సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

కొత్త సీఐసీ, ఐసీల నియామక ప్రక్రియ కొనసాగుతోంది: డా.జితేంద్ర సింగ్‌

Posted On: 22 SEP 2020 5:08PM by PIB Hyderabad

కొత్త ముఖ్య సమాచార కమిషనర్‌‌, సమాచార కమిషనర్ల నియామక ప్రక్రియ కొనసాగుతోందని కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ మంత్రి (స్వతంత్ర బాధ్యత) డా.జితేంద్ర సింగ్‌, రాజ్యసభకు లిఖితపూర్వకంగా వివరించారు.

    కేంద్ర సమాచార కమిషన్‌లోని ముఖ్య సమాచార కమిషనర్‌ 26.08.2020న పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఒక సమాచార కమిషనర్‌ పదవీకాలం 25.09.2020తో ముగియనుంది. ముఖ్య సమాచార కమిషనర్‌ సహా ఆరుగురి వరకు సమాచార కమిషనర్లను కొత్తగా తీసుకునే ప్రక్రియను 09.07.2020న ప్రారంభించింది. ఖాళీల భర్తీకి ప్రకటనలు ఇచ్చింది.

    ముఖ్య సమాచార కమిషనర్‌, సమాచార కమిషనర్ల ఖాళీల భర్తీకి దరఖాస్తులను పరిశీలించడం, జాబితాను కుదించడం కోసం అభ్యర్థుల సమాచారాన్ని పొందే పద్ధతిని ఉన్నత స్థాయి శోధన కమిటీ అనుసరిస్తోంది. 

***



(Release ID: 1657896) Visitor Counter : 140