సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ

2018-2025 మ‌ధ్య కాలానికి 'మాదక ద్రవ్యాల డిమాండ్ తగ్గింపున‌కు జాతీయ కార్యాచరణ ప్రణాళిక'ను (ఎన్ఏపీడీడీఆర్‌) అమలు చేస్తున్న సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ‌

- అత్యధికంగా ప్రభావిత 272 జిల్లాల్లో ‌'న‌షా ముక్త్ భారత్ అభియాన్‌'ను ప్రారంభించిన‌
మంత్రిత్వ శాఖ

Posted On: 20 SEP 2020 4:27PM by PIB Hyderabad

సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ 2018-2025 మ‌ధ్య కాలానికి గాను
'మాదక ద్రవ్యాల డిమాండ్ తగ్గింపున‌కు జాతీయ కార్యాచరణ ప్రణాళిక'ను (ఎన్ఏపీడీడీఆర్‌) అమ‌లు చేస్తోంది. వ్య‌స‌న‌ప‌రులుగా మారి మాద‌క ద్ర‌వ్యాల‌ను వినియోగించ‌డం వ‌ల్ల క‌లిగే వివిధ ప్రతికూల పరిణామాలను బహుముఖ వ్యూహం ద్వారా తగ్గించడం ఈ ప్రణాళిక ముఖ్య లక్ష్యం.
ఎన్ఏపీడీడీఆర్ కింద పాఠశాలలు/ కళాశాలలు/ విశ్వవిద్యాలయాల‌లో సెమినార్‌లు వర్క్‌షాప్‌లు ద్వారా తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాలు నిర్వ‌హిస్తున్నారు. సమాజంలో బలహీనమైన కౌమార దశ మరియు యువత కోసం 'కమ్యూనిటీ బేస్డ్ పీర్ లీడ్ ఇంటరాక్షన్ ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్‌'లు.. చికిత్స సౌకర్యాలు మరియు సర్వీసు ప్రొవైడర్ల సామ‌ర్థ్యం పెంపు కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నారు. దేశ వ్యాప్తంగా మాద‌క ద్ర‌వ్యాల వ్యాప్తి ఎక్కువ‌గా పొంచి ఉన్న జిల్లాల‌లో మంత్రిత్వ శాఖ కేంద్రీకృత జోక్యపు కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ చొర‌వ‌లో భాగంగానే మాద‌క ద్ర‌వ్యాల‌పై ఆధారపడటాన్ని, వీటిని ఉత్పత్తిచేసే పదార్థాల డిమాండ్ తగ్గించడంలో సమాజ భాగస్వామ్యం మరియు ప్రజల సహకారాన్ని పెంచే లక్ష్యంతో మరియు వ్యసనానికి గురయ్యే లేదా ప్రమాదంలో ఉన్న వ్యక్తులు మరియు సమూహాలలో సామూహిక కార్యక్రమాలు, స్వయం సహాయక ప్రయత్నాలను ప్రోత్సహిస్తుంది. సంస్థాగత సహకారం, కమ్యూనిటీ అవుట్ రీచ్ మరియు అవగాహన కల్పనపై దృష్టి సారించిన మంత్రిత్వ శాఖ 272 అత్యంత ప్రభావిత జిల్లాల్లో 'న‌‌షా ముక్త్ భారత్ అభియాన్‌'ను ప్రారంభించింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) నుండి వచ్చిన స‌మాచారం మరియు మంత్రిత్వ శాఖ చేసిన సమగ్ర జాతీయ సర్వే ఫలితాల ఆధారంగా ఈ జిల్లాలను గుర్తించారు. 272 జిల్లాల్లో 'న‌‌షా ముక్త్ భారత్ అభియాన్‌‌'‌ను ఈ ఏడాది ఆగస్టు 15 నుండి 2021 మార్చి 31 వరకు ఇది అమ‌లులో ఉంటుంది. అభియాన్ కార్యాచరణ ప్రణాళికలో ఈ క్రింది భాగాలు ఉన్నాయి:-
- సమాజంలో మరియు ముఖ్యంగా యువతలో అవగాహన క‌ల్ప‌న‌ కార్యక్రమాలు
- ఉన్నత విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయ ప్రాంగణాలు మరియు పాఠశాలలపై దృష్టి నిల‌ప‌డం
- కమ్యూనిటీ అవుట్‌రీచ్‌ మరియు ఆధారపడి జనాభా యొక్క గుర్తింపు
- ఆసుపత్రుల ఏర్పాటు చికిత్స సౌకర్యాలపై దృష్టి పెట్టండి
- సేవా ప్రదాతలకు సామర్థ్యం పెంపొందించే కార్యక్రమాలు
లోక్‌స‌భ‌కు ఇచ్చిన‌ లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ స‌హాయ మంత్రి శ్రీ రత్తన్ లాల్ కటారియా ఈ సమాచారాన్ని వెల్ల‌డించారు. 

***



(Release ID: 1657087) Visitor Counter : 187