ఉక్కు మంత్రిత్వ శాఖ
తూర్పు భారతదేశంలో ఉక్కు ఉత్పత్తి పెంపు
Posted On:
16 SEP 2020 1:07PM by PIB Hyderabad
ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్లోని సమీకృత ఉక్కు కేంద్రాల అభివృద్ధిని కలుపుతూ 'పూర్వోదయ' కార్యక్రమాన్ని కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. అదనపు ఉత్పత్తి సామర్థ్యం; సమీకృత ఉక్కు ప్లాంట్లకు సమీపంలో ఉన్న ఉక్కు క్లస్టర్లు, డిమాండ్ సెంటర్ల అభివృద్ధి; రవాణా, ఇతర వినియోగాల మౌలిక సదుపాయాల వృద్ధి కోసం గ్రీన్ ఫీల్డ్, బ్రౌన్ ఫీల్డ్ ఉక్కు ప్లాంట్లను నెలకొల్పడం ద్వారా భారతదేశ తూర్పు ప్రాంతం అభివృద్ధిపై దృష్టి పెట్టడం పూర్వోదయ లక్ష్యం.
కేంద్ర ఉక్కు శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, ఈ సమాచారాన్ని లిఖితపూర్వక సమాధానంగా రాజ్యసభకు సమర్పించారు.
***
(Release ID: 1654966)
Visitor Counter : 108