సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన - శ్రీ జి కిషన్ రెడ్డి


సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన - శ్రీమతి మీనాక్షి లేఖీ, శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్

Posted On: 08 JUL 2021 5:35PM by PIB Hyderabad

కేంద్ర మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రిగా, న్యూఢిల్లీ లోని శాస్త్రి భవన్‌లో, ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. అదే సమయంలో, శ్రీమతి మీనాక్షి లేఖీ, శ్రీ అర్జున్ రామ్  మేఘ్వాల్  కూడా సాంస్కృతిక శాఖ సహాయ మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు.

ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖతో పాటు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గా కూడా శ్రీ కిషన్ రెడ్డి నియమితులయ్యారు.  అంతకుముందు ఆయన హోం శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 

ఈ సందర్భంగా, శ్రీ కిషన్ రెడ్డి, మీడియాతో మాట్లాడుతూ, ప్రధానమంత్రి ఆశయాలను నెరవేర్చే దిశగా పూర్తి నిబద్ధతతో పని చేస్తానని పేర్కొన్నారు.

శ్రీ జి. కిషన్ రెడ్డి తెలంగాణ లోని సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి 2019 లో 17 వ లోక్ సభకు పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు.

గుండె జబ్బులతో బాధపడే చిన్నపిల్లల కోసం ఆయన చేసిన కృషి వంటి అనేక ప్రత్యేకమైన కార్యక్రమాలకు, శ్రీ కిషన్ రెడ్డి నాయకత్వం వహించారు.  ఈ సేవకు గుర్తింపుగా, ఆయనకు, యునిసెఫ్ (ఐక్యరాజ్యసమితి) ద్వారా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో "ఉత్తమ పిల్లల-స్నేహ పూర్వక శాసనసభ్యునిగా" అవార్డు లభించింది.  ఉగ్రవాదానికి వ్యతిరేకంగా, ఆయన, ఒక ప్రచారాన్ని ప్రారంభించడంతో పాటు, న్యూఢిల్లీలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ యువజన సమావేశాన్ని (ఐ.వై.సి.టి) నిర్వహించారు.  ఏ సమావేశంలో, 54 కి పైగా దేశాల నుండి 193 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు.  ఆయన "సీమ సురక్ష జాగరణ యాత్ర", మరియు "తెలంగాణ పోరుయాత్ర" కూడా నిర్వహించారు.

అమెరికా లోని మేరీల్యాండ్ ఇండియా బిజినెస్ రౌండ్ టేబుల్ (ఎం.ఐ.బి.ఆర్.టి) ద్వారా, 2009 సంవత్సరానికి అత్యుత్తమ యువ నాయకత్వ పురస్కారాన్ని,  అదేవిధంగా, ప్రపంచ శాంతి కోసం ఆయన చేసిన కృషికి గుర్తింపుగా, బల్గేరియా లోని సోఫియా లో, యూనియన్ ఆఫ్ బల్గేరియన్ కమాండోస్ పతకాన్ని కూడా, శ్రీ కిషన్ రెడ్డి అందుకున్నారు.

వృత్తి రీత్యా న్యాయవాది అయిన, శ్రీమతి మీనాక్షి లేఖి, 2014 నుంచి, న్యూఢిల్లీ పార్లమెంట్ నియోజకవర్గానికి, లోక్ సభ సభ్యురాలిగా వ్యవహరిస్తున్నారు.  బిల్లుల కోసం ముఖ్యమైన ముసాయిదా కమిటీలతో సహా పలు కమిటీలలో ఆమె సభ్యురాలుగా ఉన్నారు. 

శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్,  2009 నుంచి రాజస్థాన్ లోని బికనెర్ నియోజకవర్గం నుండి లోక్ సభ సభ్యునిగా కొనసాగుతున్నారు.  ఈ కొత్త బాధ్యతలకు ముందు, ఆయన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మరియు భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థల శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.  ఆయన, జల వనరులు, నదుల అభివృద్ధి, గంగా పునరుజ్జీవన మంత్రిత్వ శాఖలోనూ; ఆర్థిక మంత్రిత్వ శాఖలోనూ; కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోనూ;  సహాయ మంత్రిగా సేవలందించారు.  పార్లమెంటు సభ్యునిగా రెండవ సారి ఎంపికైన కాలంలో, లోక్‌సభలో, ఆయన, భారతీయ జనతా పార్టీకి చీఫ్ విప్ గా ఉన్నారు.  శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్ ను,  లోక్ సభలో సభా కమిటీ ఛైర్మన్ గా, లోక్ సభ స్పీకర్, నియమించారు.  2013 లో ఉత్తమ పార్లమెంట్ సభ్యునిగా ఆయన అవార్డు పొందారు.



(Release ID: 1733981) Visitor Counter : 231