ఆర్థిక మంత్రిత్వ శాఖ

జీఎస్టీ పరిహార కొరతను తీర్చడానికి 10వ విడత రూ .6,000 కోట్లను బ్యాక్ టు బ్యాక్ లోన్‌గా కేంద్రం విడుదల చేసింది.

ఇప్పటివరకు అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు చట్ట ప్రకారం విడుదల చేసిన మొత్తం రూ.60,000 కోట్లు.

ఇది రాష్ట్రాలకు మంజూరు చేసిన రూ .1,06,830 కోట్ల అదనపు రుణ అనుమతికి అదనం

Posted On: 04 JAN 2021 6:17PM by PIB Hyderabad

జీఎస్టీ పరిహార కొరతను తీర్చడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ 10వ వారానికి సంబంధించి రూ .6,000 కోట్లను రాష్ట్రాలకు విడుదల చేసింది. వీటిలో జీఎస్టీ కౌన్సిల్ సభ్యులుగా ఉన్న 23 రాష్ట్రాలకు రూ .5,516.60 కోట్లు విడుదల చేయబడ్డాయి. 3 కేంద్రపాలిత ప్రాంతాలకు (యుటి) శాసనసభ (ఢిల్లీ, జమ్మూ & కాశ్మీర్ & పుదుచ్చేరి)లకు రూ.483.40 కోట్లు విడుదల చేయబడ్డాయి. మిగిలిన 5 రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మిజోరం, నాగాలాండ్ మరియు సిక్కింలకు జీఎస్టీ అమలు కారణంగా ఆదాయంలో అంతరం లేదు. ఇప్పుడు అంచనా వేసిన జీఎస్టీ పరిహార కొరతలో 50 శాతానికి పైగా శాసనసభతో రాష్ట్రాలు & యు.టి.లు ఉన్నాయి.

జిఎస్‌టి అమలు కారణంగా తలెత్తే ఆదాయంలో రూ .1.10 లక్షల కోట్ల కొరతను తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం 2020 అక్టోబర్‌లో ప్రత్యేక రుణాలు తీసుకునే విండోను ఏర్పాటు చేసింది. రాష్ట్రాలు మరియు యుటిల తరపున భారత ప్రభుత్వం ఈ విండో ద్వారా చెల్లింపులు చేస్తోంది. 10 విడతలుగా ఇప్పటివరకూ చెల్లింపులు జరిగాయి. ఇప్పటివరకు తీసుకున్న మొత్తం అక్టోబర్ 23, 2020, 2 నవంబర్, 2020, 9 నవంబర్, 2020, 23 నవంబర్, 2020, 1 డిసెంబర్, 2020, 7 డిసెంబర్, 2020, 14 డిసెంబర్, 2020, 21 డిసెంబర్, 2020, 28  డిసెంబర్ 2020 మరియు 04 జనవరి 2021 తేదీల్లో విడుదలయ్యాయి.

ఈ వారం విడుదల చేసిన మొత్తం రాష్ట్రాలకు అందించిన అటువంటి నిధుల్లో 10వ విడత మొత్తం. ఈ మొత్తాన్ని ఈ వారం 4.1526% వడ్డీ రేటుతో రుణంగా తీసుకున్నారు. ఇప్పటివరకు 4.6892% వడ్డీ రేటుతో ప్రత్యేక రుణాలు తీసుకునే విండో ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ .60,000 కోట్లు రుణం తీసుకుంది.

జీఎస్టీ అమలు కారణంగా ఆదాయ కొరతను తీర్చడానికి ప్రత్యేక రుణాలు తీసుకునే విండో ద్వారా నిధులను అందించడంతో పాటు ఎంపికను ఎంచుకునే అవకాశం అందించింది. రాష్ట్రాలకు స్థూల ఉత్పత్తి (జిఎస్‌డిపి) లో 0.50%కు సమానమైన అదనపు రుణాలు తీసుకోవడానికి భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అదనపు ఆర్థిక వనరులను సమీకరించడంలో వారికి సహాయపడటంటో పాటు జిఎస్టి పరిహార కొరతను తీర్చగలదు. ఆప్షన్ -1 కోసం అన్ని రాష్ట్రాలకు వారి ప్రాధాన్యత ఇవ్వబడింది. ఈ నిబంధన ప్రకారం 28 రాష్ట్రాలకు మొత్తం రూ .1,06,830 కోట్లు (జిఎస్‌డిపిలో 0.50%) రుణం తీసుకోవడానికి అనుమతి ఇవ్వబడింది.

28 రాష్ట్రాలకు మంజూరు చేసిన అదనపు రుణాలు మరియు ప్రత్యేక విండో ద్వారా సేకరించిన మరియు ఇప్పటివరకు రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు విడుదల చేసిన నిధుల మొత్తం జతచేయబడింది.

అనుమతించబడిన జిఎస్‌డిపిలో 0.50 శాతం అదనపు రుణాలు తీసుకోవడం మరియు ప్రత్యేక విండో ద్వారా సేకరించిన నిధులు 04.01.2021 వరకు రాష్ట్రాలు / యుటిలకు చేరాయి.

 

S. No.

Name of State / UT

Additional borrowing of 0.50 percent allowed to States

Amount of fund raised through special window passed on to the States/ UTs

1

Andhra Pradesh

5051

1433.25

2

Arunachal Pradesh*

143

0.00

3

Assam

1869

616.72

4

Bihar

3231

2421.54

5

Chhattisgarh

1792

846.30

6

Goa

446

520.85

7

Gujarat 

8704

5719.15

8

Haryana

4293

2699.05

9

Himachal Pradesh 

877

1064.87

10

Jharkhand

1765

459.75

11

Karnataka

9018

7694.69

12

Kerala

4,522

1897.80

13

Madhya Pradesh

4746

2816.91

14

Maharashtra

15394

7428.29

15

Manipur*

151

0.00

16

Meghalaya

194

69.39

17

Mizoram*

132

0.00

18

Nagaland*

157

0.00

19

Odisha

2858

2370.37

20

Punjab

3033

2751.20

21

Rajasthan

5462

2160.37

22

Sikkim*

156

0.00

23

Tamil Nadu

9627

3870.80

24

Telangana

5017

947.73

25

Tripura

297

140.40

26

Uttar Pradesh

9703

3725.41

27

Uttarakhand

1405

1436.55

28

West Bengal

6787

1458.37

 

Total (A):

106830

54549.76

1

Delhi

Not applicable

3637.32

2

Jammu & Kashmir

Not applicable

1408.98

3

Puducherry

Not applicable

403.94

 

Total (B):

Not applicable

5450.24

 

Grand Total (A+B)

106830

60000.00

* These States have ‘NIL’ GST compensation gap

****

 



(Release ID: 1686130) Visitor Counter : 158