శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
పరిశోధన మరియు ఆవిష్కరణలను సులభతరం చేయడం: జీవ సాంకేతిక విజ్ఞాన విభాగం ద్వారా నాలుగు కోవిడ్-19 బయో బ్యాంకుల స్థాపన.
Posted On:
30 MAY 2020 1:48PM by PIB Hyderabad
కోవిడ్-19 మహమ్మారి యొక్క ఉపశమనం కోసం, వ్యాక్సిన్లు, డయాగ్నస్టిక్స్ మరియు చికిత్సా విధానాల అభివృద్ధి కోసం ఆర్&డి ప్రయత్నాలను నిర్దేశించడం జరిగింది. కోవిడ్-19 పాజిటివ్ రోగులనుండి సేకరించిన నమూనాలు ఈ పరిశోధన, అభివృద్ధి ప్రయత్నాలకు విలువైన వనరులుగా పనికి వస్తాయి. కోవిడ్-19 కు సంబంధించిన పరిశోధనల కోసం జీవ నమూనాలను మరియు సమాచారాన్నీ పంచుకోవడానికి అవసరమైన మార్గదర్శకాలను నీతీ ఆయోగ్ ఇటీవల విడుదల చేసింది. క్యాబినెట్ కార్యదర్శి ఆదేశాల ప్రకారం, భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐ.సి.ఎం.ఆర్.) కోవిడ్-19 రోగులకు చెందిన క్లినికల్ నమూనాలను (ఒరోఫారింజియల్ / నాసోఫారింజియల్ శ్వాబ్, బ్రోన్కోఅల్వోలార్ లావేజ్, కఫం, రక్తం, మూత్రం మరియు మలం) సేకరించడం, నిల్వ చేయడం మరియు నిర్వహించడం కోసం 16 జీవ సురక్షిత కేంద్రాలను ప్రకటించడం జరిగింది.
16 జీవ సురక్షిత కేంద్రాల జాబితా ఈ విధంగా ఉంది: ఐ.సి.ఎం.ఆర్. - 9, డి.బి.టి. - 4 మరియు సి.ఎస్.ఐ.ఆర్. - 3. జీవ సాంకేతిక విజ్ఞాన విభాగం పరిధిలోని నాలుగు జీవ సురక్షిత విభాగాల వివరాలు : ఎన్.సి.ఆర్.-జీవ సాంకేతిక విజ్ఞాన క్లస్టర్ (i) టీ.హెచ్.ఎస్.టి.ఐ, ఫరీదాబాద్ - క్లినికల్ సాంపిల్స్, (ii) ఆర్.సి.బి., ఫరీదాబాద్ - వైరల్ సాంపిల్స్, జీవ శాస్త్ర సంస్థ, భువనేశ్వర్, ఇన్ స్టెమ్, బెంగుళూరు, మరియు ఐ.ఎల్.బి.ఎస్., న్యూఢిల్లీ. కోవిడ్-19 రోగుల యొక్క ఒరోఫారింజియల్ / నాసోఫారింజియల్ శ్వాబ్స్, కఫం, రక్తం, మూత్రం మరియు మలం భవిష్యత్తులో ఉపయోగం కోసం చెల్లుబాటు అయ్యే డయాగ్నస్టిక్స్, థెరప్యూటిక్స్, టీకాలు మొదలైనవాటిని సేకరించి భద్రపరచడం జరుగుతుంది .
నమూనా సేకరణ, రవాణా, ఆల్కాటింగ్, నిల్వ మరియు భాగస్వామ్యం కోసం ఏకరీతి ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను (ఎస్.ఓ.పి. లను) ఈ నియమిత సౌకర్యాలు అభివృద్ధి చేస్తాయి. కోవిద్-19 నమూనాల కోసం బయోబ్యాంకుల పాత్ర టీకా మరియు చికిత్సల అభివృద్ధి; నాసోఫారింజియల్ శ్వాబ్ తో సహా నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకత్వం; మరియు కరోనావైరస్ నమూనాల కల్చర్ లతో పనిచేసేటప్పుడు, అధిక బి.ఎస్.ఎల్.-3 పద్ధతులను అనుసరించాల్సిన పరిస్థితులు. జీవ సాంకేతిక విజ్ఞాన విభాగం ఈ కోవిడ్-19 కోసం నియమించబడిన బయో-బ్యాంక్ సదుపాయాలకు చక్కటి వ్యూహాత్మక భవిష్యత్ ప్రణాళిక ద్వారా మద్దతునిస్తోంది. తద్వారా నూతన సాంకేతిక జోక్యాలను సకాలంలో అభివృద్ధి చేయవచ్చు. ఈ నియమిత జీవ సురక్షిత కేంద్రాలు క్లినికల్ శాంపిల్స్ను పరిశోధన మరియు అభివృద్ధి ప్రయోజనం కోసం ఆయా సంస్థలలో ఉపయోగిస్తాయి.
దీనితో పాటు, అభ్యర్థన యొక్క ఉద్దేశ్యాన్ని పరిశీలించి, దేశానికి ప్రయోజనం చేకూర్చిన తరువాత, వ్యాధి నిర్ధారణ , చికిత్స, వ్యాక్సిన్లు మొదలైన వాటి అభివృద్ధిలో పాల్గొన్న విద్య, పరిశ్రమ మరియు వాణిజ్య సంస్థలతో నమూనాలను పంచుకోవడానికి వారికి అధికారం ఉంటుంది. క్లినికల్ మరియు వైరల్ రెండింటికీ జీవ నమూనాలను పంచుకోవడం మన పరిశోధకులు, అంకురసంస్థలు, మరియు పరిశ్రమ ద్వారా కొత్త సాంకేతిక పరిజ్ఞానం మరియు ఉత్పత్తి అభివృద్ధికి కీలకం కానుంది. ఆత్మనిర్భర్ భారత్ దిశగా మన ప్రయాణంలో ఇది ఒక కీలకమైన దశ.
కోవిడ్-19 కోసం బయోటెక్నాలజీ విభాగం సులభతరం చేసిన వేగవంతమైన ప్రతిస్పందన నియంత్రణ తో కూడిన యంత్రాంగం
జీవ భద్రత నియంత్రణను క్రమబద్ధీకరించడానికి మరియు రీకాంబినెంట్ (రసాయనిక చర్యలతో మరల కలిపే విధానం) డిఎన్ఎ టెక్నాలజీ మరియు ప్రమాదకర సూక్ష్మ జీవులలో పరిశోధన మరియు అభివృద్ధిని చేపట్టే పరిశోధకులు మరియు పరిశ్రమలను సులభతరం చేయడానికి బయోటెక్నాలజీ విభాగం అనేక చురుకైన చర్యలు తీసుకుంది.
1. ఇండియన్ బయో సేఫ్టీ నాలెడ్జ్ పోర్టల్ వినియోగం : ఇండియన్ నాలెడ్జ్ బయో సేఫ్టీ పోర్టల్ 2019 మే నెల లో ప్రారంభించబడింది. పూర్తిగా అమలు చేయబడింది. ఇప్పుడు విభాగంలో అన్ని కొత్త దరఖాస్తులను ఆన్లైన్ పోర్టల్ ద్వారా మాత్రమే స్వీకరించడం జరుగుతోంది. ఇది మొత్తం ప్రక్రియను పారదర్శకంగా మరియు కాలపరిమితిగా మార్చింది.
2. పరిశోధన మరియు అభివృద్ధి ప్రయోజనం కోసం జి.ఈ. జీవులు మరియు ఉత్పత్తుల దిగుమతి, ఎగుమతి మరియు మార్పిడిపై సవరించిన సరళీకృత మార్గదర్శకాల ప్రకటన : 2020 జనవరిలో సవరించిన మార్గదర్శకాలను శాఖ జారీ చేసింది. దీనిలో ఆర్.జి.-1 మరియు ఆర్.జి.-2 వస్తువుల పరిశోధన, అభివృద్ధి ప్రయోజనం కోసం దిగుమతి ఎగుమతి మరియు జి.ఈ. జీవుల మార్పిడి మరియు ఉత్పత్తి యొక్క దరఖాస్తులపై నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని సంస్థాగత జీవ భద్రత కమిటీకి అప్పగించారు.
3. కోవిడ్-19 పై పరిశోధన మరియు అభివృద్ధి కి వీలుకల్పించడం : కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న పరిస్థితుల నేపథ్యంలో, కోవిడ్-19 కోసం వేగవంతమైన పరిశోధన మరియు అభివృద్ధి యొక్క అవసరాలపై అవగాహనతో, కోవిడ్-19 పై పరిశోధనలో పాల్గొన్న పరిశోధకులు మరియు పరిశ్రమలను సులభతరం చేయడానికి ఈ విభాగం ముందస్తుగా అనేక చర్యలు తీసుకుంది.
కోవిడ్-19 పై డి.బి.టి. ఈ క్రింది మార్గదర్శకాలు, ఆదేశాలు మరియు చెక్లిస్ట్ జారీ చేసింది.
i. టీకాలు, వ్యాధి నిర్ధారణ, రక్షణాత్మకమైన, మరియు చికిత్సా పరమైన అభివృద్ధికి దరఖాస్తును పరిష్కరించడానికి కోవిడ్-19 కోసం వేగవంతమైన ప్రతిస్పందన నియంత్రణ తో కూడిన విధి విధాన పత్రం 20.03.2020 తేదీన ప్రకటించబడింది.
ii. “కోవిడ్-19 నమూనాలను నిర్వహించడానికి ప్రయోగశాల జీవ భద్రతపై తాత్కాలిక మార్గదర్శక పత్రం” డి.బి.టి. 08.04.2020 తేదీన ప్రకటించింది.
iii. 2020 జూన్ 30వ తేదీ వరకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా తమ సమావేశాలను నిర్వహించుకోడానికి ఐ.బి.ఎస్.సి. లను అనుమతించారు.
iv. రసాయనిక చర్యతో డి.ఎన్.ఏ. కోవిడ్-19 వ్యాక్సిన్ అభివృద్ధి కోసం వేగవంతమైన ప్రతిస్పందన నియంత్రణ తో కూడిన విధి విధాన పత్రం 26.05.2020 తేదీన జారీ చేయబడింది.
జాతీయ పరిశోధనా ప్రయోగశాలలు మరియు విశ్వవిద్యాలయాలలో (హబ్ మరియు స్పోక్ మోడల్) కోవిడ్ పరీక్షా కేంద్రాల సంఖ్య పెంపు :
దేశవ్యాప్తంగా ప్రభుత్వ సంస్థలలో కోవిడ్-19 నమూనాల సంఖ్యను పెంచి పరీక్షించడానికి నగరం / ప్రాంతీయ క్లస్టర్లు హబ్ మరియు స్పోక్ మోడల్లో స్థాపించబడ్డాయి. నమూనా సేకరణ, నిర్వహణ / ప్రాసెసింగ్ (బిఎస్ఎల్ -2 సౌకర్యం) మరియు పరీక్ష (ఆర్.టి. -పిసిఆర్) రెండింటికి సామర్థ్యం మరియు నైపుణ్యం కలిగిన సంస్థలు మరియు ప్రయోగశాలలు కేంద్రాలుగా పనిచేస్తాయి. ఆర్.టి.-పి.సి.ఆర్. యంత్రాలు, అవసరమైన మానవశక్తితో విస్తరించిన పరీక్షా సౌకర్యాలు కలిగి ఉన్న అనేక ప్రయోగశాలలను కలిగి ఉంటాయి.
ఈ హబ్స్ - ఐ.సి.ఎం.ఆర్. మార్గదర్శకాల ప్రకారం సంబంధిత మంత్రిత్వ శాఖలు / విభాగాలు (డి.బి.టి., డి.ఎస్.టి. , సి.ఎస్.ఐ.ఆర్., డి.ఏ.ఇ., డి.ఆర్.డి.ఓ., ఐ.సి.ఎ.ఆర్. మొదలైనవి) ఆమోదించిన ప్రభుత్వ ప్రయోగశాలలు. ఇంతవరకు బెంగుళూరు, ఢిల్లీ/ఎన్.సి.ఆర్., హైదరాబాద్, తిరువనంతపురం, చండీగఢ్/మొహాలీ, భువనేశ్వర్, నాగపూర్, పూణే, ముంబై, లక్నో, చెన్నై, కోల్కతా, ఈశాన్య ప్రాంతం, జమ్మూ & కశ్మీర్, అహ్మదాబాద్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బనారస్, పాలంపూర్, ఢిల్లీ వంటి 19 నగరాలు / ప్రాంతీయ క్లస్టర్లలో వీటిని ఏర్పాటు చేశారు.
సుమారు 100 సంస్థలు పాల్గొని, దాదాపు 1,60,000 కు పైగా నమూనాలను పరీక్షించాయి. ఏడు డి.బి.టి. స్వయం ప్రతిపత్తి సంస్థలను ఐ.సి.ఎం.ఆర్. హబ్ లుగా ఆమోదించడం జరిగింది. అవి (ఆర్.జి.సి.బి., టి.హెచ్.ఎస్.టి.ఐ., ఐ.ఎల్.ఎస్., ఇన్ స్టెమ్, ఎన్.సి.సి.ఎస్., సి.డి.ఎఫ్.డి., సి.డి.ఎఫ్.డి., ఎన్.ఐ.బి.ఎం.జి.) కోవిద్-19 నిర్ధారణ కోసం పరీక్షలు చేస్తున్నాయి.
అవి సంబంధిత నగరాలు / ప్రాంతాలలో హబ్ లు (కేంద్రాలు) గా పనిచేస్తున్నాయి. అనేక ఇతర ప్రధాన కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలతో ప్రయత్నాలను సమన్వయం చేస్తున్నాయి. అదేవిధంగా, వారు పరీక్ష కోసం నమూనాలను పొందడంలో సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్నారు, పరీక్ష ఫలితాలను ప్రతి రోజు ఐ.సి.ఎం.ఆర్. కు నివేదిస్తున్నారు. సుమారు 4 వారాలలో, ఈ క్లస్టర్లన్నీ కలిసి దాదాపు 1,70,000 పరీక్షలు చేశాయి. ఈ క్లస్టర్ల సంఖ్య వచ్చే 4 వారాల్లో దాదాపు 50 కి చేరుకోనుంది. అప్పుడు దేశంలోని మారుమూల మూల ప్రాంతాలకు కూడా చేరుకోడానికి అవకాశం కలుగుతుంది.
*****
(Release ID: 1627956)
Visitor Counter : 407