బొగ్గు మంత్రిత్వ శాఖ

అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం 2021 సంద‌ర్భంగా వాక్సినేష‌న్ శిబిరాన్ని నిర్వ‌హించిన సిఎంపిడిఐఎల్‌

Posted On: 21 JUN 2021 7:30PM by PIB Hyderabad

 అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం 2021 సంద‌ర్భంగా సిఎంపిడిఐఎల్ ప్రాంగ‌ణంలో రాంచీ జిల్లా పాల‌న యంత్రాంగం స‌హ‌కారంతో సిఎంపిడిఐఎల్‌ (కేంద్ర కార్యాల‌యం) సోమ‌వారం వాక్సినేష‌న్ శిబిరాన్ని నిర్వ‌హించింది. 
సిఎంపిడిఐఎల్ సిఎండి మ‌నోజ్ కుమార్ ఈ టీకా శిబిరాన్ని ప్రారంభించారు. సిఎంపిడిఐఎల్ డెప్యూటీ సిఎంఒ డాక్ట‌ర్ శిల్పి స్వ‌రూప్‌, డాక్ట‌ర్ ఓం ప్ర‌కాష్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో 18-44 మ‌ధ్య వ‌య‌సుగ‌ల 100 మందికి పైగా స‌భ్యులు మొద‌టి ద‌శ టీకా వేయించుకున్నారు. 
ఈ కార్య‌క్ర‌మంలో డైరెక్ట‌ర్ ఎ.కె. రాణా, డైరెక్ట‌ర్ ఎస్‌.కె. గొమాస్తా, ఇతర ప్ర‌ముఖులు పాల్గొన్నారు. 

***



(Release ID: 1729261) Visitor Counter : 119


Read this release in: English , Urdu , Hindi , Tamil