచడానికి వెనుకాడదు: శ్రీ ఠాకూర్

 
యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ ఈ రోజు మాట్లాడుతూ " పారిస్‌-2024లో దేశం మెరుగ్గా ఉండేలా సంస్థాగత ఫ్రేమ్‌వర్క్‌ను బలోపేతం చేయడం ద్వారా  సానుకూల వాతావరణాన్ని సృష్టించడంలో సహాయపడే గొప్ప బాధ్యత మిషన్ ఒలింపిక్ సెల్ (ఎంఓసి)పై ఉందని" అన్నారు.

కొత్త సభ్యులుగా ఉన్న ఏడుగురు మాజీ అంతర్జాతీయ ఆటగాళ్లతో సహా పునర్నిర్మించిన ఎంఓసిని ఉద్దేశించి శ్రీ ఠాకూర్ మాట్లాడుతూ "'టార్గెట్‌ ఒలింపిక్ పోడియం పథకం భారతదేశం అంతర్జాతీయ స్థాయిలో గెలవడానికి సహాయపడిందా మరియు జాతీయ క్రీడా సమాఖ్యలు మెరుగుపడటానికి సహాయపడిందా అనే విషయాన్ని అథ్లెట్లు అధిక-పనితీరు దృక్కోణం నుండి పరిశీలించడం ముఖ్యం" అని చెప్పారు.
image.png

ఒలింపిక్ క్రీడలు, ఆసియా క్రీడలు మరియు కామన్వెల్త్ గేమ్స్ వంటి బిగ్-టికెట్ ఈవెంట్‌లపై మరింత దృష్టి పెట్టాలని మంత్రి కోరుతూ ప్రదర్శనల యొక్క న్యాయమైన మూల్యాంకనానికి పిలుపునిచ్చారు. ప్యారిస్‌లో జరిగే ఒలింపిక్స్‌లో భారత్‌ మెరుగైన ఫలితాలు సాధించేందుకు వీలుగా వ్యవస్థను సవరించగల కొన్ని మార్పులను సూచించే అనుభవం సభ్యులకు ఉందని ఆయన అన్నారు.

ఎంఓసిలో భాగమైనందుకు సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ భారతీయ క్రీడలో వారి బహిర్గతం మరియు ప్రమేయంతో వచ్చే ఏడాది కామన్వెల్త్ గేమ్స్ మరియు ఆసియా క్రీడలను ఉంచుతూ 2024లో పారిస్ ఒలింపిక్ క్రీడలకు సంబంధించిన రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయడంలో వారు మంత్రిత్వ శాఖకు సహాయం చేస్తారని తాను ఖచ్చితంగా అనుకుంటున్నానని మంత్రి తెలిపారు.

క్రీడల కోసం డబ్బు ఖర్చు చేయడంలో ప్రభుత్వం వెనుకాడడం లేదని బడ్జెట్‌ను పెంచేందుకు వెనుకాడబోమని శ్రీ ఠాకూర్ అన్నారు.

ఏడుగురు కొత్త సభ్యుల చేరికలతో ఎంఓసిలో మాజీ అంతర్జాతీయ ఆటగాళ్ల సంఖ్య ఎనిమిదికి పెరిగింది. మరియు ప్రస్తుత అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ శ్రీ అడిల్లే జే. సుమరివాల్లా ఒలింపియన్ మరియు టార్గెట్ ఒలింపిక్ పోడియం కేడర్‌ సీఈఓ. పుష్పేంద్ర గార్గ్ ప్రపంచ ఛాంపియన్ సైలర్‌ మొదలైన వారు భారతదేశ త్రివర్ణ పతాకాన్ని ధరించారు.

ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో లాంగ్ జంప్ పతక విజేత అంజు బాబీ జార్జ్, భారత హాకీ మాజీ కెప్టెన్ సర్దారా సింగ్, రైఫిల్ షూటింగ్ దిగ్గజం అంజలీ భగవత్, భారత ఫుట్‌బాల్ మాజీ కెప్టెన్ బైచుంగ్ భుటియా, మాజీ హాకీ కెప్టెన్ మరియు ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ సీఈఓ వీరేన్‌రస్క్విన్హా , టేబుల్ టెన్నిస్ స్టార్ మోనాలిసా మెహటాన్, బ్యాడ్‌మిన్‌టాన్‌ స్టార్ తృప్తి ముర్గుండేలు కొత్తగా చేరారు.


 

*******



(Release ID: 1781128) Visitor Counter : 150