భారత ఎన్నికల సంఘం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ శాసన మండలుల‌కు శాసన సభ్యుల‌చే (ఎమ్మెల్యేలు) జ‌ర‌గాల్సిన ద్వైవార్షిక ఎన్నిక‌లు వాయిదా

प्रविष्टि तिथि: 13 MAY 2021 4:02PM by PIB Hyderabad

స్థానిక శాస‌న స‌భ్యులచే ఆంధ్రప్రదేశ్ శాస‌న మండ‌లికి ఎన్నికైన 03 (ముగ్గురు) సభ్యులు, తెలంగాణ శాస‌న మండ‌లికి ఎన్నికైన 06 (ఆరుగురు) సభ్యుల పదవీ కాలం వ‌రుస‌గా 31.05.2021, 03.06.2021 తేదీల్లో ముగియ‌నుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి:

 

నియోజకవర్గం యొక్క తరగతి

రిటైర్మెంట్ తేదీ

సీట్ల‌ సంఖ్య

ఎల‌క్ట‌ర్లు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌

ఎంఎల్ఏల‌తో

31.05.2021

03

శాసనసభ సభ్యులు

తెలంగాణ‌

ఎంఎల్ఏల‌తో

03.06.2021

06

శాసనసభ సభ్యులు

 

2. ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951 లోని సెక్షన్ 16 లోని నిబంధనల ప్రకారం, సభ్యుల పదవీకాలం ముగియడంతో ఖాళీగా ఉండబోయే రాష్ట్ర శాసనమండలి స్థానాల‌ను, ద్వివార్షిక ఎన్నికలను నిర్వహించడంతో నింపాలి. ఈ ఎన్నిక‌ల్ని ఆయా స‌భ్యుల ప‌ద‌వీకాలం గ‌డువు ముగిసేందుకు ముందు నిర్వ‌హించాలి.

3. ఈ విషయాన్ని కమిషన్ ఈ రోజు సమీక్షించింది. దేశంలో కోవిడ్ రెండో ద‌శ వ్యాప్తి వేగంగా జ‌రుగుతున్నందున మహమ్మారి త‌గ్గుముఖం ప‌ట్టేంత వ‌ర‌కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ శాసన మండలుల‌కు నిర్ధారిత ద్వైవార్షిక ఎన్నికల‌ను నిర్వహించడం సముచితం కాదని నిర్ణయించింది. కోవిడ్-19 వ్యాప్తి తగ్గ‌డం ఈ ద్వైవార్షిక ఎన్నికలు నిర్వహించడానికి పరిస్థితులు అనుకూలంగా మారేంత వ‌ర‌కు ఎన్నిక‌లు స‌రికాద‌ని క‌మిష‌న్ అభిప్రాయ‌ప‌డింది.

***


(रिलीज़ आईडी: 1718369) आगंतुक पटल : 159
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil