భారత ఎన్నికల సంఘం

శాసనసభ్యులు (ఎమ్మెల్యేలు) ఎన్నుకునే ఆంధ్రప్రదేశ్ శాసనమండలి స్థానానికి ఉప ఎన్నిక

నాడు పోస్టు చేయడమైనది: 06 JAN 2021 2:36PM by PIB Hyderabad

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో శాసనసభ సభ్యులు ఎన్నుకునే ఒక స్థానం ఖాళీ ఉంది. ఖాళీ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:

 

సభ్యురాలి పేరు 

ఎన్నిక స్వభావం 

ఖాళీ ఏర్పడడానికి కారణం 

పదవీ కాలం గడువు 

శ్రీమతి పోతుల సునీత 

ఎమ్మెల్యేల ద్వారా ఎన్నిక 

01.11.2020 తేదీన రాజీనామా 

29.03.2023

వరకు 

 

2.               పై పేర్కొన్న స్థానం ఖాళీ ఏర్పడడం వల్ల ఉప ఎన్నిక కింద తెలిపిన షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని కమిషన్ నిర్ణయించింది. 

 

క్రమ సంఖ్య 

ఎన్నిక వివరాలు 

తేదీలు 

  1.  

నోటిఫికేషన్ జారీ 

11 జనవరి 2021 (సోమవారం)

  1.  

నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ 

18 జనవరి , 2021 (సోమవారం)

  1.  

నామినేషన్ల పరిశీలన 

19 జనవరి 2021  (మంగళవారం)

  1.  

అభ్యర్థిత్వం 

ఉపసంహరణకు 

చివరి తేదీ 

21జనవరి 2021 (గురువారం)

  1.  

పోలింగ్ తేదీ 

28 జనవరి 2021 (గురువారం)

  1.  

పోలింగ్ సమయం 

ఉదయం 9  గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు 

  1.  

ఓట్ల లెక్కింపు 

28 జనవరి 2021 (గురువారం) సాయంత్రం 5గంటలకు 

  1.  

ఎన్నికలు పూర్తవ్వడానికి 

చివరి తేదీ 

01 ఫిబ్రవరి 2021 (సోమవారం)

                                                                       

3.         అందరు వ్యక్తులు ఎన్నికల ప్రక్రియ సందర్బంగా విస్తృత మార్గదర్శకాలను అనుసరించాలి:-

I.          ఎన్నికలకు సంబంధించిన అన్ని కార్యకలాపాల్లో ప్రతి ఒక్కరు ముఖానికి మాస్క్ ధరించాలి. 

II.        ఎన్నికల అవసరాలకు ఉపయోగించే హాల్/గది/ప్రాంగణం ప్రవేశం వద్ద:

(a) ప్రవేశించే అందరికి థర్మల్ స్క్రీనింగ్ చేయాలి 

(b) స్థలాల్లో శానిటైజర్ అందుబాటులో ఉంచాలి 

 

III.        కేంద్ర హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం సూచించిన తాజా కోవిడ్-19 మార్గదర్శకాలలో భాగంగా సామజిక దూరం పాటించాలి. 

4.         ఎన్నికల నిర్వహణలో కోవిడ్-19 నియంత్రణ చర్యల నిబంధనలు గట్టిగ అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఒక సీనియర్ అధికారిని నియమించాలి.  

 

****


(రిలీజ్ ఐడి: 1686627) సందర్శకుల సూచీ సంఖ్య : : 142
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Tamil