మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

లాక్ డౌన్ సమయంలో ఆన్‌లైన్ తరగతులు

Posted On: 29 JUL 2021 3:07PM by PIB Hyderabad

విద్యార్థులందరికీ ఆన్‌లైన్ లో చదువుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి  తీసుకుని రావడానికి ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్‌లో భాగంగా  2020 మే 17 న  పిఎం ఈ విద్య కార్యక్రమం  ప్రారంభించబడింది.  దీనిద్వారా  విద్యను  డిజిటల్ / ఆన్‌లైన్ / ఆన్-ఎయిర్ విద్య సౌకర్యాలను ఒకేచోట అందించడం జరుగుతుంది.  చేస్తుంది.  దీని  ద్వారా అమలు జరుగుతున్న కార్యక్రమాలు :

* రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల్లో పాఠశాల విద్య కోసం నాణ్యమైన ఇ-కంటెంట్‌ను అందించడానికి దేశ డిజిటల్ మౌలిక సదుపాయాల వేదికగా  డిక్షా (ఒక దేశంఒక డిజిటల్ ప్లాట్‌ఫాం) ప్రారంభం అయ్యింది. దీనిద్వారా అన్ని తరగతులకు సంబంధించిన పాఠ్యపుస్తకాలను క్యూఆర్ కోడ్ తో అందుబాటులో ఉంచడం జరిగింది. 

నుంచి 12 తరగతి వరకు ప్రత్యేకంగా ఒక స్వయం ప్రభ  టీవీ ఛానెల్ (ఒక తరగతిఒక ఛానల్).

* రేడియోసామాజిక  రేడియో మరియు సీబీఎస్ఈ పోడ్కాస్ట్- శిక్షావాణి ల  విస్తృతమైన ఉపయోగం.

* దృశ్యపరంగా మరియు వినికిడి లోపం ఉన్నవారికి సంకేత భాషలో ప్రత్యేక ఇ-కంటెంట్ డిజిటల్  సమాచార వ్యవస్థ (DAISY) మరియు NIOS వెబ్‌సైట్ / యూట్యూబ్‌లో అభివృద్ధి చేయబడింది. 

ఈ పథకాలు / కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరికీ అందుబాటులో ఉన్నాయి. 

ఆన్‌లైన్ విద్యను ప్రోత్సహించడానికి యుజిసి అవసరమైన నియంత్రణను విడుదల చేసింది. దీనితో విశ్వవిద్యాలయాలకు పూర్తి స్థాయి ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌ను అందించడానికి వీలు కలుగుతుంది. కోవిడ్ -19 సమయంలో జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇంతవరకు యూజీసీ స్వయం మరియు ఓడిఎల్ రెగ్యులేషన్స్ నిబంధనల 20% వరకు ఉన్న ఆన్‌లైన్ కోర్సులను 40%కి పెంచడం జరిగింది. .  ఇ-వనరుల సమర్ధ వినియోగానికి కూడా ఇది దోహదపడుతుంది. 

 విద్యా మంత్రిత్వ శాఖ వివిధ డిజిటల్ కార్యక్రమాలను కూడా అమలు చేస్తున్నది.విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకుని రావడానికి   స్వయం స్వయం ప్రభనేషనల్ డిజిటల్ లైబ్రరీ (ఎన్ డి ఎల్)వర్చువల్ ల్యాబ్ఈ-యంత్రనీట్ (టెక్నాలజీ కోసం నేషనల్ ఎడ్యుకేషన్ అలయన్స్)ఫోసీ (ఉచిత ఓపెన్-సోర్స్ సాఫ్ట్‌వేర్  విద్య) మొదలైన కార్యక్రమాలు దీనిలో ఉన్నాయి.

 

 ఈ సమాచారాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ఈ రోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో ఇచ్చారు.

***


(Release ID: 1740357)