ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
18 OCT 2021 9:24AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా, ఇప్పటివరకు 97.79 కోట్ల డోసులను అందించారు.
గత 24 గంటల్లో 13,596 కొత్త కేసులు నమోదయ్యాయి; ఇది 230 రోజుల కనిష్ట స్థాయి.
రికవరీ రేటు 98.12% కు చేరింది. 2020 మార్చి నుంచి ఇది గరిష్ట స్థాయి.
గత 24 గంటల్లో 19,582 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,34,39,331 కు పెరిగింది.
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 1% కంటే తక్కువగా, 0.56% వద్ద ఉన్నాయి. 2020 మార్చి నుంచి ఇది కనిష్ట స్థాయి.
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,89,694. ఇది 221 రోజుల కనిష్ట స్థాయి.
వారపు పాజిటివిటీ రేటు (1.37%) గత 115 రోజులుగా 3% కన్నా తక్కువగా ఉంది.
రోజువారీ పాజిటివిటీ రేటు (1.37%) గత 49 రోజులుగా 3% కన్నా తక్కువగా ఉంది.
ఇప్పటివరకు 59.19 కోట్ల కొవిడ్ పరీక్షలు చేశారు.
****
(Release ID: 1764646)
Visitor Counter : 140