ప్రధాన మంత్రి కార్యాలయం

సాధారణ బడ్జెట్ 2021-22 పై ప్రధానమంత్రి ప్రకటన

Posted On: 01 FEB 2021 3:52PM by PIB Hyderabad

నమస్కారం ,

 

అసాధారణ పరిస్థితుల మధ్య 2021 సంవత్సరానికి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. వాస్తవికత తో పాటు  ఇది అభివృద్ధి తాలూకు విశ్వాసాన్ని, భార‌త‌దేశాని కి త‌న‌పైన త‌న‌కు ఉన్న న‌మ్మకాన్ని చాటిచెప్తోంది. ప్రపంచంలో కరోనా సృష్టించిన ప్రభావం మొత్తం మానవజాతిని కదిలించింది. ఈ పరిస్థితుల మధ్య నేటి బడ్జెట్ భారతదేశ విశ్వాసాన్ని చాటి చెప్తోంది. ఈ బడ్జెటు ప్రస్తుత క‌ష్ట‌ కాలం లో ప్రపంచంలో ఓ కొత్త విశ్వాసాన్ని నింపుతుంది.

 

నేటి బడ్జెట్‌లో స్వయం సమృద్ధి తో పాటు  ప్రతి పౌరుడిని, ప్రతి తరగతిని చేర్చడం అనే దృష్టి కూడా ఉంది. ఈ బడ్జెట్‌లో మేము ముందుకు తెచ్చిన సూత్రాలు వృద్ధి కి కొత్త అవ‌కాశాల‌ ను క‌ల్పించ‌డం; యువ‌త‌ కు నూత‌న అవ‌కాశాల‌ ను సృష్టించడం; మాన‌వ వ‌న‌రులకు కొత్త పార్శ్వాన్ని జ‌త‌ చేయడం; మౌలిక స‌దుపాయాల‌ ను అభివృద్ధిపరచడం తో పాటు కొత్త కొత్త రంగాలు ఎద‌గ‌డానికి సాయ‌ప‌డ‌డం,ఆధునికత వైపు వెళ్లడం, కొత్త సంస్కరణలు తీసుకురావడం వంటివి భాగం గా ఉన్నాయి.

సహచరులారా,

ఈ బడ్జెట్‌లో, నియమాలు, విధానాలను సరళీకృతం చేయడం ద్వారా సామాన్య ప్రజల జీవితాల్లో 'జీవన సౌలభ్యం' పెంచడానికి ప్రాధాన్యత ఇవ్వబడింది. ఈ బడ్జెట్ వ్యక్తులు, పెట్టుబడిదారులు, పరిశ్రమలతో పాటు మౌలిక సదుపాయాల రంగంలో చాలా సానుకూల మార్పులను తెస్తుంది. దీనికి దేశ ఆర్థిక మంత్రి నిర్మలా గారికి , తోటి మంత్రి అనురాగ్ గారికి , ఆమె బృందానికి అభినందనలు తెలియజేస్తున్నాను.

 

సహచరులారా,

 

బడ్జెట్ ప్రారంభమైన రెండు గంటల్లోనే ఇన్ని సానుకూల స్పందనలు వచ్చిన బడ్జెట్లు చాలా అరుదుగా కనిపిస్తాయి. కరోనా కారణంగా, సామాన్య పౌరులపై ప్రభుత్వం భారాన్ని పెంచుతుందని చాలా మంది నిపుణులు భావించారు. కానీ ఆర్థిక స్థిరత్వం పట్ల తన బాధ్యతలను దృష్టిలో ఉంచుకుని - బడ్జెట్ పరిమాణాన్ని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది . బడ్జెట్ పారదర్శకంగా ఉండాలని మా  ప్రభుత్వం నిరంతర ప్రయత్నం చేసింది. ఈ బడ్జెట్ పారదర్శకతను నేడు చాలా మంది పండితులు ప్రశంసించినందుకు నేను సంతోషిస్తున్నాను.

 

సహచరులారా,

 

భారత్ ఎప్పుడూ కరోనా యుద్ధంలో ప్రతిక్రియాత్మకంగా ఉండటానికి బదులు సానుకూలంగా ఉంది. అది కరోనా కాలంలో చేసిన సంస్కరణలు లేదా స్వయం సమృద్ధిగల భారతదేశం యొక్క సంకల్పం కావచ్చు. అదే కార్యకలాపాన్ని పెంచేటప్పుడు, నేటి బడ్జెట్ లో ఎలాంటి ప్రతిక్రియాశీల‌మైన వైఖ‌రి లేదు. అదే సమయంలో, మేము క్రియాశీల‌త్వాని కంటే ఒక అడుగు ముందుకు వేసి, ఒక స‌క్రియాత్మక‌మైన బ‌డ్జెటు ను అందించాం తద్వారా దేశానికి సానుకూల సందేశాన్ని కూడా ఇచ్చాము. ఈ బడ్జెట్ ముఖ్యంగా సంపద మరియు శ్రేయస్సు రెండింటినీ వేగవంతం చేసే రంగాలపై దృష్టి పెట్టింది. ఎంఎస్‌ఎంఇలు, మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అదేవిధంగా, ఈ బడ్జెట్ ఆరోగ్య సంరక్షణపై దృష్టి సారించే విధానం కూడా అపూర్వమైనది. బడ్జెట్ లో దేశంలోని ప్రతి రంగంలో అభివృద్ధి అంటే సర్వతోముఖాభివృద్ధి గురించి మాట్లాడుతుంది. ముఖ్యంగా, దక్షిణాది రాష్ట్రాలు, మన ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తరాన లేహ్ లడక్ వంటి ప్రాంతాల అభివృద్ధిపై ఈ బడ్జెట్ ప్రత్యేక శ్రద్ధ చూపడం నాకు సంతోషంగా ఉంది. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ వంటి భారతదేశ తీర ప్రాంత రాష్ట్రాలను వ్యాపార శక్తి కేంద్రంగా మార్చడానికి ఈ బడ్జెట్ ఒక ప్రధాన ముందడుగు. అస్సాం వంటి ఈశాన్య రాష్ట్రాలలో  ఇంత‌వ‌ర‌కు వెలికి రాని శ‌క్తియుక్తుల‌ ను వినియోగించుకోవ‌డం లో సైతం ఈ బడ్జెట్ ఎంతగానో దోహదపడుతుంది. ప‌రిశోధ‌న‌, నూత‌న ఆవిష్కర‌ణ‌ల పై బ‌డ్జెటు వ‌హిస్తున్న శ్రద్ధ ను పునరుద్ఘాటించి, రూపొందించిన కేటాయింపులు మన యువతకు సాధికారతను అందిస్తుంది, భారతదేశం ఉజ్వల భవిష్యత్తుకొరకు ఒక దృఢమైన అడుగును వేస్తుంది.

 

సహచరులారా,

 

దేశంలోని సామాన్యులకు జీవితాన్ని సులభతరం చేయడానికి, ఆరోగ్యం, పరిశుభ్రత, పోషణ, స్వచ్ఛమైన నీరు లతో పాటు  అవకాశాల సమానత్వంపై ఈ బడ్జెట్‌లో ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడింది. బడ్జెట్ లో మౌలిక సదుపాయాల వ్యయంలో అనూహ్య పెరుగుదలతోపాటు అనేక వ్యవస్థాగత సంస్కరణలు చేశారు, ఇవి దేశంలో వృద్ధి మరియు ఉద్యోగాల కల్పన, ఉపాధికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయి. దేశంలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు, రైతుల ఆదాయం పెంచేందుకు బడ్జెట్ లో పలు కేటాయింపులు చేశారు. వ్యవసాయ రంగంలో రైతులకు మరింత సులభంగా రుణాలు లభించనున్నాయి. దేశంలోని మాండీలను అంటే ఎపిఎంసి లను మరింత బలోపేతం చేయడానికి వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధికి ఒక నిబంధన చేయబడింది. ఈ నిర్ణయాలన్నీ ఈ బడ్జెట్ లో గ్రామాలు, మన రైతులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని  తెలియజేస్తున్నాయి. ఎంఎస్‌ఎంఇ రంగానికి ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి, ఉపాధి అవకాశాలను పెంచేందుకు, గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఎంఎస్ ఎంఈ రంగ బడ్జెట్ కూడా రెట్టింపు అయింది.

 

సహచరులారా,

 

ఈ బడ్జెట్ దేశంలోని ప్రతి పౌరుడి పురోగతిని కలిగి ఉన్న స్వయం సమృద్ధి మార్గాన్ని ముందుకు తీసుకువెళ్ళింది. ఈ దశాబ్దపు ప్రారంభానికి ఈ బడ్జెట్ బలమైన పునాది వేయబోతోంది. స్వావలంబన భారతదేశ ఈ ముఖ్యమైన బడ్జెట్ కు నేను దేశప్రజలందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను మరోసారి ఆర్థిక మంత్రి కి , ఆమె బృందానికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

***

 



(Release ID: 1694151) Visitor Counter : 199