ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

దాదాపు 94 కోట్ల డోసుల మైలురాయికి దగ్గరైన భారతదేశ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


గత 24 గంటల్లో 79.12 లక్షలకుపైగా టీకాలు నిర్వహణ

97.98 శాతానికి చేరిన రికవరీ రేటు; 2020 మార్చి నుంచి గరిష్ట స్థాయి

గత 24 గంటల్లో 19,740 కొత్త కేసులు నమోదు

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు (2,36,643) 0.70 శాతం

వారపు పాజిటివిటీ రేటు ‍(1.62 శాతం) గత 106 రోజులుగా 3 శాతం కంటే తక్కువ

Posted On: 09 OCT 2021 9:42AM by PIB Hyderabad

భారతదేశ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం నిన్నటితో 94 కోట్ల డోసుల మైలురాయికి దగ్గరైంది. ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; గత 24 గంటల్లో ఇచ్చిన 79,12,202 డోసులతో కలిపి, 93.99 కోట్ల డోసులను (93,99,15,323) టీకా కార్యక్రమం అధిగమించింది. 91,40,316 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది. 

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం:

 

 

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,03,74,846

రెండో డోసు

89,95,831

 

ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు

మొదటి డోసు

1,83,57,931

రెండో డోసు

1,52,78,433

 

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

37,98,90,830

రెండో డోసు

9,81,36,153

 

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

16,43,35,949

రెండో డోసు

8,17,98,092

 

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

10,38,78,387

రెండో డోసు

5,88,68,871

మొత్తం

93,99,15,323

 

గత 24 గంటల్లో 23,070 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 3,32,48,291 కు పెరిగింది.

దేశవ్యాప్త రికవరీ రేటు 97.98 శాతానికి చేరింది. 2020 మార్చి నుంచి ఇదే గరిష్ట స్థాయి.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002Y0M5.jpg

కేంద్రం-రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నిరంతర, సహకార ప్రయత్నాల కారణంగా, వరుసగా 104వ రోజు కూడా 50,000 కంటే తక్కువ రోజువారీ కొత్త కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో 19,740 కొత్త కేసులు నమోదయ్యాయి.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003T0UW.jpg

 

ప్రస్తుత యాక్టివ్ కేసుల సంఖ్య 2,36,643. ఇది 206 రోజుల కనిష్ట స్థాయి. దేశంలోని మొత్తం పాజిటివ్ కేసుల్లో ఈ సంఖ్య 0.70 శాతం.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004TL4Q.jpg

దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో మొత్తం 12,69,291 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 58.13 కోట్లకుపైగా (58,13,12,481) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 1.62 శాతంగా ఉంది. గత 106 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా నమోదవుతోంది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.56 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు గత 40 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా, 123 రోజులుగా 5 శాతం కంటే తక్కువగా నమోదవుతోంది. 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005XOE5.jpg

 

****



(Release ID: 1762465) Visitor Counter : 128