రాష్ట్రపతి సచివాలయం
ఈద్-ఉల్-జుహా శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి
Posted On:
31 JUL 2020 5:26PM by PIB Hyderabad
ఈద్-ఉల్-జుహా పర్వదినం సందర్భంగా దేశ ప్రజలకు భారత రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ శుభాకాంక్షలు తెలిపారు. “ఈద్-ఉల్-జుహా సందర్భంగా, తోటి పౌరులందరికీ ముఖ్యంగా మన ముస్లిం సోదరులు, సోదరీమణులకు
శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను" అని తన సందేశంలో రాష్ట్రపతి పేర్కొన్నారు.
“ఈద్-ఉల్-జుహా త్యాగం మరియు స్నేహం యొక్క స్ఫూర్తిని సూచిస్తుంది.. ఇది ఒకరి మరియు అందరి శ్రేయస్సు కోసం పనిచేయడాన్ని ప్రేరేపిస్తుంది.
కోవిడ్-19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని సూచించిన అన్ని నియమాలు మరియు మార్గదర్శకాలను అనుసరించాలనే మన సంకల్పాన్ని పునరుద్ఘాటిద్దాం. ఈ పండుగ సందర్భంగా, మన ఆనందాన్ని ఇతరులతో పంచుకుందాం మరియు పరస్పర సామరస్యాన్ని ప్రోత్సహిద్దాం”.
అధ్యక్షుడి సందేశాన్ని హిందీలో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి
(Release ID: 1642695)