వ్యవసాయ మంత్రిత్వ శాఖ

వ్యవసాయ మౌలికసదుపాయాల నిధి, ఇటీవలి వ్యవసాయ సంస్కరణల పై ముఖ్యమంత్రులు, రాష్ట్ర వ్యవసాయ మంత్రులతో చర్చించిన కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్

రైతుల సంక్షేమం కోసం వ్యవసాయ సంస్కరణలు చేపట్టాం - శ్రీ తోమర్

ఆత్మ నిర్భర భారత్ లక్ష్యం సాధించే దిశగా యూపీ ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోంది - శ్రీ యోగి ఆదిత్యనాథ్; వ్యవసాయ అభివృద్ధికి జాతీయ స్థాయిలో పథకాన్ని తెచ్చిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన శ్రీ ఉద్ధవ్ థాకరే

Posted On: 27 AUG 2020 5:54PM by PIB Hyderabad

కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖల మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్,  నేడు ముఖ్యమంత్రులు, రాష్ట్ర వ్యవసాయ మంత్రులతో ఇటీవలి వ్యవసాయ మార్కెట్ సంస్కరణలు, రూ. 1 లక్ష కోట్ల వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి  కింద కొత్త కేంద్ర రంగాల ఫైనాన్సింగ్ సౌకర్యం గురించి సమగ్ర చర్చ జరిపారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఉద్ధవ్ థాక్రే, రాజస్థాన్, కేరళ, చత్తిస్గఢ్, తెలంగాణ వ్యవసాయ మంత్రులు, కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రులు శ్రీ పుర్షోత్తం రూపాల, శ్రీ కైలాష్ చౌదరి ఈ చర్చలో పాల్గొన్నారు.

చర్చ సందర్భంగా, శ్రీ తోమర్ ఈ ఫండ్ దృష్టి పంటకోత నిర్వహణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, సమాజ వ్యవసాయ సాధనాల లభ్యత గురించి ఉంటుందని అన్నారు. చిన్న, మధ్యతరహా రైతులకు పూర్తి ప్రయోజనం వచ్చేలా చూసుకోవాలన్నారు. లక్ష కోట్ల నిధుల వినియోగాన్ని భరోసా ఇవ్వడంలో ఎటువంటి అవకాశాన్ని వదులుకోకుండా, అన్ని గ్రామాల్లో కొత్త మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ముఖ్యమంత్రులు, రాష్ట్ర వ్యవసాయ మంత్రులు పూర్తి హామీ ఇచ్చారు.

 

 

గౌరవనీయ ప్రధాన మంత్రి మార్గదర్శనంలో ఈ దేశంలో రైతుల సంక్షేమం, సుస్థిర జీవనోపాధికి పూర్తి స్థాయిలో తాము కటిబద్దులై ఉన్నామని కేంద్ర వ్యవసాయ మంత్రి అన్నారు. 

రైతులు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా పరివర్తన చెంది, వారి ఆదాయం రెట్టింపు కావాలనే లక్ష్యంతో ఆత్మనిర్భర భారత్ ఆలోచన చేశామని, ఆ దార్శనికతను కేంద్ర మంత్రి వివరించారు. కొన్ని కీలక కార్యక్రమాలను చెబుతూ  "10,000 ఎఫ్‌పిఓల ఏర్పాటు మరియు ప్రమోషన్" కోసం రూ.6,865 కోట్ల పథకం, ఇటీవలి మూడు ఆర్డినెన్స్‌లు, పిఎం-కిసాన్ కింద విడుదల చేసిన ప్రయోజనాలు, రైతుల కోసం కెసిసి సంతృప్త డ్రైవ్, డిజిటల్ వ్యవసాయంపై పెరిగిన దృష్టి. ఉత్పత్తి, ఉత్పాదకత,  సరైన విలువ ఉండేలా చూడడం వల్ల చిన్న రైతుల సాగు వ్యయాన్ని తగ్గించడంలో ఎఫ్‌పిఓలకు పెద్ద పాత్ర ఉంటుందని కేంద్ర మంత్రి అన్నారు.  

కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రులు, రాష్ట్ర వ్యవసాయ మంత్రులు ఈ పథకం ప్రయోజనాలు, పెట్టుబడుల వృద్ధిని పెంచడానికి, వ్యవసాయం, అనుబంధ రంగాలలో కొత్త ఉద్యోగాలు సృష్టించడానికి, రైతు ఆదాయాన్ని మెరుగుపర్చడానికి ఇది ఎలా సహాయపడుతుందో చర్చించారు. పంటకోత నిర్వహణ పరిష్కారాలు, ఆధునిక సేలోస్, కోల్డ్ చైన్స్, ఇంటిగ్రేటెడ్ ప్యాక్-హౌసెస్, ఐయోటి / ప్రెసిషన్ అగ్రికల్చర్ వంటి కమ్యూనిటీ ఫార్మింగ్ ఆస్తులలో పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్రాలలో ఉన్న అవకాశాలపై వివరణాత్మక చర్చ జరిగింది. ఈ బృందం ఎఫ్‌పిఓలు, పిఎసిఎస్, స్టార్టప్‌లతో సహా వివిధ గ్రూపులు ఈ పథకం కింద ప్రయోజనాలను ఎలా పొందవచ్చనే దానిపై అభిప్రాయాలను పంచుకున్నారు.

వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి కింద పెట్టుబడులు, ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బహుళ పథకాలను సమన్వయపరచాలని శ్రీ తోమర్ స్పష్టం చేశారు. మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఆఫ్ హార్టికల్చర్ కింద మూలధన సబ్సిడీ ఉప పథకాలు, ఆర్‌కెవివై కింద అందించిన నిధుల కోసం రాష్ట్ర ప్రణాళిక, నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ కింద సేంద్రీయ ఇన్పుట్ ఉత్పత్తి యూనిట్ల ఏర్పాటుకు మూలధన రాయితీతో సహా కన్వర్జెన్స్‌ను అన్వేషించడానికి కొన్ని పథకాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.

ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీ కింద రైతుల సంక్షేమం కోసం యుపి ప్రభుత్వం పూర్తి అంకితభావంతో పనిచేస్తుందని భరోసా ఇచ్చిన ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలో పిఎం-కిసాన్ పథకం కింద 2.14 కోట్లకు పైగా రైతులు లబ్ధి పొందారని తెలియజేశారు. ఇప్పటికే జారీ చేసిన 1.44 కోట్ల కెసిసిలకు అదనంగా 12 లక్షల కొత్త కెసిసిలను ఇస్తున్నారు. రాష్ట్రంలోని 825 బ్లాకుల్లో ఒక్కో ఎఫ్‌పిఓ ఏర్పడుతోంది. వ్యవసాయ అభివృద్ధికి జాతీయ పథకాన్ని వేగంగా రూపొందించి అమలు చేసినందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఉద్దవ్ థాకరే ప్రధాని, కేంద్ర వ్యవసాయ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. రైతులను స్వావలంబనగా మార్చడానికి, వారికి ప్రాథమిక సదుపాయాలు కల్పించడం చాలా అవసరమని, దీని కోసం వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిలో సదుపాయం కల్పించామని చెప్పారు.

వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి వివేక్ అగర్వాల్ ఈ ప్రణాళికపై ప్రెజెంటేషన్ ఇచ్చారు.  రాష్ట్రాల్లో ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్‌ను రూపొందించాలని సూచించారు.

అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనేది పంట కోత నిర్వహణ మౌలిక సదుపాయాలు మరియు కమ్యూనిటీ ఫార్మింగ్ ఆస్తుల కోసం వడ్డీ ఉపసంహరణ, క్రెడిట్ గ్యారెంటీ ద్వారా ఆచరణీయ ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టడానికి మధ్యస్థ దీర్ఘకాలిక రుణ ఫైనాన్సింగ్ సౌకర్యంగా ఉంటుంది. పథకం వ్యవధి 2020 ఆర్థిక సంవత్సరం నుండి 2029 ఆర్థిక సంవత్సరం (10 సంవత్సరాలు) వరకు ఉండాలి. ఈ పథకం కింద రూ. 1 లక్ష కోట్లు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు సంవత్సరానికి 3% వడ్డీ సబ్‌వెన్షన్‌తో రుణాలుగానూ, రూ. 2 కోట్ల వరకు రుణం సిజిటిఎంఎస్‌ఇ కింద క్రెడిట్ గ్యారెంటీ కవరేజీతో ఇస్తారు. లబ్ధిదారులలో రైతులు, ఎఫ్‌పిఓలు, పిఎసిఎస్, మార్కెటింగ్ కోఆపరేటివ్ సొసైటీలు, ఎస్‌హెచ్‌జిలు, జాయింట్ లయబిలిటీ గ్రూప్స్ (జెఎల్‌జి), బహుళార్ధసాధక సహకార సంఘాలు, వ్యవసాయ పారిశ్రామికవేత్తలు, స్టార్టప్‌లు, కేంద్ర/ రాష్ట్ర ఏజెన్సీ లేదా స్థానిక సంస్థల ప్రాయోజిత ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్టులకు ఇస్తారు.

వ్యవసాయ రంగంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వరుస సంస్కరణలలో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి ఒకటి. ఈ పథకం రైతులు, పిఎసిఎస్, ఎఫ్‌పిఓలు, వ్యవసాయ పారిశ్రామికవేత్తలకు సామజిక వ్యవసాయ ఆస్తులను పెంపొందించడంలో, పంటకోత వ్యవసాయ మౌలిక సదుపాయాలకు తోడ్పడుతుంది. ఈ ఆస్తులు రైతులకు వారి ఉత్పత్తులకు ఎక్కువ విలువను పొందటానికి వీలు కల్పిస్తాయి ఎందుకంటే వారు తమ ఉత్పత్తులను నిల్వ చేసి అధిక ధరలకు విక్రయించగలుగుతారు, వ్యర్థాలను తగ్గించవచ్చు, ప్రాసెసింగ్ పెంచడం, విలువను జోడించవచ్చు. ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఒక పోర్టల్ కూడా ప్రారంభించారు.

****



(Release ID: 1649085) Visitor Counter : 211