మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
దేశంలో ఏవియన్ ఇన్ఫ్లూయాంజా పరిస్థితి
Posted On:
23 JAN 2021 3:52PM by PIB Hyderabad
దేశంలో శనివారం నాటికి (23వ తేదీ జనవరి) తొమ్మిది రాష్ట్రాలలోని (కేరళ, హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఉత్తరా ఖండ్, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, పంజాబ్) పౌల్ట్రీ పక్షులలో ఏవియన్ ఇన్ఫ్లూయాంజా నిర్ధారణ అయింది.
దీనికి తోడు పన్నెండు రాష్ట్రాలలో కాకి/ వలస/ అడవి పక్షులలోనూ ఏవియన్ ఇన్ఫ్లూయాంజా (బర్డ్ ఫ్లూ) వ్యాప్తి నిర్ధారించబడింది. ఈ జాబితాలో హర్యానా, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ , హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, మరియు పంజాబ్ రాష్ట్రాలున్నాయి. రుద్రప్రయాగ్, లాన్స్ డౌనీ ఫారెస్ట్ రేంజ్, ఉత్తరాఖండ్లోని పౌడి ఫారెస్ట్ రేంజ్ నుండి సేకరించాన కాకి/ పావురాల నమూనాలు; దీనికి తోడు రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న శ్రీగంగ నగర్ జిల్లా నుండి సేకరించిన పావురాల నమూనాలు; ఉత్తర్ప్రదేశ్ లోని ఫతేపూర్ జిల్లా నుండి సమర్పించిన కాకి మరియు నెమలుల నమూనాలలో ఏవియన్ ఇన్ఫ్లూయాంజా నెగిటివ్గా నిర్ధారణ అయింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, పంజాబ్, ఉత్తర ప్రదేశ్, గుజరాత్, మరియు ఉత్తరాఖండ్, కేరళలలోని ప్రభావిత కేంద్రాలలో నియంత్రణ కార్యకలాపాలు(శుభ్రపరచడం మరియు క్రిమిసంహారకాలు జల్లడం) వంటి వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కార్యాచరణ ప్రణాళిక ప్రకారం పౌల్ట్రీ పక్షులు, గుడ్లు, పౌల్ట్రీ ఫీడ్లను రాష్ట్రం కోసి / పారవేసిన దానికి సంబంధించి రైతులకు తగు పరిహారం చెల్లించబడుతుంది. భారత ప్రభుత్వపు పశుసంవర్థక శాఖ మరియుడెయిరీ (డీఏహెచ్డీ), దాని ఎల్హెచ్ మరియు డీసీ పథకం యొక్క ఏఎస్సీఏడీ కాంపినెంన్ట్ కింద రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 50:50 షేరింగ్ ప్రాతిపదికన నిధులను అందిస్తుంది. ఏవియన్ ఇన్ఫ్లూయాంజా 2021 నియంత్రణకు సవరించి తయారు చేసిన కార్యాచరణ ప్రణాళిక ప్రకారం ప్రతిరోజు రాష్ట్రాలు / యుటీలు డిపార్ట్మెంట్కు వివరాలను అందిస్తున్నాయి. ట్విట్టర్, ఫేస్బుక్ హ్యాండిల్స్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లతో సహా ప్లాట్ఫామ్ల ద్వారా ఏవియన్ గురించి అవగాహన కల్పించడానికి డిపార్ట్మెంట్ నిరంతరాయంగా ప్రయత్నాలు చేస్తోంది.
***
(Release ID: 1691750)
Visitor Counter : 87