మంత్రిమండలి

చట్టం & న్యాయం రంగం లో సహకారం మరియు ఒక సంయుక్త సంప్రదింపుల సంఘాన్ని ఏర్పాటు చేయడం అనే అంశాలలో భారతదేశం ఇంకా యునైటెడ్ కింగ్ డమ్ కు మధ్య ఎంఓయూ కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

Posted On: 04 JUL 2018 2:29PM by PIB Hyderabad

భారతదేశం మరియు యునైటెడ్ కింగ్ డమ్ ల మధ్య చట్టం & న్యాయం రంగం లో సహకారానికి సంబంధించి, ఇంకా ఒక సంయుక్త సంప్రదింపుల సంఘాన్ని ఏర్పాటు చేసేందుకుగాను ఇరు పక్షాలు ఒక అవగాహనపూర్వక ఒప్పందం (ఎంఓయూ) పై సంతకాలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.

ఈ ఎంఓయూ న్యాయ రంగం లోని వృత్తి నిపుణులు, ప్రభుత్వ అధికారుల అనుభవాన్ని ఇచ్చి పుచ్చుకోవడంలో ఎదురవగల సాధక బాధకాలను గురించి, ఇంకా వారి యొక్క అవసరాలను, శిక్షణ ను గురించి శ్రద్ధ వహిస్తుంది.  అలాగే వివిధ న్యాయస్థానాల, ట్రైబ్యునల్స్ తదితర సంస్థల పరిశీలన లో ఉన్నటువంటి వివాదాల పరిష్కారానికై దీటైన న్యాయ సహాయక యంత్రాంగాన్ని నెలకొల్పుకోవడం సాధ్యపడుతుంది;  సంప్రదింపుల కోసం ఒక సంయుక్త సంఘాన్ని స్థాపించాలనే ఉద్దేశం కూడా నెరవేరుతుంది.
  


***



(Release ID: 1537827) Visitor Counter : 116