హోం మంత్రిత్వ శాఖ

కేంద్ర హోంమంత్రి అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి కమిటీ రూ. ఆరు రాష్ట్రాలకు 4,381.88 కోట్ల అదనపు కేంద్ర సహాయానికి ఆమోదం తెలిపింది

2020 సంవత్సరంలో “అమ్ఫాన్”,“నిసర్గా” తుఫాన్లతో పాటు కొండచరియలు విరిగిపడ్డ కారణంగా నష్టపోయిన పశ్చిమ బెంగాల్, ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, మరియు సిక్కిం రాష్ట్రాలకోసం ఈ నిధులను కేటాయించారు.

Posted On: 13 NOV 2020 10:38AM by PIB Hyderabad

ఈ సంవత్సరంలో తుఫాను / వరదలు / కొండచరియల కారణంగా దెబ్బతిన్న ఆరు రాష్ట్రాలకు కేంద్ర విపత్తు ప్రతిస్పందన నిధి (ఎన్‌డిఆర్‌ఎఫ్) కింద అదనపు  సహాయాన్ని కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి కమిటీ (హెచ్‌ఎల్‌సి) ఆమోదించింది.

జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (ఎన్‌డిఆర్‌ఎఫ్) నుంచి ఆరు రాష్ట్రాలకు 4,381.88 కోట్ల అదనపు కేంద్ర సహాయాన్ని హెచ్‌ఎల్‌సి ఆమోదించింది.

* ‘అమ్ఫాన్’ తుఫాను కారణంగా నష్టపోయిన పశ్చిమ బెంగాల్‌కు రూ .2,707.77 కోట్లు, ఒడిశాకు రూ .128.23 కోట్లు మంజూరు చేశారు.
* ‘నిసర్గా’ తుఫానుకు మహారాష్ట్రకు రూ .268.59 కోట్లు మంజూరు చేశారు. నైరుతి రుతుపవనాల సమయంలో వాటిల్లిన వరదలు, కొండచరియలు విరిగిపడ్డ కారణంగా నష్టపోయిన కర్ణాటకకు రూ .577.84 కోట్లు, మధ్యప్రదేశ్‌కు రూ .611.61 కోట్లు, సిక్కింకు రూ . 87.84 కోట్లు మంజూరు చేశారు.‘అమ్ఫాన్’ తుఫాను తరువాత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ 2020 మే 22 న పశ్చిమ బెంగాల్ మరియు ఒడిశా రాష్ట్రాలను సందర్శించారు. ప్రధానమంత్రి ప్రకటించినట్లుగా ఆ రాష్ట్రాల్లో తక్షణ సహాయక చర్యల కోసం 2020 మే 23 న పశ్చిమ బెంగాల్‌కు 1,000 కోట్లు, ఒడిశాకు రూ .500 కోట్లు ముందస్తుగా  విడుదల చేశారు. ఆ సాయానికి అదనంగా మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50,000 నష్టపరిహారం ప్రధాని ప్రకటించారు. ఆ సాయం రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (ఎస్‌డిఆర్‌ఎఫ్) మరియు ఎన్‌డిఆర్‌ఎఫ్ ద్వారా అందించబడిన నష్టపరిహారానికి అదనం.

మొత్తం ఆరు రాష్ట్రాల్లో  బాధిత రాష్ట్ర ప్రభుత్వాల నుండి నివేదికల కోసం ఎదురుచూడకుండా విపత్తులు సంభవించిన వెంటనే కేంద్ర ప్రభుత్వం ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్స్ (ఐఎంసిటి) లను నియమించింది.


2020-21 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ కేంద్ర ప్రభుత్వం ఎస్డీఆర్ఎఫ్ నుండి 28 రాష్ట్రాలకు రూ .15,524.43 కోట్లను విడుదల చేసింది.


 

****



(Release ID: 1672583) Visitor Counter : 217