కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
నోయిడాలోని ఈ ఎస్ ఐ సి ఆసుపత్రి మరియు ఔషధాలయాల(డిస్పెన్సరీ)లో సేవల విషయంలో వచ్చిన ఆరోపణలపై వచ్చిన వార్తలకు ఈ ఎస్ ఐ సి వివరణ
ఈ ఎస్ ఐ సి డాక్టర్లు మరియు వైద్య సిబ్బంది తమ విధి నిర్వహణ బాధ్యతలకు మించి సేవలు అందిస్తున్నారు
ఏప్రిల్, 2020 నుంచి నోయిడా ఈ ఎస్ ఐ సి ఆసుపత్రి సిబ్బంది దాదాపు 68,000 మంది రోగులకు సేవలు అందించారు
Posted On:
08 SEP 2020 1:31PM by PIB Hyderabad
ఇదే సమయంలో సెక్టార్ -12, సెక్టార్-57, నోయిడా ప్రత్యేక ఆర్ధిక మండల (ఎన్ ఈ పి జడ్) ప్రాంతంలో, గ్రేటర్ నోయిడాలో ఉన్న నాలుగు డిస్పెన్సరీలలో లక్షకు పైగా ఇన్ పేషేంట్లకు మరియు వారి లబ్ధిదారులకు చికిత్స చేశారు
నోయిడాలోని ఈ ఎస్ ఐ సి ఆసుపత్రిలో మరియు డిస్పెన్సరీలలో ఇన్ పేషేంట్లకు మరియు వారి లబ్ధిదారులకు సరైన చికిత్స లభించడం లేదని కొన్ని దినపత్రికలలో వచ్చిన వార్తల నేపథ్యంలో ఈ ఎస్ ఐ సి వివరణ ఇచ్చింది. ఆసుపత్రి, డిస్పెన్సరీల సిబ్బంది తమ విధులకు అంకితమై ఇన్ పేషేంట్లకు మరియు వారి లబ్ధిదారులకు అన్ని రకాల చికిత్సలను అందిస్తున్నారని తెలిపారు. విశ్వ మహమ్మారి కోవిడ్ -19 ప్రబలిన సమయంలో ఈ ఎస్ ఐ సి సిబ్బంది పనితీరుకు సంబంధించిన ఆధారాలను చూపారు. వైద్య సేవలు అందించడంలో సిబ్బంది పనితీరు బాగున్నట్లు అవి సూచిస్తున్నాయి.
అంతేకాక 2020 ఏప్రిల్ నుంచి తమ నోయిడా ఆసుపత్రి దాదాపు 68000 రోగులకు సేవలు అందించిందని కూడా ఈ ఎస్ ఐ సి తెలిపింది. ఇదే సమయంలో సెక్టార్ -12, సెక్టార్-57, నోయిడా ప్రత్యేక ఆర్ధిక మండల (ఎన్ ఈ పి జడ్) ప్రాంతంలో, గ్రేటర్ నోయిడాలో ఉన్న నాలుగు డిస్పెన్సరీలలో లక్షకు పైగా ఇన్ పేషేంట్లకు మరియు వారి లబ్ధిదారులకు చికిత్స చేసినట్లు కూడా ఈ ఎస్ ఐ సి వెల్లడించింది. అంతేకాక 2020 జూన్ నుంచి కోవిడ్ -19 రోగులకు కూడా ఈ ఎస్ ఐ సి ఆసుపత్రి చికిత్స అందిస్తోందని, ఇందుకోసం 100 పడకలను ప్రత్యేకించినట్లు తెలిపారు. ఆసుపత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన ఫార్మసీ నుంచి ఆసుపత్రిని సందర్శించే రోగులకు మందులు పంపిణీ చేస్తున్నారు.
నోయిడాలో బీమా సౌకర్యం ఉన్నవారికి నోయిడాలోని ఈ ఎస్ ఐ సి సబ్ రీజనల్ ఆఫీసు ద్వారా నగదు ప్రయోజనాలు కూడా కల్పిస్తున్నారు. తద్వారా కోవిడ్ మహమ్మారి ప్రబలిన ఈ కష్టకాలంలో సభ్యులు ఇబ్బంది పడకుండా ఆదుకుంటున్నారు.
2020 ఏప్రిల్ నుంచి నగదు ప్రయోజనం కింద మొత్తం 25829 మందికి రూ. 8.5 కోట్ల మొత్తాన్ని చెల్లించడం జరిగింది.
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ఎస్ ఐ సి ఆసుపత్రులు కోవిడ్ -19 మహమ్మారిపై పోరాటం చేస్తున్నాయి. ఈ ఎస్ ఐ సంస్థ కృషికి ప్రశంసలు లభించాయని, సంస్థ వైద్య సేవల మౌలిక సదుపాయాలను సాధారణ ప్రజానీకంతో సహా కోవిడ్ -19 సోకిన వారందరి కోసం కూడా తెరవడం జరిగింది. ఇప్పటి వరకు సంస్థకు చెందిన 23 ఆసుపత్రులు 2600 ఐసోలేషన్ పడకలు మరియు 1350 క్వారెంటైన్ పడకలతో కోవిడ్ -19 ప్రత్యేక ఆసుపత్రులుగా పనిచేస్తున్నాయి. పైన చెప్పినవి కాకుండా దేశవ్యాప్తంగా ఈ ఎస్ ఐ సంస్థకు చెందిన ఇతర ఆసుపత్రులలో దాదాపు 961 కోవిడ్ ఐసోలేషన్ పడకలు లభ్యమవుతున్నాయి. ఆ విధంగా వివిధ ఈ ఎస్ ఐ సి ఆసుపత్రులలో మొత్తం ఐసోలేషన్ పడకల సంఖ్య 3597. అంతేకాక ఈ ఆసుపత్రులలో 213 వెంటిలేటర్లతో 555 ఐ సి యు పడకలు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఈ మహమ్మారిని ఎదురుకోవడానికి మొత్తం దేశమంతా పోరాడుతున్న ఈ కష్ట సమయంలో వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది నిజమైన యోధుల వలె దివారాత్రాలు కృషిచేస్తూ, తమ విధి నిర్వహణ బాధ్యతలకు మించి సేవచేస్తూ కోవిడ్ -19 మహమ్మారి తెచ్చిన విపత్తు ప్రభావం నుంచి రోగుల ప్రాణాలకు రక్షణ కల్పిస్తున్నారని తెలిపారు.
మీడియా పాత్రను తక్కువచేసి చూపడం కాదని, అయితే ఈ పరీక్షా సమయంలో వారు సహకారం అందించాలని మరియు ఓర్పు వహించాలని ఈ ఎస్ ఐ సి కోరుతోంది.
***
(Release ID: 1652416)
Visitor Counter : 191