వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

2020 -21 ఖరీఫ్ మార్కెటింగ్ కాలంలో కనీస మద్దతు ధరకు వరి సేకరణ

ఆరు లక్షల మంది రైతుల నుంచి 13,128.12 కోట్ల విలువ చేసే 69.5 లక్షల మిలియన్ టన్నుల పంటల సేకరణ

Posted On: 16 OCT 2020 6:07PM by PIB Hyderabad

         2020 -21 ఖరీఫ్ పంట మార్కెటింగ్ కాలం ప్రారంభం కావడంతో ప్రభుత్వం రైతుల నుంచి కనీస మద్దతు ధరకు గత సీజన్లలో  మాదిరిగానే పంటలను సేకరించడం ప్రారంభించింది.

      భారత ఆహార సంస్థ ( ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ) మరియు ఇతర ప్రభుత్వ సంస్థల ద్వారా కేంద్ర పాలిత ప్రాంతాలతో పాటు పంజాబ్, హర్యానా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్,కేరళ, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలలో 2020 అక్టోబర్ 15 వ తేదీ నాటికి 13,128.12 కోట్ల రూపాయల విలువ చేసే  69.53 లక్షల టన్నుల వరిని 6.09 లక్షల మంది రైతుల నుంచి సేకరించింది.

         ఇంతేకాకుండా రాష్ట్రాల నుంచి అందిన ప్రదిపాదనల మేరకు 2020 ఖరీఫ్ మార్కెటింగ్  కాలంలో 41.67 లక్షల మిలియన్ టన్నుల పప్పు ధాన్యాలను,నూనె గింజలను సేకరించడానికి తమిళనాడు,కర్నాటక, మహారాష్ట్ర, తెలంగాణా, గుజరాత్, ఒడిషా, రాజస్థాన్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అనుమతి మంజూరు చేయడం జరిగింది.

    దీనితోపాటు ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు మరియు కేరళ రాష్ట్రాలకు 1.23 లక్షల మిలియన్ టన్నుల కొబ్బరిని సేకరించడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. ప్రతిపాదనలు అందిన వెంటనే ఇతర రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు ధర మద్దతు పధకం కింద  పప్పు ధాన్యాలను,నూనె గింజలను సేకరించడానికి అనుమతి మంజూరు చేయడం జరుగుతుంది. దీనివల్ల 2020 -21 ఖరీఫ్ పంట కాలంలో  నిర్ణీత గ్రేడ్ కలిగిన ఈ పంటలను నమోదు చేసుకున్నరైతుల నుంచి ఆయా రాష్ట్రాలలో కనీస మద్దతు ధర కన్నా మార్కెట్ ధర తగ్గినప్పుడు కేంద్రం నియమించే నోడెల్ ఏజెన్సీల ద్వారా రాష్ట్రాలు నియమించే సేకరణ ఏజెన్సీల ద్వారా  కనీస మద్దతు ధరకు నేరుగా సేకరించడానికి అవకాశం కలుగుతుంది.

 

        2020 అక్టోబర్ 15  వ తేదీ వరకు ప్రభుత్వం తన ఏజెన్సీల ద్వారా తమిళనాడు,మహారాష్ట్ర మరియు హర్యానా రాష్ట్రాలలో 5 .21  కోట్ల రూపాయల విలువ చేసే౭ 723 .79 మిలియన్ టన్నుల  సెనగలు , మినుములను సేకరించింది. దీనివల్ల 681 మంది రైతులు లబ్ది పొందారు. ఇదేవిధంగా కర్నాటక మరియు తమళనాడులలో 3961 మంది రైతులకు ప్రయోజనం కలిగిస్తూ వారినుంచి 52.40 కోట్ల రూపాయల విలువ చేసే 5089 మిలియన్ టన్నుల  కొబ్బరి, మినుములను సేకరించడం జరిగింది. ఈ పంటలు ఎక్కువగా సాగవుతున్న రాష్ట్రాలలో కనీస మద్దతు ధరల కంటే మార్కెట్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. సంబంధిత రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలు  ఖరారు చేసే తేదీ నుంచి ఖరీఫ్ పప్పు ధాన్యాలు నూనె గింజలు మార్కెట్టుకు రావడం ప్రారంభించిన తరువాత సేకరణ కార్యక్రమం ప్రారంభం అవుతుంది.

          2020 -21 ఖరీఫ్ పంట కాలంలో పత్తిగింజల.సేకరణ  అక్టోబర్ ఒకటవ తేదీన ప్రారంభం అయింది. అక్టోబర్ 15  వ తేదీకి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కనీస మద్దతు ధరకు 33353 . 62  లక్షల రూపాయల విలువ చేసే 118064  బేళ్ల పత్తిని 24001  మంది రైతులకు ప్రయోజనం కలిగిస్తూ సేకరించడం జరిగింది.

***



(Release ID: 1665324) Visitor Counter : 141