ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఆంధ్ర ప్రదేశ్, గుజరాత్, కేరళ, తెలంగాణ మరియు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలలో వస్తువుల అంతర్ రాష్ట్ర చేరవేత కోసం 2018 ఏప్రిల్ 15వ తేదీ నుండి అమలు లోకి రానున్న ఇ-వే బిల్లు వ్యవస్థ
Posted On:
10 APR 2018 11:26AM by PIB Hyderabad
జిఎస్టి కౌన్సిల్ నిర్ణయానికి అనుగుణంగా వస్తువుల చేరవేతకు ఇ-వే బిల్లు వ్యవస్థను 2018 ఏప్రిల్ 1వ తేదీ నుండి అన్ని రాష్ట్రాలలో ఆరంభించడమైంది. అదే తేదీ నాటి నుండి కర్నాటక లో కూడా సరుకుల అంతర్ రాష్ట్ర చేరవేతకు ఇ-వే బిల్లు వ్యవస్థ అమలు లోకి వచ్చింది. ఇ-వే బిల్లు లను విజయవంతంగా అమలు చేయడం జరుగుతోంది; 2018 ఏప్రిల్ 9వ తేదీ వరకు 63 లక్షలకు పైగా ఇ-వే బిల్లులను విజయవంతంగా అమలు చేయడమైంది.
ఈ కింద పేర్కొన్న రాష్ట్రాలలో సరుకుల అంతర్ రాష్ట్ర చేరవేత కోసం ఇ-వే బిల్లు వ్యవస్థను 2018 ఏప్రిల్ 15వ తేదీ నుండి అమలులోకి తీసుకు వస్తున్నట్లు తెలియపరచడమైంది:
(i) ఆంధ్ర ప్రదేశ్
(ii) గుజరాత్
(iii) కేరళ
(iv) తెలంగాణ
(v) ఉత్తర్ ప్రదేశ్
ఈ రాష్ట్రాలలో ఇ-వే బిల్లు వ్యవస్థ అమలు లోకి వచ్చాక సరుకుల రవాణాకు సంబంధించినంత వరకు చూస్తే వ్యాపారం, పరిశ్రమల రంగాల మధ్య మరింత సమన్వయం నెలకొంటుందని, తద్వారా దేశవ్యాప్తంగా ఒకే ఇ-వే బిల్లు వ్యవస్థ ఏర్పడేందుకుగాను మార్గం సుగమం అవుతుందని ఆశిస్తున్నారు. ఈ రాష్ట్రాలలోని వ్యాపార, పారిశ్రామిక మరియు రవాణా సంస్థలు చివరి తేదీ కోసం వేచి వుండకుండా, ఇ- వే బిల్లు పోర్టల్ అయిన https://www.ewaybillgst.gov.in ను సందర్శించి రిజిస్ట్రేషన్/ ఎన్ రోల్ మెంట్ ను పొందవచ్చును.
***
(Release ID: 1528453)
Visitor Counter : 113