రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

'ఆజాది కా అమృత్ మహోత్సవ్‌'లో భాగంగా సైక్లింగ్ ర్యాలీ

Posted On: 23 SEP 2021 6:03PM by PIB Hyderabad

భార‌తదేశ 75వ స్వాతంత్ర్య దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని నిర్వ‌హిస్తోన్న  ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా తుగ్ల‌కాబాద్ ఎయిర్‌ఫోర్స్ స్టేష‌న్ సైక్లింగ్ యాత్రను చేప‌ట్టింది. ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ తుగ్లకాబాద్ మరియు ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ప్రహ్లాద్‌పూర‌ల నుండి 40 మంది వాయుసేన యోధుల‌ బృందం ఈ  సైక్లింగ్ యాత్రలో పాల్గొంది. ఎయిర్ ఫోర్స్ స్టేషన్ తుగ్లకాబాద్
ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ అయిన ఎయిర్ కమాడోర్ వై ఉమేష్ ఈ బృందానికి మొత్తంగా అధ్య‌క్ష‌త వ‌హించారు.  ఈయ‌న‌తో పాటు  ప్ర‌హ్లాద్‌పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌కు స్టేషన్ కమాండర్ గ్రూప్ కెప్టెన్ డీవీబీకే మెహర్‌కూడా గ్రూపు సార‌థ్యం వ‌హించారు. 18 సెప్టెంబర్ 21న న్యూఢిల్లీలోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ తుగ్లకాబాద్‌లో ఈ యాత్రను ప్రారంభించారు. ఈ బృందం 18 సెప్టెంబర్ 21న న్యూఢిల్లీలోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ తుగ్లకాబాద్ నుండి షాహిద్ స్మారక్ వరకు.. దాదాపుగా 90 కిలోమీటర్ల‌కు పైగా దూరం ప్రయాణించింది. భారత వైమానిక దళంలో అందుబాటులో ఉన్న కెరీర్ అవకాశాలపై యువతలో అవగాహన కల్పించడానికి మీరట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వద్ద ఈ బృందం ఆగి మరియు సాహస స్ఫూర్తిని ప్రదర్శించింది.

***

 



(Release ID: 1757449) Visitor Counter : 151