మంత్రిమండలి
ఇండియా మొరాకోల మధ్య నేరస్థుల అప్పగింత ఒప్పందం పై సంతకాలు చేసేందుకు, ఆమోదానికి కేబినెట్ అనుమతి
Posted On:
08 NOV 2018 8:44PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్, ఇండియా ,మొరాకోల మధ్య నేరస్థుల అప్పగింతకు సంబంధించిన ఒప్పందంపై సంతకాలు చేయడానికి, దాని ఆమోదానికి అనుమతిచ్చింది. ఈ ఒప్పందంపై మోరాకోదేశ వి.ఐ.పి 2018 నవంబర్ 11- 18 మధ్య మన దేశంలో పర్యటించనున్న సందర్భంగా సంతకాలు జరగనున్నాయి.
ప్రయోజనంః
ఈ ఒప్పందంలోని ఒక పక్షానికి చెందిన దేశంలో నేరానికి పాల్పడి మరో దేశంలో తలదాచుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొనే ఆర్థిక నిందితులు, ఉగ్రవాదం వంటి ఇతర తీవ్ర నేరారోపణలు ఎదుర్కొనే వారిని ఆయా దేశాలకు అప్పగించడానికి ఈ ఒప్పందం వల్ల చట్టపరంగా వీలు కలుగుతుంది.
అలాగే ఇండియా, మొరాకోల జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించే నేరస్థులను ఎదుర్కొవడానికి, ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ఈ ఒప్పందం ఉపకరిస్తుంది.
(Release ID: 1552209)
Visitor Counter : 155