శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

గ్లోబల్ బయో ఇండియా: ఆత్మ నిర్భర్ భారత్ సదస్సు: భారత్ మరియు ప్రపంచం కోసం

వ్యాక్సిన్ల అభివృద్ధి ప్రస్థానం: సమయాన్ని ఎలా కుదించవచ్చో మరియు శాస్త్రీయ సమీకరణను ఎలా ప్రారంభించవచ్చో, అద్భుతమైన ఉదాహరణలు: డాక్టర్ వినోద్ పాల్, సభ్యుడు-ఆరోగ్యం, నీతి ఆయోగ్

2012 లో 62 బిలియన్ డాలర్ల పరిమాణంలో ఉన్న భారత బయోటెక్ రంగం, 2025 నాటికి 150 బిలియన్లకు పెరుగుతుందని అంచనా: డా. వి. కె. సారస్వత్, సభ్యుడు, నీతి ఆయోగ్

డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్: " టీకా అభివృద్ధి విషయానికి వస్తే ప్రపంచ స్థాయిలో తయారీదారుగా మరియు ఆవిష్కర్తగా ఉండగల సామర్థ్యాన్ని భారతదేశం చూపించింది"

బిఐఆర్ఏసి సాంకేతిక సంకలనం 2021 విడుదల చేశారు

Posted On: 02 MAR 2021 12:01PM by PIB Hyderabad

అతిపెద్ద బయో-టెక్నాలజీ సమ్మేళనం గ్లోబల్ బయో ఇండియా 2021 ను కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ 2021 మార్చి 1 న ప్రారంభించారు. ప్రారంభ సమావేశంలో కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. మూడు రోజుల కార్యక్రమం బయోటెక్నాలజీ విభిన్న అంశాలపై వేర్వేరు సెషన్లలో చర్చిస్తున్నారు. గ్లోబల్ బయో ఇండియా మొదటి సమావేశం, దేశానికి పునరుత్తేజం, స్వయం సమృద్ధిని అందించడానికి 'మేక్ ఇన్ ఇండియా' ప్రచారం "ఆత్మనిర్భర్ భారత్ అభియాన్" గా ఎలా పరివర్తన చెందిందో చర్చించింది. ఈ సెషన్ జాతీయ ప్రాధాన్యతలను ప్రముఖంగా ప్రస్తావించింది, భారతదేశం అనుభవం నుండి ఉదాహరణలు కోవిడ్ మహమ్మారి సవాళ్లను దేశీయ ఆవిష్కరణ పర్యావరణ వ్యవస్థ అభివృద్ధికి అవకాశాలలో స్వయం సమృద్ధిని పొందే అవకాశాలు ఉదా., వ్యాక్సిన్, డ్రగ్స్, డయాగ్నోస్టిక్స్, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ (పిపిఇ) కిట్లు, వెంటిలేటర్లు, థర్మల్ స్కానర్లు, మాస్క్‌లు మొదలైనవాటిని ఎలా ముందుకు తీసుకెళ్ళిందో ఈ సదస్సులో ప్రస్తావనకు వచ్చింది. 

ఇన్వెస్ట్ ఇండియా సిఇఓ డాక్టర్ దీపక్ బాగ్లా , భారత్ మరియు ప్రపంచం కోసం ఆత్మనిర్భర్ భారత్ దృక్కోణం గురించి ఒక అవలోకనాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “భారతదేశం ప్రపంచంలోనే అత్యంత బహిరంగ ఆర్థిక వ్యవస్థలలో ఒకటి మరియు ప్రపంచంలోని అగ్రశ్రేణి గ్రీన్ ఫీల్డ్ గమ్యం . నేడు దేశం ప్రపంచంలోనే అతిపెద్ద, అతి పిన్నవయస్సు గలిగిన, అత్యంత చురుకైన ఆర్థిక వ్యవస్థ ” అని డాక్టర్ దీపక్ అన్నారు. 

ఈ కార్యక్రమం నెదర్లాండ్స్ మరియు స్విట్జర్లాండ్ నుండి రాయబారుల భాగస్వామ్యంతో ప్రపంచ దృక్పథాన్ని అందించింది. 

సైన్స్, టెక్నాలజీ, వ్యవసాయం పరంగా ప్రపంచానికి మరింత అంతర్జాతీయ సహకారం అవసరమని కోవిడ్-19 మనకు చూపించిందని భారతదేశంలోని నెదర్లాండ్స్ రాయబార కార్యాలయం రాయబారి మార్టిన్ వాన్ డెన్ బెర్గ్, నేపాల్, భూటాన్ వ్యాఖ్యానించారు. టీకా పంపిణీ విషయానికి వస్తే భారత్ డి విజయవంతమైన ప్రస్థానమనీ అని నిరూపితమైందిభారతదేశంలోని స్విట్జర్లాండ్ రాయబార కార్యాలయం మరియు భూటాన్ రాయబారి రాల్ఫ్ హెక్నర్ మాట్లాడుతూ “సైన్స్ మరియు ఇన్నోవేషన్ రంగాలలోని పరిష్కారాలలో భారతదేశంది పెద్దభాగం. భారతదేశం ప్రపంచంలో అత్యంత వినూత్న దేశాలలో ఒకటి అని 2021 బడ్జెట్ రుజువు చేసింది, ఇక్కడ ఆర్ అండ్ డి కోసం పెద్ద మొత్తాన్ని కేటాయించారు. ఆవిష్కరణ, అభివృద్ధి పరంగా భారత్ స్విట్జర్లాండ్‌ను అత్యంత పోటీతత్వ దేశంగా తెలుసుకోవాలని మేము కోరుకుంటున్నాము ” అని అన్నారు. 

నిజమైన ఆత్మనిర్భర్ బయో ఎకానమీని ఎలా సృష్టించాలి మరియు గ్లోబల్ ఫైనాన్సింగ్, ఆవిష్కరణ మరియు తయారీ పర్యావరణం ‌లో భాగంగా ఎలా ఉండాలనే దానిపై అంతర్దృష్టులు కూడా సమావేశంలో పరస్పరం ఆలోచనలను పంచుకున్నారు.

నీతి ఆయోగ్ సభ్యుడు(ఆరోగ్యం) డాక్టర్ వినోద్ పాల్, శాస్త్రీయ సమాజం చేసిన కృషిని ప్రశంసించారు మరియు మహమ్మారి సమయంలో సాధించిన పరిష్కారాలు వేగం అసాధారణమని అన్నారు. వ్యాక్సిన్ల అభివృద్ధి ప్రస్థానం, సమయాన్ని ఎలా కుదించవచ్చో మరియు శాస్త్రీయ సమీకరణను ప్రారంభించగల అద్భుతమైన ఉదాహరణలు. కోవిడ్-19 వ్యాక్సిన్ విషయానికి వస్తే ఉత్పాదక రంగంలో ప్రపంచ అడుగుజాడలను కలిగి ఉండాలనే ఉద్దేశం అత్యంత విభిన్నము, గర్వించదగ్గ విషయం. వ్యాక్సిన్ పంపిణీ కోసం మనం చేసినట్లుగా, త్వరగా పంపిణీ చేయగల సామర్థ్యం మనకు ఉందని గ్రహించాము” అని అన్నారు. నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి.కె.సరస్వత్ మాట్లాడుతూ, “నేడు ప్రపంచంలోనే పురాతన వృత్తిగా పిలువబడే బయోటెక్నాలజీ సాంకేతికంగా వివిధ రకాలుగా పెరిగిందిమహమ్మారి సమయంలో, బయోటెక్ రంగంలోని స్టార్టప్‌లు ప్రపంచానికి చూపించడానికి గొప్ప విజయ గాధలుగా పరిచయమయ్యాయి. 2012 లో 62 బిలియన్ డాలర్ల ఇండియా బయోటెక్ రంగం 2025 నాటికి 150 బిలియన్లకు పెరుగుతుందని అంచనా. భారతదేశాన్ని గ్లోబల్ వాల్యూ చైన్‌తో అనుసంధానించడానికి ఆత్మనిర్భర్ భారత్ ఒక విధాన చట్రం అని ప్రపంచ బ్యాంక్ కంట్రీ డైరెక్టర్ జునైద్ అహ్మద్ తెలిపారు.

హైదరాబాద్ ఐఐటి విశిష్ట ప్రొఫెసర్ - ఎన్బిడిఎస్ ఫార్ములేషన్ గ్రూప్ చైర్ ప్రొఫెసర్ ఎం విద్యాసాగర్ 2021-25 జాతీయ బయోటెక్నాలజీ అభివృద్ధి వ్యూహాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్ డాక్టర్ కిరణ్ మజుందార్ షా, ఆత్మనిర్భర్ భారత్ గురించి పరిశ్రమ పరంగా అవగాహన ఇచ్చారు.

ముగింపు వ్యాఖ్యలలో, డిబిటి ఇండియా కార్యదర్శి డాక్టర్ రేణు స్వరూప్ మాట్లాడుతూ గ్లోబల్ బయోఇండియా 2021 సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకురావడానికి మరియు స్థానికంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎలా బట్వాడా చేయగలదో చూడటానికి ఒక అవకాశం అని అన్నారు. భారతదేశానికే కాదు, ప్రపంచానికీ మనం స్వతంత్రంగా ప్రయత్నించాలి. మనకు ఎక్కడ లోపం ఉందో చూడటానికి మరియు మెరుగుపరచడానికి స్వీయ విశ్లేషణ చేయడం ప్రారంభించాలి. బిఐఆర్ఏసి టెక్నికల్ కాంపెడియం 2021  గ్లోబల్బయోఇండియా 2021 లో  బిఐఆర్ఏసి ఎండీ శ్రీమతి అంజు భల్లా సమక్షంలో విడుదల చేయబడింది. గ్లోబల్ బయో ఇండియా 2021  మూడవ సెషన్ 1 వ రోజు కోవిడ్ -19 పై భారత్ పోరాటాన్ని చర్చించారు. కోవిడ్-19 వ్యాక్సిన్ ప్రస్థానం సైన్స్ నుండి డెలివరీ వరకు క్లాస్ / బయో మాన్యుఫ్యాక్చరింగ్‌లో మొదటిది. ఈ సెషన్ మన దేశానికి మరియు ప్రపంచానికి కోవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధిలో భారత్ సహకారాన్ని ప్రదర్శించింది. సమిష్టి ప్రయత్నాల ఫలితంగా దేశీయంగా అభివృద్ధి చెందిన కోవాక్సిన్ రికార్డు సమయం మరియు కోవిషీల్డ్ బయో మ్యానుఫ్యాక్చరింగ్ సదుపాయాల బలమైన పర్యావరణ వ్యవస్థ ద్వారా విడుదలైంది. సెషన్‌ను ఉద్దేశించి, పిఎంయు మిషన్ డైరెక్టర్ డాక్టర్ షిర్షెందు ముఖర్జీ, శక్తివంతమైన పర్యావరణ వ్యవస్థను సృష్టించడానికి డిబిటి - బిరాక్ యొక్క సహకారాన్ని వివరించారు. ఫలితంగా బయోఫార్మా రంగంలో ఆర్ అండ్ డి మరియు తయారీలో ప్రధాన పాత్ర పోషించే దిగ్గజాల సంఖ్య పెరిగింది. అనేక టీకా కాండిడేట్స్ తయారీలో ఉన్నాయి, అభివృద్ధి వివిధ దశలలో ఉంది.

కాడిలా హెల్త్‌కేర్ లిమిటెడ్ కి చెందిన డాక్టర్ పంకజ్ పటేల్ మాట్లాడుతూ కోవిడ్ 19 మహమ్మారి, డిఎన్‌ఎ వ్యాక్సిన్ ప్లాట్‌ఫాం మరియు మీజిల్స్ వ్యాక్సిన్ ప్లాట్‌ఫామ్ సమయంలో రెండు వ్యాక్సిన్ ప్లాట్‌ఫారమ్‌లను ప్రయత్నించడం వ్యూహమని చెప్పారు. రెండు నెలలు 25 ° సెంటీగ్రేడ్ వద్ద స్థిరంగా ఉన్న మరియు చాలా ఇమ్యునోజెనిక్,  సురక్షితమైన వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడానికి భారీ సదుపాయాన్ని ఏర్పాటు చేయడం ఇతర కీలకమైన సమస్య.

కోవిడ్ -19 కేసులు ముఖ్యంగా యూరప్ మరియు అమెరికాలో పెరిగినందున, మేము చాలా క్లిష్టమైన జంక్షన్ వద్ద ఉన్నామని డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ నొక్కి చెప్పారు. వైరస్ విభిన్న వైవిధ్యాల గురించి ఇప్పుడు చాలా అనిశ్చితులు ఉన్నాయి. “భారతదేశం ప్రపంచ స్థాయిలో తయారీదారుగా ఉండగల సామర్థ్యాన్ని చూపించింది మరియు టీకా అభివృద్ధి విషయానికి వస్తే ఒక ఆవిష్కర్తగా కూడా ఉంది. వ్యాక్సిన్ల ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి పెద్ద ఎత్తున అవకాశం ఉంది, ఇది చాలా సమన్వయ విధానం ద్వారా ఆలోచించాల్సిన అవసరం ఉంది ”అని ఆమె చెప్పారు.

భారత్ బయోటెక్ కి చెందిన  డాక్టర్ కృష్ణ మోహన్ మాట్లాడుతూ తమ వద్ద మొత్తం టీకాలు ఉన్నాయని, వీటిలో 3 డబ్ల్యూహెచ్‌ఓ ముందస్తు అర్హత కలిగి ఉన్నాయని తెలిపింది. 100 రోజుల వ్యవధిలో వీటిని పెంచడానికి నియంత్రణ వ్యవస్థ మరియు ప్రభుత్వాల మద్దతు అవసరమని ఆయన వ్యాఖ్యానించారు.

టీకా అభివృద్ధి మరియు తయారీని పెంచడానికి, భారతదేశం వ్యాక్సిన్ అభివృద్ధి కార్యకలాపాలను మరింత పెంచడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల ద్వారా కీలకమైన జాతీయ మరియు అంతర్జాతీయ ప్రయత్నాలు పరపతి పొందాయి. వివిధ వేదికల టీకా కాండిడేట్స్ పోర్ట్‌ఫోలియోను కలిగి ఉన్న భారతదేశం ఒక ప్రత్యేకమైన స్థితిలో ఉంది. పర్యావరణ వ్యవస్థకు మద్దతు ఇచ్చే ఇతర కోవిడ్ 19 వ్యాక్సిన్ కాండిడేట్స్  ప్యానెల్ చర్చ రూపంలో చర్చలు ఒకే విధంగా కేంద్రీకరించబడ్డాయి.

***

 



(Release ID: 1701966) Visitor Counter : 257