ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

91 కోట్ల డోసుల మైలురాయిని దాటిన భారతదేశ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


గత 24 గంటల్లో 72.51 లక్షలకుపైగా టీకాలు నిర్వహణ

97.93 శాతానికి చేరిన రికవరీ రేటు; 2020 మార్చి నుంచి గరిష్ట స్థాయి

గత 24 గంటల్లో 18,346 కొత్త కేసులు నమోదు

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు (2,52,902) 0.75 శాతం

వారపు పాజిటివిటీ రేటు (1.66 శాతం) గత 102 రోజులుగా 3 శాతం కంటే తక్కువ

Posted On: 05 OCT 2021 10:04AM by PIB Hyderabad

భారతదేశ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం నిన్నటితో 91 కోట్ల డోసుల మైలురాయిని దాటింది. ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; గత 24 గంటల్లో ఇచ్చిన 72,51,419 డోసులతో కలిపి, మొత్తంగా 90.54 కోట్ల డోసులను (91,54,65,826) టీకా కార్యక్రమం అధిగమించింది. 88,75,020 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం:

 

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,03,74,089

రెండో డోసు

89,46,803

 

ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు

మొదటి డోసు

1,83,55,901

రెండో డోసు

1,51,44,069

 

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

37,03,90,293

రెండో డోసు

9,06,64,628

 

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

16,19,93,955

రెండో డోసు

7,93,41,865

 

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

10,26,93,150

రెండో డోసు

5,75,61,073

మొత్తం

91,54,65,826

 

గత 24 గంటల్లో 29,639 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 3,31,50,886 కు పెరిగింది.

దేశవ్యాప్త రికవరీ రేటు 97.93 శాతానికి చేరింది. 2020 మార్చి నుంచి చూస్తే ఇది గరిష్ట స్థాయి.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002UNCH.jpg

కేంద్రం-రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నిరంతర, సహకార ప్రయత్నాల కారణంగా, వరుసగా 100వ రోజు కూడా 50,000 కంటే తక్కువ రోజువారీ కొత్త కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో 18,346 కొత్త కేసులు నమోదయ్యాయి.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00310UY.jpg

 

ప్రస్తుత యాక్టివ్ కేసుల సంఖ్య 2,52,902. ఇది 201 రోజుల కనిష్ట స్థాయి. దేశంలోని మొత్తం పాజిటివ్ కేసుల్లో ఈ సంఖ్య 0.75 శాతం.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004WQGR.jpg

దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో మొత్తం 11,41,642 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 57.53 కోట్లకుపైగా (57,53,94,042) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 1.66 శాతంగా ఉంది. గత 102 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా నమోదవుతోంది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.61 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు గత 36 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా, 119 రోజులుగా 5 శాతం కంటే తక్కువగా నమోదవుతోంది. 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0056SBI.jpg

 

****



(Release ID: 1761047) Visitor Counter : 170