ప్రధాన మంత్రి కార్యాలయం

పారాలింపిక్స్ ఆట‌ల లో జావెలిన్ విభాగం లో ర‌జ‌త ప‌త‌కాన్ని గెలిచినందుకు శ్రీ దేవేంద్ర ఝాఝ‌రియా కు అభినంద‌న‌లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 30 AUG 2021 9:47AM by PIB Hyderabad

టోక్యో లో పారాలింపిక్స్ ఆట‌ల లో జావెలిన్ విభాగం లో ర‌జ‌త ప‌త‌కాన్ని గెలిచినందుకు శ్రీ దేవేంద్ర ఝాఝ‌రియా కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినంద‌న‌ లు తెలిపారు.

 

‘‘శ్రేష్ఠమైనటువంటి ప్ర‌ద‌ర్శ‌న ను ఇచ్చారు @DevJhajharia!  మ‌న‌కు ఉన్న అత్యంత అనుభ‌శీలురైన క్రీడాకారుల లో ఒక‌రు ర‌జ‌త ప‌త‌కాన్ని గెలిచారు.  శ్రీ దేవేంద్ర  భార‌త‌దేశం నిరంత‌రం గ‌ర్వపడేటట్లు చేస్తూ వ‌స్తున్నారు.  ఆయ‌న భావి ప్ర‌యాస‌ల లో కూడా ను రాణించాలి అని ఆకాంక్షిస్తున్నాను’’ అని ప్ర‌ధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
 

 

***

DS/SH



(Release ID: 1750380) Visitor Counter : 111