గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
స్మార్ట్ సిటీస్ మిషన్ కింద జూన్ 2021 నాటికి 2,734 ప్రాజెక్టులు పూర్తి
Posted On:
28 JUL 2021 3:01PM by PIB Hyderabad
జనవరి 2016 నుండి జూన్ 2018 వరకు 4 రౌండ్ల పోటీ ద్వారా ఎంపిక చేసిన 100 నగరాల్లో స్మార్ట్ సిటీస్ మిషన్ (ఎస్సీఎం) అమలు చేయబడుతోంది. 30 జూన్, 2021 నాటికి, ఈ నగరాలు రూ.1,79,413 కోట్ల మేర విలువైన 5,956 ప్రాజెక్టులు టెండర్ చేయబడినాయి; ఇందులో రూ.1,48,029 కోట్ల విలువైన దాదాపు 5,314 ప్రాజెక్టులకు సంబంధించిన వర్క్ ఆర్డర్లు జారీ చేయబడ్డాయి; వీటిలో రూ.7 46,769 కోట్ల విలువైన 2,734 ప్రాజెక్టులు పూర్తి చేయబడినాయి. 2021 జూన్ నాటికి కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీల కోసం రాష్ట్రాలకు / కేంద్ర పాలిత ప్రాంతాలకు రూ.23,925 కోట్ల మేర నిధులను విడుదల చేసింది. జనవరి, 2016లో రౌండ్-1లో ఎంపిక చేసిన మొత్తం 20 స్మార్ట్ సిటీలలోని ఆయా ప్రాజెక్టుల స్థితిగతులు కిందన ఇవ్వబడ్డాయి.
(మొత్తం రూ.కోట్లలో)
స్మార్ట్సిటీ
|
టెండర్ దశ
|
వర్క్ ఆర్డర్ దశ
|
ముగిసిన పనులు
|
మొత్తం ప్రాజెక్టులు
|
మొత్తం నిధులు
|
ప్రాజెక్టుల సంఖ్య
|
నిధులు
|
ప్రాజెక్టుల సంఖ్య
|
నిధులు
|
ప్రాజెక్టుల సంఖ్య
|
నిధులు
|
మొదటి రౌండ్ నగరాలు
(20 నగరాలు)
|
127
|
11,750
|
548
|
26,966
|
1,119
|
18,408
|
1,794
|
57,124
|
(ఎస్సీఎం జియో-స్పేషియల్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, 30 జూన్, 2021)
రౌండ్-1 లో ఎంపిక చేసిన స్మార్ట్ సిటీలకు చెందిన స్మార్ట్ సిటీల ప్లాన్లలో భాగమైన రూ. 57,124 కోట్ల విలువైన 1,794 ప్రాజెక్టులలో.. రూ.45,374కోట్ల (79%) విలువైన 1,667 ప్రాజెక్టులు (93%) పూర్తయ్యాయి లేదా అమలు దశలో ఉన్నాయి. ఈ నగరాలలో చేపట్టిన ఆయా ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సమాచారాన్ని గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ కౌషల్ కిషోర్ ఈ రోజు రాజ్యసభకు ఇచ్చిన ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
*****
(Release ID: 1740035)
Visitor Counter : 190