ఆర్థిక మంత్రిత్వ శాఖ

కుశీనగర్ విమానాశ్రయాన్ని కస్టమ్స్ నోటిఫైడ్ విమానాశ్రయంగా ప్రకటన

Posted On: 15 SEP 2021 4:33PM by PIB Hyderabad

ఉత్తరప్రదేశ్‌లోని కుశీనగర్ విమానాశ్రయాన్ని కస్టమ్స్ నోటిఫైడ్ విమానాశ్రయంగా 'కేంద్ర పరోక్ష పన్నులు, సుంకాల బోర్డు' ‍(సీబీఐసీ) ప్రకటించింది. 13.09.2021న, నోటిఫికేషన్‌ నంబర్‌ 72/2021-కస్టమ్స్‌ (ఎన్‌.టి.) ద్వారా నోటిఫై చేసింది. బౌద్ధ యాత్రికులు సహా అంతర్జాతీయ ప్రయాణీకులు కూడా ఇక్కడి నుంచి రాకపోకలు సాగించవచ్చు.
 

****



(Release ID: 1755242) Visitor Counter : 166