గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ

మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్‌కు సంబంధించిన ప్రధాన మంత్రి ఫార్మలైజేషన్ కోసం ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ మరియు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖల భాగస్వామ్యం

Posted On: 08 APR 2021 12:29PM by PIB Hyderabad

వివిధ పథకాల అమలు కోసం మంత్రిత్వ శాఖల మధ్య భాగస్వామ్యం రూపొందించడం ముఖ్యమైన అజెండాలో ఒకటిగా చేయడానికి ప్రభుత్వం  ప్రయత్నిస్తోంది. తద్వారా వనరుల వినియోగం ఆప్టిమైజ్ చేయడంతో పాటు ప్రజలకు గరిష్ఠ ప్రయోజనాలు అందుతాయి.

ప్రస్తుతమున్న మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థల అభివృద్ధికి ఆర్థిక, సాంకేతిక మరియు వ్యాపార సహకారాన్ని అందించే ఉద్దేశ్యంతో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ (ఎంవోఎఫ్‌పిఐ) అఖిల భారత “కేంద్ర ప్రాయోజిత ప్రధాన్ మంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్” (పిఎం ఎఫ్ఎంఈ) పథకాన్ని ప్రారంభించింది. 2020-21 నుండి 2024-25 వరకు ఐదేళ్ల కాలంలో రూ .10,000 కోట్లతో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.

ఆహార ప్రాసెసింగ్‌లో స్వయం సహాయక బృందం (ఎస్‌హెచ్‌జి) వ్యవస్థాపకులకు తోడ్పడటానికి పిఎం-ఎఫ్‌ఎంఈ అమలుపై కలిసి పనిచేయడానికి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ మరియు దీన్‌దయాళ్‌ యోజన- గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్‌లు అంగీకరించింది. ఈ పథకం యొక్క అన్ని దశల్లో  రెండు మంత్రిత్వ శాఖలు స్వయం సహాయక సంఘ సభ్యులకు మూలధన సహాయాన్ని అందించే అంశంపై కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాయి. ఇందులో భాగంగా  మూలధన వ్యయం కింద సాధనాల కొనుగోలుకు ఆయా సంస్థల టర్నోవర్‌, అవసరం ఆధారంగా ఒక్కో గ్రూప్‌ సభ్యుడికి గరిష్టం రూ.40,000/ అందజేస్తారు.పథకంలో ఈ కార్యక్రమ అమలును సులభతరం చేయడానికి జాతీయ స్థాయిలో రెండు మంత్రిత్వ శాఖల  బృందాలు ఈ పథకం, మార్గదర్శకాలు, ఉమ్మడి సలహాదారులు, శిక్షణ మరియు అవగాహన కార్యక్రమాలు మొదలైన వాటి కోసం కార్యాచరణను  రూపొందించడానికి  కలిసి పనిచేశాయి.

రాష్ట్రాలు /కేంద్రపాలిత ప్రాంతాల్లోని రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి మిషన్లు మరియు  ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ  నియమించిన రాష్ట్ర నోడల్ ఏజెన్సీలు ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి సమన్వయంతో నిర్వహిస్తున్నాయి.  అర్హత కలిగిన లబ్ధిదారులను గుర్తించడం, వారి ఆకాంక్షలను మరియు వృద్ధి ప్రణాళికలను తెలుసుకోవడం, డిజిటలైజ్ చేయడం, సమీక్షించడం, సిఫార్సు చేయడం మరియు ఆమోదించడం వంటివి ఇందులో ఉన్నాయి.

2020-21 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 17427 మంది లబ్ధిదారులను పరిశీలించి వారికి విత్తన మూలధన మద్దతు కోసం రూ. 51.85 కోట్లు సిఫార్సు చేయబడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, ఛత్తీస్‌గడ్, మహారాష్ట్ర, మిజోరం, ఒడిశా మరియు తెలంగాణ రాష్ట్రాలు మార్గదర్శకులుగా ఉన్నాయి.  మొత్తం లబ్ధిదారులలో 83% పైగా మరియు సిఫార్సు చేయబడ్డ మొత్తంలో 80 శాతం ఈ రాష్ట్రాలు కలిగి ఉన్నాయి.

ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గడ్‌, గోవా, గుజరాత్, హర్యానా,హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మేఘాలయ, ఒడిశా, రాజస్థాన్, సిక్కిం,తెలంగాణ, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లోని 6694 బృందాల్లోని 10314 మంది లబ్దిదారులకు రూ. 29.01 కోట్లు అందించడానికి ఆమోదం లభించింది. క్లస్టర్ లెవల్ ఫెడరేషన్స్ (సిఎల్ఎఫ్) మరియు విలేజ్ ఆర్గనైజేషన్స్ (విఒ) వంటి కమ్యూనిటీ సంస్థల నెట్‌వర్క్ ద్వారా ఆయా రాష్ట్రాలు సంబంధిత స్వయం సహాయక సంఘాలు మరియు స్వయం సహాయక సంఘ సభ్యులకు నిధులను విడుదల చేసే పనిలో ఉన్నాయి.

స్వయం సహాయక సంఘ సభ్యులచే నిర్వహించబడుతున్న గ్రామీణ ఆహార ప్రాసెసింగ్ సంస్థలను క్రమం తప్పకుండా పర్యవేక్షించడానికి ఒక బలమైన వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు.  ఈ కలయిక రెండు మంత్రిత్వ శాఖల బలాన్ని పెంచింది అలాగే ఆహార ప్రాసెసింగ్  రంగంలో గ్రామీణ మహిళల జీవనోపాధిని మరింత మెరుగుపరుస్తుంది.

***



(Release ID: 1710445) Visitor Counter : 184