రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
బీహార్లోని మహాత్మా గాంధీ సేతు- పునరుద్ధరించిన అప్స్ట్రీమ్ క్యారేజ్వేను ప్రజలకు అంకితం చేసిన శ్రీ నితిన్ గడ్కరీ
పాట్నాలో గంగా నదిపై రూ.3000 కోట్ల అంచనా గల 5 కిలోమీటర్ల కొత్త వంతెన ప్రకటన
బీహార్ లో చేపట్టిన రూ.30000 కోట్ల జాతీయ హైవే ప్రాజెక్టులు : జనరల్ (రిటైర్డ్) వి.కె.సింగ్
రోడ్, రైల్ నెట్ వర్క్ ఇంకా పెంచేలా కేంద్రం సహాయం చేయాల్సిందిగా కోరిన నితీష్ కుమార్
Posted On:
31 JUL 2020 5:35PM by PIB Hyderabad
బీహార్లో ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గంగా నదిపై మహాత్మా గాంధీ వంతెన అప్స్ట్రీమ్ క్యారేజ్వేను కేంద్ర రోడ్డు రవాణా, రహదారులు, ఎంఎస్ఎంఇల మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బీహార్ ముఖ్యమంత్రి శ్రీ నితీష్ కుమార్ అధ్యక్షత వహించారు. కేంద్ర మంత్రులు శ్రీ రామ్ విలాస్ పాశ్వాన్, శ్రీ రవిశంకర్ ప్రసాద్, కేంద్ర సహాయ మంత్రి జనరల్ (రిటైర్డ్) వికె సింగ్, శ్రీ అశ్వని చౌబే, శ్రీ నిత్యానంద్ రాయ్, ఉప ముఖ్యమంత్రి శ్రీ సుశీల్ కుమార్ మోడీ, రాష్ట్ర ఆర్సిడి మంత్రి శ్రీ నంద్ కిషోర్ యాదవ్, పార్లమెంటు సభ్యులు శ్రీ రాజీవ్ ప్రతాప్ , శ్రీ రామ్ కృపాల్ యాదవ్, శ్రీ పశుపతి కుమార్ పరాస్ మరియు శ్రీమతి వీణ దేవి, కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులుఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

పాట్నా, హాజీపూర్ మధ్య ఎన్ హెచ్ -19 వద్ద 5.5 కిలోమీటర్ల నాలుగు లేన్ వంతెన ఇది. 1742 కోట్ల రూపాయల వ్యయంతో దీనిని నిర్మిస్తున్నారు. పాత వంతెన ప్రస్తుత కాంక్రీట్ సూపర్ స్ట్రక్చర్ను కొత్త స్టీల్ డెక్ సూపర్ స్ట్రక్చర్ ద్వారా మార్చడం ఇందులో ఉంటుంది. ఈ వంతెనపై పనులు జూన్ 2017 లో ప్రారంభమయ్యాయి. ఈ వంతెన రెండు భాగాలుగా పూర్తి కావాల్సి ఉంది. అప్స్ట్రీమ్ లేన్ జూలై 2020 లో పూర్తయింది. ఆ తరువాత డౌన్స్ట్రీమ్ లేన్ 2021 నాటికి పూర్తవుతుంది. పాత కాంక్రీట్ సూపర్స్ట్రక్చర్ స్థానంలో 6600 మెట్రిక్ స్టీల్తో కూడిన కొత్త స్టీల్ సూపర్ స్ట్రక్చర్ నిర్మిస్తున్నారు. ఇది భారతదేశంలో మొదటిసారిగా అమలు చేస్తున్న వినూత్న ప్రాజెక్ట్. ఉత్తర వైపున ఉన్న లబ్ధిపొందుతున్న జిల్లాల్లో హాజీపూర్, చప్రా, ముజ్జార్పూర్, సమస్తిపూర్, దర్భాంగా, మధుబని, సీతామార్హి, సివాన్, తూర్పు యుపి ఉన్నాయి. దక్షిణం వైపు - పాట్నా, ఆరా, అర్వాల్, జహానాబాద్, నలంద, గయా, ఔరంగాబాద్, జార్ఖండ్ జిల్లాలు ఉన్నాయి.
జాతీయ జలమార్గ నెట్వర్క్ కావాలన్న తన కలను మంత్రి గుర్తు చేసుకున్నారు, దీని కింద ప్రయాగ్ రాజ్ , హల్దియాల మధ్య గంగా నదిలో మూడు మీటర్ల లోతు నీరు ఉండేలా చూసుకున్నారు. ప్రయాగ్ రాజ్, వారణాసి మధ్య పూడిక తీత పూర్తయిందని ఆయన అన్నారు. తదుపరి దశలో, ఢిల్లీ ప్రయాగ్రాజ్ మధ్య యమునా నదిలో ఒక మీటర్ డ్రాఫ్ట్ పని చేస్తున్నారు. ఈ దశ కోసం ఇప్పటికే ప్రపంచ బ్యాంకుకు రూ .12,000 కోట్ల విలువైన డిపిఆర్ సమర్పించినట్లు ఆయన తెలిపారు. ఢిల్లీ హల్దియాల మధ్య జలమార్గ ప్రయాణం గురించి తన కల త్వరలో ఫలవంతమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఖర్చు తక్కువ, పర్యావరణ అనుకూల దిశలో ఉంది కనుక నదీ రవాణాను పెద్ద ఎత్తున స్వీకరించాలని బిహార్ రాజకీయ నాయకత్వానికి శ్రీ గడ్కరీ పిలుపునిచ్చారు. వాణిజ్య కార్యకలాపాల కోసం నది రవాణాను స్వీకరించడం ద్వారా, ప్రభుత్వాలు, వ్యాపార వర్గాలు దాని లాజిస్టిక్ వ్యయాన్ని సులభంగా తగ్గించగలవు అని అన్నారు. ఇది ఆర్థిక వ్యవస్థకు ఉపశమనం కలిగిస్తుందని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి శ్రీ నితీష్ కుమార్ తన ప్రసంగంలో గతేడాది రాష్ట్రానికి భారీ అభివృద్ధి ప్యాకేజీని ప్రకటించిన ప్రధాని కృషిని స్వాగతించారు. రాష్ట్రంలోని రహదారులు, వంతెనలను వేగంగా పూర్తి చేసినందుకు శ్రీ గడ్కరీని ఆయన అభినందించారు. అయితే, ప్రస్తుతం ఉన్న విక్రమ్షిలా వంతెనకు సమాంతరంగా మరో 2 లేదా 4 లేన్ల వంతెనను కూడా పరిశీలించాలని ఆయన మంత్రిని అభ్యర్థించారు. బక్సర్ మరియు వారణాసి మధ్య ప్రత్యక్ష మార్గం అవసరాన్ని కూడా ఆయన సూచించారు. ట్రాఫిక్ సజావుగా సాగడానికి ఎన్హెచ్ వెడల్పులో ఏకరూపత అవసరమని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.
కేంద్ర మంత్రి శ్రీ రామ్ విలాస్ పాశ్వాన్ 1977 నుండి తన హాజీపూర్ రోజులను గుర్తుచేసుకున్నారు, నదిని దాటడానికి స్టీమర్ సేవ మాత్రమే అందుబాటులో ఉండేదని ఆయన అన్నారు. అతను మాట్లాడుతూ, నదిని దాటడానికి స్టీమర్ కోసం దాదాపు పూర్తి రోజు వేచి ఉండాల్సి వచ్చేదని చెప్పారు. పార్లమెంటులో పలు సందర్భాల్లో ఈ విషయాన్ని లేవనెత్తారని ఆయన అన్నారు.
బీహార్ ఉప ముఖ్యమంత్రి శ్రీ సుశీల్ కుమార్ మోడీ మాట్లాడుతూ గత ఏడాది ప్రధాని ప్రకటించిన 1,25,000 కోట్ల రూపాయల ప్యాకేజీలో ఈ ప్రాజెక్టు ఒక భాగమే అన్నారు. దీని కింద బీహార్లోని రోడ్ల కోసం రూ .53 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 2005 లో అధికారం చేపట్టినప్పుడు రాష్ట్రంలో కేవలం నాలుగు వంతెనలు మాత్రమే ఉండగా, ప్రభుత్వం మరో 14 వంతెనలను నిర్మిస్తోందని, అతి త్వరలో రాష్ట్రంలో 18 వంతెనలు ఉంటాయని ఆయన చెప్పారు.
గంగా నది, ఇతర నదులు బీహార్ను వివిధ విభాగాలుగా విభజిస్తున్నాయి కాబట్టి అభివృద్ధి కోసం బీహార్లోని అన్ని ప్రాంతాలను అనుసంధానించడానికి ప్రధాన వంతెనలు చాలా అవసరం. దీని ప్రకారం, గంగా, కోసి నదికి ఐదు ప్రధాన వంతెనల నిర్మాణానికి మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. అవి బక్సర్ వంతెన (బక్సర్), న్యూ గంగా వంతెన (పాట్నా), విక్రమ్షిలా వంతెన (భాగల్పూర్), కోసి వంతెన (మాధేపూర్-భాగల్పూర్), సాహిబ్గంజ్ వంతెన ( కతియార్-సాహిబ్ గంజ్).
బీహార్ లో వివిధ ప్రోజెక్టుల తాజా స్థితిగతులు :
S.NO
|
NAME OF THE PROJECT
|
STATUS
|
scheduled date of completion
|
1
|
Patna Bakhtiyarpur NH 30
|
99%
|
September, 2020
|
2
|
Hajipur Muzaffarpur NH 77
|
75%
|
June, 2021
|
3
|
Muzzafarpur SonbarsA NH 77
|
99%
|
September, 2020
|
4
|
Sitamarhi-Jayanagar-Narahia
|
45%
|
March, 2021
|
5
|
Chhapra-Revaghat-Muzzafarpur
|
100%
|
March 2020
|
6
|
Chhapra-Gopalganj
|
92%
|
December 2020
|
7
|
Biharsharif-Barbigha-Mokama
|
87%
|
December 2020
|
8
|
Approach road to Rail cum Road Munger bridge
|
40%
|
May 2021
|
9
|
Kishanganj flyover
|
50%
|
February, 2021
|
10
|
Koilwar-Bhojpur
|
55%
|
June, 2021
|
11
|
Bhojpur- Buxar
|
40%
|
October, 2021
|
|
|
|
|
***
(Release ID: 1642697)