ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ

ఆగ్రో-ప్రాసెసింగ్ క్లస్టర్ల ప్రమోటర్లతో వీడియో కాన్ఫరెన్స్ లు నిర్వహించిన శ్రీమతి హరిసిమ్రత్ కౌర్ బాదల్

ఆగ్రో- ప్రాసెసింగ్ క్లస్టర్ పథకం కింద 36 ప్రాజెక్టుల సమీక్ష

చేపట్టిన ప్రాజెక్టులకు నెలవారీ వర్చువల్ తనిఖీలు

Posted On: 19 JUN 2020 6:02PM by PIB Hyderabad

వ్యవసాయ ప్రాసెసింగ్ క్లస్టర్ల కోసం మౌలిక సదుపాయాల కల్పన పథకం కింద ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ (మోఎఫ్‌పిఐ) మద్దతుతో కొనసాగుతున్న వ్యవసాయ ప్రాసెసింగ్ క్లస్టర్ల (ఎపిసి) ప్రమోటర్లతో  కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రి శ్రీమతి హరిసిమ్రత్ కౌర్ బాదల్, వీడియో సమావేశాలు నిర్వహించారు. కేంద్ర ఎఫ్‌పిఐ సహాయ మంత్రి, శ్రీ  రామేశ్వర్ తేలి కూడా ఈ సమావేశాల్లో పాల్గొన్నారు.

అస్సాం, ఆంధ్రప్రదేశ్, బీహార్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్ము కశ్మీర్ , కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో మంత్రిత్వ శాఖ ఆమోదించిన 36 ప్రాజెక్టులు సమీక్షించారు. ప్రమోటర్లు కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రితో సంభాషించారు. ప్రాజెక్టుల అమలులో తమ అనుభవాలను / సమస్యలను పంచుకున్నారు.

శ్రీమతి హరిసిమ్రత్ కౌర్ బాదల్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టులలో అవసరమైన ప్రత్యక్ష పరిశీలనకు  ప్రత్యామ్నాయంగా తమ మంత్రిత్వ శాఖ  ఒక కొత్త యంత్రాంగాన్ని రూపొందించిందన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సాధనాలను పెంచడం ద్వారా నెలవారీ వర్చువల్ తనిఖీలు జరుగుతున్నాయి. ఒక ప్రాజెక్ట్  పురోగతిని పర్యవేక్షించడం, మూల్యాంకనం చేయడం వర్చువల్ తనిఖీ నమూనాను అనుసరించడం ద్వారా ఒక బృందం నిర్వహిస్తుంది అని తెలిపారు. .

జూన్ 17, 18 న జరిగిన ఎపిసి పథకం సమీక్ష సమావేశాలు, ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులను నిశితంగా సమీక్షించడానికి MoFPI చే సమన్వయం చేయబడిన ఆన్‌లైన్ సమావేశాల కొనసాగింపుగా ఉన్నాయి. ప్రాజెక్టుల ప్రమోటర్లకు సహాయం చేయడానికి కార్యకలాపాలు, కార్మిక, లాజిస్టిక్స్ సమస్యలకు సంబంధించిన ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. అందువల్ల, లాక్డౌన్ పరిమితుల కారణంగా ప్లాంట్ మరియు యంత్రాల సంస్థాపన ఆలస్యం కావడంతో అనేక ప్రాజెక్టులకు పూర్తి తేదీ పొడిగింపు ఇచ్చారు.

ఆన్‌లైన్, ఇతర వర్చువల్ మార్గాల ద్వారా ప్రాజెక్టుల ఆమోదం, సమీక్ష కోసం ఎంఓఎఫ్పిఐ  ఇంటర్ మినిస్టీరియల్ సమావేశాలను నిర్వహిస్తోంది. దీనితో పాటు, పరిశ్రమల సంఘాలు, వివిధ వాటాదారులు, ప్రాజెక్టుల ప్రమోటర్లు లేవనెత్తిన వివిధ సమస్యలు, ఆందోళనలను మంత్రిత్వ శాఖ తన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌తో చురుకైన విధానంతో పరిష్కరిస్తోంది.

సంబంధిత పథకాల కింద సబ్సిడీ కోసం దరఖాస్తులను స్వీకరించడానికి, ప్రాసెస్ చేయడానికి, మంజూరు చేయడానికి ప్రత్యేక పెట్టుబడి పోర్టల్, 'సంపద' మంత్రిత్వ శాఖ కలిగి ఉంది.



(Release ID: 1632868) Visitor Counter : 155