జల శక్తి మంత్రిత్వ శాఖ

2021-22 ఆర్థిక సంవత్సరానికి జల్ జీవన్ మిషన్ కింద 15 రాష్ట్రాలకు రూ.5,968 కోట్ల సెంట్రల్ గ్రాంట్‌ను విడుదల చేసిన ప్రభుత్వం

Posted On: 17 MAY 2021 4:16PM by PIB Hyderabad

భారత ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరంలో జల్ జీవన్ మిషన్ అమలు కోసం 15 రాష్ట్రాలకు రూ.5,968 కోట్లను విడుదల చేసింది . ఈ ఆర్థిక సంవత్సరంలో విడుదల కానున్న నాలుగు విడతల్లో ఇది మొదటిది.  ఇతర 17 రాష్ట్రాలు / యుటిలు నిధుల విడుదల కోసం తమ ప్రతిపాదనలను నేషనల్ జల్ జీవన్ మిషన్‌కు పంపమని కోరారు.

జల్ జీవన్ మిషన్ కింద కేటాయించిన కేంద్ర నిధిలో 93% నిధులు నీటి సరఫరా మౌలిక సదుపాయాల అభివృద్ధికి, 5% సహాయక కార్యకలాపాలకు మరియు 2% నీటి నాణ్యత పర్యవేక్షణ మరియు నిఘా కార్యకలాపాలకు ఉపయోగించబడుతుంది. రాష్ట్రాలు / యుటిలలో అందించిన పంపు నీటి కనెక్షన్ల పరంగా మరియు అందుబాటులో ఉన్న కేంద్ర మరియు సరిపోయే రాష్ట్ర వాటాను ఉపయోగించడం ఆధారంగా కేంద్ర నిధులను భారత ప్రభుత్వం విడుదల చేస్తుంది.

సెంట్రల్ ఫండ్ విడుదలైన 15 రోజుల్లోపు రాష్ట్ర వాటంతో పాటు విడుదల చేసిన సెంట్రల్ ఫండ్‌ను సింగిల్ నోడల్ ఖాతాకు బదిలీ చేయాలి. రాష్ట్ర వాటాను సరిపోల్చడానికి రాష్ట్రాలు సదుపాయం కల్పించాలి మరియు అమలు చేసే ఏజెన్సీలకు నిధుల కొరత లేకుండా చూడాలి. సరైన వ్యయ ప్రణాళికను తయారుచేయడం ద్వారా ఏడాది పొడవునా ఖర్చును సమానంగా పంపిణీ చేయడానికి అవకాశం లభిస్తుంది.

ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నందున జల్ జీవన్ మిషన్ బడ్జెట్ కేటాయింపు గణనీయంగా  2021-22లో రూ. 50,011 కోట్లకు చేరింది. వీటితో పాటు, 15 వ ఆర్థిక కమిషన్ టై-గ్రాంట్లు పిఆర్‌ఐలకు ‘నీరు, పారిశుధ్యం’ పనులకు రూ.26,940 కోట్లు కూడా అందుబాటులో ఉంటుంది. అదనంగా, మ్యాచింగ్ స్టేట్ షేర్ మరియు బాహ్యంగా సహాయపడే ప్రాజెక్టుల ద్వారా కూడా ఫండ్ లభిస్తుంది. ఈ విధంగా, 2021-22లో  గ్రామీణ గృహాలకు పంపు నీటి సరఫరా ఉండేలా దేశంలో రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టాలని యోచిస్తున్నారు. ‘హర్ ఘర్ జల్’ లక్ష్యాన్ని సాధించడానికి రాబోయే మూడేళ్లలో ఈ తరహా పెట్టుబడులు కొనసాగే అవకాశం ఉంది.

ఈ మెరుగైన బడ్జెట్ కేటాయింపు గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై భారీగా ప్రభావం చూపుతుంది. ఇది నైపుణ్యం కలిగిన మరియు నైపుణ్యం లేని వారికి ఉపాధి కల్పన,  తాగునీటి సరఫరా మౌలిక సదుపాయాల నిర్వహణ , గ్రే వాటర్ శుద్ధి మరియు పునర్వినియోగానికి అవకాశం లభిస్తుంది. ఇది గ్రామాల్లో ఉత్పాదక ఆస్తుల కల్పనకు భారీ మౌలిక సదుపాయాల కల్పన కార్యకలాపాలను పెంచుతుంది. జెజెఎం కింద మోటార్లు, గొట్టాలు, కుళాయిలు, పైపులు మొదలైన వాటికి డిమాండ్ పెరగడంతో పాటు గ్రామాల్లో పనులు ప్రారంభం కావడంతో ఉత్పాదక రంగానికి భారీగా తోడ్పడుతుంది. గ్రామంలో నీటి సరఫరా వ్యవస్థలను అభివృద్ధి చేయడం మరియు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారు మసాన్లు, ప్లంబర్లు, పంప్ ఆపరేటర్లు మొదలైన వారికి భారీ ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

2024 నాటికి ప్రతి గ్రామీణ గృహానికి పంపు నీటి సరఫరాను అందించే లక్ష్యంతో 2019 ఆగస్టు 15 న ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ జల్‌ జీవన్ మిషన్‌ను  ప్రకటించారు. రాష్ట్రాలు / యుటిల భాగస్వామ్యంతో జల్ జీవన్ మిషన్ అమలు చేయబడుతోంది. కొవిడ్19 మహమ్మారితో పాటు లాక్‌డౌన్‌ కారణంగా సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ 4.17 కోట్లకు పైగా (21.76%) గృహాలకు పంపు నీటి సరఫరా అందించబడింది. ఇప్పుడు, 7.41 కోట్లు (38.62%) గ్రామీణ కుటుంబాలు కుళాయిల ద్వారా త్రాగునీటిని పొందుతున్నాయి. గోవా, తెలంగాణ, అండమాన్ & నికోబార్ దీవులు మరియు పుదుచ్చేరి ‘హర్ ఘర్ జల్’ రాష్ట్రం / యుటిగా మారాయి. ఇంకా, ఈక్విటీ మరియు కలుపుకొనిపోయే సూత్రాన్ని అనుసరించి అనగా ‘గ్రామంలో అందరికీ’ జల్ జీవన్ మిషన్ కింద 61 జిల్లాల్లో మరియు 89 వేలకు పైగా గ్రామాలలో నివసిస్తున్న ప్రతి గ్రామీణ కుటుంబానికి కుళాయి నీటి సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమం అమలులో రాష్ట్రాలు / యుటిలు ఇప్పుడు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. దేశంలోని ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు లభించేలా లక్ష్యంగా దృష్టి సారించాయి.

2021-22 కేంద్ర బడ్జెట్ ప్రకటించిన తరువాత జల్ జీవన్ మిషన్ ప్రణాళిక మరియు అమలుపై చర్చించడానికి కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖ అధ్యక్షతన అన్ని రాష్ట్రాల / యుటిల గ్రామీణ నీటి సరఫరా / పిహెచ్‌ఇడి ఇన్‌చార్జి మంత్రుల సమావేశం జరిగింది. 2021-22 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 9 నుండి ప్రారంభమయ్యే వార్షిక కార్యాచరణ ప్రణాళికలను (ఆప్) ఖరారు చేయడానికి కఠినమైన ఉమ్మడి సమీక్ష వ్యాయామంతో ప్రారంభమైంది. ఈ మూడవ సంవత్సరం జేజేఎంకి ఇంటెన్సివ్ ప్లానింగ్ అవసరం. గత రెండు సంవత్సరాల పురోగతి, సంస్థాగత సంసిద్ధత మొదలైన వాటి ఆధారంగా పనులను అమలు చేయడానికి రాష్ట్రాలు / యుటిల సామర్థ్యాన్ని అంచనా వేయడం అవసరం.

కార్యక్రమం అమలులో రాష్ట్రాలు / యుటిలు నీటి నాణ్యత ప్రభావిత ప్రాంతాలు, కరువు పీడిత మరియు ఎడారి ప్రాంతాల్లోని గ్రామాలు, షెడ్యూల్డ్ కులం / షెడ్యూల్డ్ తెగ మెజారిటీ గ్రామాలు, యాస్పిరేషనల్ & జెఇ-ఎఇఎస్ ప్రభావిత జిల్లాలు మరియు సంసాద్ ఆదర్శ్ గ్రామ యోజన గ్రామాలకు అన్ని గృహాలకు వేగవంతమైన పద్ధతిలో ట్యాప్ కనెక్షన్‌ అందించడానికి ప్రాధాన్యత ఇవ్వాలి.

అవగాహన, కమ్యూనికేషన్ సామర్థ్యం పెంపొందించడంతో పాటు సహాయక చర్యలలో గ్రామ నీరు & పారిశుద్ధ్య కమిటీలు (విడబ్ల్యుఎస్సి) / పానీ సమితీలు, గ్రామ కార్యాచరణ ప్రణాళికల (విఐపి) తయారీ మరియు ఆమోదం ఉన్నాయి. రాష్ట్రాలు / యుటిలు స్థానిక సమాజ సభ్యులకు మేసన్, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, మోటారు మెకానిక్స్, ఫిట్టర్, పంప్ ఆపరేటర్లు మొదలైన వారికి  శిక్షణ మరియు నైపుణ్య కార్యక్రమాలను అమలు చేయాలి.

వాటర్ క్వాలిటీ మానిటరింగ్ & సర్వైలెన్స్ (డబ్ల్యుక్యూఎంఎస్) కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ప్రయోగశాలల ఏర్పాటు, దాని అక్రిడిటేషన్ / అప్‌గ్రేడేషన్, శిక్షణ / సామర్థ్యం పెంపొందించడం, ఐఇసి కార్యకలాపాలు నిర్వహించడం, ప్రతి గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు ముఖ్యంగా గ్రామ స్థాయిలో ఫీల్డ్ టెస్ట్ కిట్‌లను ఉపయోగించి పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలను ఉపయోగించి నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించడానికి శిక్షణ పొందాలి.

కార్యక్రమం అమలులో పారదర్శకతను తీసుకురావడానికి మరియు పౌరులకు సమాచారాన్ని అందుబాటులో ఉంచడానికి ఎన్‌జేజేఎం జేజేఎం డాష్‌బోర్డ్‌ను అభివృద్ధి చేసింది. తద్వారా ఈ కార్యక్రమ పురోగతి మరియు పంపు నీటి సరఫరా స్థితి పబ్లిక్ డొమైన్‌లో లభిస్తుంది. జెజెఎం డాష్‌బోర్డ్ దేశం  వివరణాత్మక సమాచారాన్ని అందించడమే కాక, రాష్ట్ర / యుటి స్థాయి, జిల్లా స్థాయి మరియు గ్రామ స్థాయిలో అమలు మరియు పురోగతి యొక్క స్థితిని చూడవచ్చు.

వివిధ గ్రామాలలో జరుగుతున్న ‘సెన్సార్-ఆధారిత ఐవోటీ పైలట్ ప్రాజెక్టును కూడా జేజేఎం డాష్‌బోర్డ్ చూపిస్తుంది. ఇది పరిమాణం, నాణ్యత మరియు క్రమబద్ధత పరంగా రోజువారీ నీటి సరఫరా స్థితిని చూపుతుంది. ఈ పైలట్లలో రోజువారీ నీటి నాణ్యత మరియు తలసరి సరఫరా చూడవచ్చు. ఈ డాష్‌బోర్డ్‌ను ఇక్కడ యాక్సెస్ చేయవచ్చు: https://ejalshakti.gov.in/jjmreport/JJMIndia.aspx.

 

***



(Release ID: 1719433) Visitor Counter : 235