వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

ఖ‌రీఫ్ మార్కెటింగ్ సీజ‌న్ 2021 లో ఎం.ఎస్‌.పి కార్య‌క‌లాపాలు

గ‌త ఏడాది కంటే 21.27 శాతం పెరిగిన ధాన్యం సేక‌ర‌ణ‌

24.02 ల‌క్ష‌ల ధాన్యం రైతులు కెఎంఎస్ ధాన్యంసేక‌ర‌ణ కార్య‌క‌లాపాల ద్వారా లబ్ధి పొందారు.

దీని ఎం.ఎస్‌.పి విలువ రూ5278.42 కోట్లు.

Posted On: 15 NOV 2020 5:42PM by PIB Hyderabad

ప్ర‌స్తుత ఖ‌రీఫ్ మార్కెటింగ్ సీజ‌న్ (కెఎంఎస్‌) 2020-21 లో ప్ర‌భుత్వం ఖ‌రీఫ్ 2020-21 పంట‌ల‌ను వాటి ఎంఎస్‌పి ధ‌ర‌కు రైతుల‌నుంచి ప్ర‌స్తుత ఎం.ఎస్‌.పి ప‌థ‌కాల ద్వారా సేక‌రిస్తున్న‌ది.
2020-21 ఖ‌రీఫ్ సీజ‌న్‌కు పంజాబ్‌,హ‌ర్యానా, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌,తెలంగానా, ఉత్త‌రాఖండ్‌, త‌మిళ‌నాడు, చండీఘ‌డ్‌,జ‌మ్ముకాశ్మీర్‌,కేర‌ళ‌,గురాత్‌,ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాలు,కేంద్ర‌పాలిత ప్రాంతాల నుంచి 14-11-2020నాటికి 279.56 ల‌క్ష‌ల మెట్రిక్‌ట‌న్నుల ధాన్యం సేక‌ర‌ణ జ‌రిగింది. గ‌త ఏడాది తో పోలిస్తే ఇది 21.27 శాతం ఎక్కువ‌. మొత్తం  279.56 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల కోనుగోళ్ల‌‌లో పంజాబ్ ఒక్క రాష్ట్రం నుంచే 194.63 ల‌క్ష‌ల‌మెట్రిక్ ట‌న్నులు అంటే 69.62 శాతం నుండి కొనుగోలు చేయ‌డం జ‌రిగింది.

 


ప్ర‌స్తుతం జ‌రుగుతున్న కె.ఎం.ఎస్ ప్రొక్యూర్‌మెంట్ కార్య‌క‌లాపాల ద్వారా 24.02 ల‌క్ష‌ల మంది రైతులు ప్ర‌యోజ‌నం పొందారు. ఎం.ఎస్‌.పి కొనుగోళ్లు 5278.42 కోట్ల రూపాయ‌ల మేర‌కు జ‌రిగాయి.

 


దీనికితోడు . రాష్ట్రాల నుంచి వ‌చ్చిన ప్ర‌తిపాద‌న‌ల ప్ర‌కారం , 2020 ఖ‌రీఫ్ మార్కెటింగ్ సీజ‌న్‌లో త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర‌,తెలంగాణా, గుజ‌రాత్‌,హ‌ర్యానా, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, ఒడిషా,రాజ‌స్థాన్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల‌లో ధ‌ర‌ల మ‌ద్ద‌తు ప‌థ‌కం(పిఎస్ఎస్ ) కింద  45.10 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల ప‌ప్పుధాన్యాలు ,చ‌మురు గింజ‌ల సేక‌ర‌ణ‌కు కేంద్ర ప్ర‌భుత్వం అనుమ‌తిచ్చింది. దీనికితోడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, క‌ర్ణాట‌క‌,త‌మిళ‌నాడు,కేర‌ళ రాష్ట్రాల‌నుంచి 1.23 ల‌క్ష‌ల మెట్రిక్‌ట‌న్నుల ఎండుకొబ్బ‌రి సేక‌ర‌ణ‌కు కూడా అనుమ‌తి ఇచ్చారు.  ఇత‌ర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల విష‌యంలో ప‌ప్పుధాన్యాలు, చ‌మురు గింజ‌లు,ఎండుకొబ్బ‌రి ని పిఎస్ఎస్ కింద సేక‌ర‌ణ‌కు వారి నుంచి ప్ర‌తిపాద‌న‌లు వ‌చ్చిన అనంత‌రం అనుమ‌తి ఇవ్వ‌డం జ‌రుగుతుంది. ఎఫ్‌.ఎ.క్యు గ్రేడ్ ప్రొక్యూర్‌మెంట్ విష‌యంలో ఈ పంట‌ల‌ను 2020-21 సంవ‌త్స‌రానికి మార్కెట్‌లో ధ‌ర‌లు ఎం.ఎస్‌.పి కంటే దిగువ‌కు ప‌డిపోతే  నేరుగా రిజిస్ట‌ర్డ్ రైతుల‌నుంచి సేక‌రించేందుకు అనుమ‌తించ‌నున్నారు. ఇందుకు ఆయా రాష్ట్రాలుకేంద్ర‌పాలిత ప్రాంతాల‌లో నోటిఫైడ్ పంట నూర్పిడి కాలంలో కేంద్ర నోడ‌ల్ ఏజెన్సీలు రాష్ట్రాల నామినేటెడ్ ప్రోక్యూరింగ్ ఏజెన్సీల ద్వారా దీనిని చేప‌ట్ట‌నున్నారు.


14-11-2020 నాటికి ప్ర‌భుత్వం నోడ‌ల్ ఏజెన్సీల ద్వారా 58602.68 మెట్రిక్ ట‌న్నుల  మిన‌ప‌పప్పు,పెస‌ర‌ప‌ప్పు,వేరుశ‌న‌గ‌, సోయాబీన్‌ల‌ను 315.63 కోట్ల రూపాయ‌ల విలువ మేర‌కు మ‌ద్ద‌తుధ‌ర‌కు సేక‌రించింది. దీనివ‌ల్ల త‌మిళ‌నాడు, మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్‌, హ‌ర్యానా, రాజ‌స్థాన్ రాష్ట్రాల‌కుచెందిన సుమారు 33959మంది రైతులు ప్ర‌యోజ‌నం పొందారు. ఇంత‌కు ముందు సంవ‌త్స‌రం ప్రోక్యూర్‌మెంట్ 33976.48 మెట్రిక్ ట‌న్నుల‌తో పోలిస్తే  ప్ర‌స్తుత ప్రొక్యూర్‌మెంట్ ప‌ప్పుధాన్యాలు, చ‌మురు గింజ‌ల విష‌యంలో  72.48 శాతం ఎక్కువ‌
అలాగే 5089 మెట్రిక్ ట‌న్నుల ఎండు కొబ్బ‌రిని 52.40 కోట్ల రూపాయ‌ల మ‌ద్ద‌తు ధ‌ర విలువ‌కు సేక‌రించ‌డం జ‌రిగింది. దీనివ‌ల్ల 14-11-2020 నాటికి  క‌ర్ణాట‌క‌,త‌మిళ‌నాడు రాష్ట్రాల‌కు చెందిన రైతులు ప్ర‌యోజ‌నం పొందారు. అంత‌కు  ముందు సంవ‌త్స‌రం ఎండు కొబ్బ‌రి కొనుగోళ్లు 293.34 మెట్రిక్‌ట‌న్నులు మాత్ర‌మే.
ఎండు కొబ్బ‌రి, మినుముల విష‌యంలో చాలా రాష్ట్రాల‌లో వాటి ధ‌ర క‌నీస మ‌ద్ద‌తుధ‌ర‌కంటే ఎక్కువ ప‌లుకుతున్నాయి.ఖ‌రీఫ్‌సీజ‌న్‌కు సంబంధించి ప‌ప్పుధాన్యాలు, చ‌మురుగింజ‌లు రాక‌కుఅనుగుణంగా ఆయా రాష్ట్రాలు నిర్ణ‌యించిన విధంగా ప్రొక్యూర్‌మెంట్‌కు రాష్ట్ర‌ప్ర‌భుత్వాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాలు త‌గిన ఏర్పాట్లు చేస్తున్నాయి.

 



 పంజాబ్‌, రాజ‌స్థాన్‌, హ‌ర్యానా,మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, తెలంగా,ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్ రాష్ట్రాల‌లో విత్త‌న ప‌త్తి (క‌ప‌స్‌) సేక‌ర‌ణ కార్య‌క‌లాపాలు స‌జావుగా సాగుతున్నాయి. 14-11-2020 నాటికి 14 ల‌క్ష‌లా 65 వేలా 847 కాట‌న్‌బేళ్లను 4187.05 కోట్ల రూపాయ‌ల విలువ మేర‌కు  సేక‌రించ‌డం ద్వారా286547 మంది రైతుల‌కు ప్ర‌యోజ‌నం క‌లిగింది.

 

 

***




 



(Release ID: 1673092) Visitor Counter : 187