యు పి ఎస్ సి

యూపీఎస్‌సీ ఛైర్మన్‌గా ప్రొ.డా.ప్రదీప్‌ కుమార్‌ జోషి బాధ్యతలు స్వీకారం

Posted On: 07 AUG 2020 5:12PM by PIB Hyderabad

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్‌సీ) సభ్యుడైన ప్రొ.డా.ప్రదీప్‌ కుమార్‌ జోషి, యూపీఎస్‌సీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. యూపీఎస్‌సీ ఛైర్మన్‌ బాధ్యతల నుంచి తప్పుకుంటున్న శ్రీ అరవింద్‌ సక్సేనా, ప్రదీప్‌ కుమార్‌ జోషితో ప్రమాణం చేయించారు.  

    ప్రొ.ప్రదీప్‌ కుమార్‌ జోషి, 2015 మే 12వ తేదీన కమిషన్‌ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టారు. ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌లో పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్‌గానూ పని చేశారు. 'నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ ప్లానింగ్‌ అండ్‌ అడ్మినిస్ట్రేషన్‌' (ఎన్‌ఐఈపీఏ) డైరెక్టర్‌గానూ సేవలందించారు. తన కెరీర్‌లో, 28 ఏళ్లకుపైగా, పోస్టు గ్రాడ్యుయేషన్‌ విద్యార్థులకు పాఠాలు చెప్పారు. వివిధ విధాన నిర్ణయ, విద్య, పరిపాలన విభాగాల్లో అనేక హోదాల్లో విధులు నిర్వర్తించారు.

    'ఆర్థిక నిర్వహణ'లో నిపుణుడైన డా.జోషి.., జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో జరిగిన వివిధ సమావేశాల్లో తన పరిశోధన పత్రాలను సమర్పించారు.

***
 


(Release ID: 1644162)