Social Welfare
భారత్లో మెడికల్, వెల్నెస్ టూరిజం
Posted On:
02 MAY 2026 10:10AM
అత్యాధునిక వైద్య మౌలిక సదుపాయాలను ఆయుష్ వంటి సాంప్రదాయ ఆరోగ్య వ్యవస్థలతో అనుసంధానించడం ద్వారా భారతదేశం మెడికల్ వాల్యూ ట్రావెల్(ఎంవీటీ)లో అగ్రగామి హబ్గా ఎదుగుతోంది. బలమైన విధానపరమైన మద్దతు, డిజిటల్ సౌలభ్యాలు, ఆయుష్ వీసా, రీజినల్ మెడికల్ హబ్స్ వంటి కార్యక్రమాలు ఈ వ్యవస్థను బలోపేతం చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ ఖర్చులు, సమగ్ర సంరక్షణ కోసం పెరుగుతున్న డిమాండ్, సరసమైన ధరలలో నాణ్యమైన చికిత్స, నివారణ వెల్నెస్ పరిష్కారాల కోసం అంతర్జాతీయ రోగులను భారతదేశం వైపు నడిపిస్తున్నాయి.
ప్రపంచ స్వస్థత గమ్యస్థానంగా భారతదేశం
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ ఖర్చులు, సుదీర్ఘ నిరీక్షణ సమయం, జీవనశైలి వ్యాధుల పెరుగుతున్న భారం రోగులను విదేశాలలో చికిత్స పొందేలా ప్రేరేపిస్తున్నాయి. ఈ ప్రపంచవ్యాప్త మార్పు మల్టీ-బిలియన్ డాలర్ల మెడికల్ వాల్యూ ట్రావెల్(ఎంవీటీ) పరిశ్రమ ఆవిర్భావానికి దారితీసింది.
ప్రపంచ మెడికల్ వాల్యూ ట్రావెల్ మార్కెట్ విలువ 2022లో సుమారు 115.6 బిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉంది. ఇది 2030 నాటికి సుమారు 286.1 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ఈ మార్కెట్ సుమారు 10.8% చక్రవడ్డీ వార్షిక వృద్ధి రేటు(సీఏజీఆర్)తో వృద్ధి చెందుతోంది.
పరిణామం చెందుతున్న ఈ ప్రపంచ దృశ్యంలో భారతదేశం అత్యంత ముఖ్యమైన గమ్యస్థానాలలో ఒకటిగా నిలిచింది. పరిశ్రమ అంచనాల ప్రకారం మెడికల్ టూరిజం మార్కెట్ 2025లో సుమారు 8.7 బిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉండగా, 2030 నాటికి ఇది 16.2 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా.
శతాబ్దాలుగా స్వస్థత, సమతుల్యత, కోలుకోవాలని కోరుకునే వారికి భారతదేశం ఒక శరణాలయంగా పరిణమించింది. ఈ పురాతన వారసత్వం ఇప్పుడు విభిన్నమైన మెడికల్ వాల్యూ ట్రావెల్ వ్యవస్థగా రూపాంతరం చెందింది. ఇది ఆధునిక వైద్య శాస్త్రాన్ని సాంప్రదాయ వ్యవస్థల కాలాతీత విజ్ఞానంతో మిళితం చేస్తుంది.
ప్రభుత్వం తన ప్రతిష్టాత్మక "హీల్ ఇన్ ఇండియా" కార్యక్రమం ద్వారా దేశాన్ని సమగ్ర, సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ కోసం ఒక ప్రధాన గమ్యస్థానంగా నిలుపుతోంది.

ఈ రంగం పరిధిని అర్థం చేసుకోవడానికి, దాని రెండు శక్తివంతమైన స్తంభాల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడం చాలా అవసరం:
- మెడికల్ టూరిజం: ఇది ప్రత్యేక ఆసుపత్రులు, ఆరోగ్య సంరక్షణ సంస్థల ద్వారా అందించే సంక్లిష్ట శస్త్రచికిత్సలు, అవయవ మార్పిడి, అధునాతన రోగనిర్ధారణ సంరక్షణ వంటి నివారణ జోక్యాలపై దృష్టి పెడుతుంది.
- వెల్నెస్ టూరిజం: ఇది యోగా, ఆయుర్వేదం, ప్రకృతి వైద్యం, ఇతర ఆయుష్ పద్ధతుల వంటి సాంప్రదాయ వ్యవస్థల ద్వారా నివారణ, సంపూర్ణ శ్రేయస్సుపై దృష్టి పెడుతుంది. ఇది శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని పెంపొందించే చికిత్సలను అందిస్తుంది.
ఈ రెండు స్తంభాలు కలిసి భారతదేశపు మెడికల్ వాల్యూ ట్రావెల్ వ్యవస్థకు పునాదిని ఏర్పరుస్తాయి. ఇవి అధునాతన క్లినికల్ చికిత్స అవసరాలతో పాటు నివారణ ఆరోగ్య సంరక్షణ కోసం పెరుగుతున్న ప్రపంచ డిమాండ్ను పరిష్కరిస్తాయి.
మెడికల్ టూరిజం ఇండెక్స్ 2020–21 ప్రకారం:
- ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 46 వైద్య పర్యాటక గమ్యస్థానాలలో భారతదేశం 10వ స్థానంలో ఉంది.
- ప్రపంచంలోని టాప్ 20 వెల్నెస్ టూరిజం మార్కెట్లలో 12వ స్థానంలో ఉంది.
- ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని టాప్ 10 వెల్నెస్ గమ్యస్థానాలలో 5వ స్థానంలో ఉంది.

2025-26 గణాంకాలు
పర్యాటక మంత్రిత్వ శాఖ అంచనాల ప్రకారం.. 2024 ఆర్థిక సంవత్సరంలో ప్రయాణ, పర్యాటక రంగం జీడీపీకి 5.22 శాతం సహకరించింది. ఇది పాండమిక్ పూర్వ స్థాయిలకు చేరువలో ఉంది. ఈ రంగం సుమారు 8.46 కోట్ల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలకు మద్దతు ఇచ్చింది. ఇది మొత్తం ఉపాధిలో సుమారు 13.3 శాతంగా ఉంది.

2025 నాటి తాజా డేటా ఈ రంగం వేగాన్ని చాటి చెప్తోంది:
- విదేశీ పర్యాటకుల రాక(ఎఫ్టీఏ): 2025లో భారతదేశం 91.5 లక్షల ఎఫ్టీఏలను నమోదు చేసింది.
- వైద్య ప్రయోజనాల కోసం వచ్చిన వారు: 2025లో 5,07,244 మంది విదేశీయులు ప్రత్యేకంగా వైద్య చికిత్స కోసం వచ్చారు.
- రంగాల వాటా: 2025 డేటా ప్రకారం మెడికల్ టూరిజం మొత్తం ఎఫ్టీఏలలో సుమారు 5.5% గా ఉంది.
- ప్రధాన మార్కెట్లు: 2025 గణాంకాల ప్రకారం.. మెడికల్ టూరిస్టులు ఎక్కువగా వచ్చే దేశాలలో బంగ్లాదేశ్(3,25,127), ఆ తర్వాత ఇరాక్(30,989), ఉజ్బెకిస్థాన్(13,699), సోమాలియా(11,506), తుర్క్మెనిస్థాన్(10,231), ఒమన్(9,738), కెన్యా (9,357) ఉన్నాయి.
- ఇతర దేశాల నుంచి రోగులు ప్రధానంగా ఈ కింది ప్రత్యేక చికిత్సల కోసం భారతదేశానికి ప్రయాణిస్తారు:
* గుండె శస్త్రచికిత్స
* ఆర్థోపెడిక్ చికిత్స
* క్యాన్సర్ చికిత్స
* అవయవ మార్పిడి
* న్యూరోలాజికల్ జోక్యాలు
* కాస్మెటిక్ సర్జరీ
* దంత సంరక్షణ
* సంతానోత్పత్తి చికిత్స
* ఆయుష్ ఆధారిత వెల్నెస్ థెరపీలు
భారతదేశ పోటీతత్వం: నాణ్యత, నైపుణ్యం, సరసమైన ఖర్చులు
మెడికల్ టూరిజం ఇండెక్స్(ఎంటీఐ)లో భారతదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా 10వ స్థానంలో నిలిపేలా ఒక ప్రత్యేక ప్రయోజనాన్ని భారత్ కలిగి ఉంది. ఈ పోటీతత్వ ప్రయోజనానికి సంబంధించిన అనేక స్తంభాలను ప్రభుత్వం గుర్తిస్తుంది:
బలమైన వైద్య వనరులు
భారతదేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ప్రపంచంలోనే అతిపెద్ద శిక్షణ పొందిన వైద్య నిపుణుల సమూహాలలో ఒకదాని ద్వారా మద్దతు పొందుతోంది.
భారతదేశంలో 69,364 ఆసుపత్రులలో(43,486 ప్రైవేట్ ఆసుపత్రులు, 25,778 ప్రభుత్వ ఆసుపత్రులు) 1.2 మిలియన్ల రిజిస్టర్డ్ వైద్యులు ఉన్నారు. ఇది డబ్ల్యూహెచ్ఓ సిఫార్సు చేసిన డాక్టర్-జనాభా నిష్పత్తిని సాధించింది.
దీంతో పాటు భారతదేశంలో వైద్య విద్య, క్లినికల్ ప్రాక్టీస్కు ఇంగ్లీష్ ప్రాథమిక భాషగా ఉపయోగపడుతుంది. ఇది అంతర్జాతీయ రోగులతో సులువుగా సంభాషించేందుకు అవకాశం కల్పిస్తోంది. గత దశాబ్ద కాలంలో భారతదేశం తన వైద్య విద్యా సామర్థ్యాన్ని , ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను గణనీయంగా విస్తరించింది. ఇది ప్రత్యేక విభాగాలలో నైపుణ్యం కలిగిన ఆరోగ్య సంరక్షణ నిపుణుల లభ్యతను బలోపేతం చేసింది.
అధునాతన సాంకేతికత, గుర్తింపు
భారతదేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు నాణ్యతపై బలమైన హామీనిచ్చే యంత్రాంగాలు ఉన్నాయి. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన అక్రిడిటేషన్ ప్రమాణాల ద్వారా ఈ వ్యవస్థ నడుస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులు, ఆరోగ్య సంరక్షణ ప్రదాతలు నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్కేర్ ప్రొవైడర్స్(ఎన్ఏబీహెచ్) నుంచి అక్రిడిటేషన్ పొందుతారు.
ఎన్ఏబీహెచ్ రోగి భద్రత, సంరక్షణ నాణ్యత కోసం కఠినమైన ప్రమాణాలను ఏర్పాటు చేస్తుంది. 2026 నాటికి ఎన్ఏబీహెచ్ 600కు పైగా భద్రతా పారామితులను ఉపయోగించి 1,299 కంటే ఎక్కువ ఆసుపత్రులకు అక్రిడిటేషన్ ఇచ్చింది. అదే సమయంలో క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా క్రమబద్ధమైన నాణ్యత మెరుగుదలని పర్యవేక్షిస్తుంది.
ఎన్ఏబీహెచ్ అక్రిడిటేషన్ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ క్వాలిటీ ఇన్ హెల్త్కేర్తో దాని అనుబంధం ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అదనంగా అనేక భారతీయ ఆసుపత్రులు జాయింట్ కమిషన్ ఇంటర్నేషనల్(జేసీఐ) అక్రిడిటేషన్ కలిగి ఉన్నాయి. ఇది క్లినికల్ ఎక్సలెన్స్ అంతర్జాతీయంగా ఆమోదించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉండే ఆరోగ్య సంరక్షణ సంస్థల సరసన ఈ ఆసుపత్రులను ఉంచుతుంది.
మెడికల్ వాల్యూ ట్రావెల్(ఎంవీటీ) సర్వీస్ ప్రొవైడర్లు ప్రధానంగా భారతదేశంలోని దక్షిణ, పశ్చిమ రాష్ట్రాలలో కేంద్రీకృతమై ఉన్నారు. 2022 నాటికి నగరం వారీగా జేసీఐ-గుర్తింపు పొందిన ఆసుపత్రుల కేంద్రీకరణ ఈ కింది విధంగా ఉంది:
|
నగరం
|
జేసీఐ గుర్తింపు పొందిన ఆసుపత్రుల సంఖ్య
|
|
ఢిల్లీ
|
9
|
|
ముంబై
|
6
|
|
బెంగళూరు
|
3
|
|
చెన్నై
|
2
|
|
హైదరాబాద్
|
2
|
|
అహ్మదాబాద్
|
2
|
|
కోల్కతా
|
1
|
|
నాగ్పూర్
|
1
|
|
కొచ్చి
|
1
|
సేవా ప్రదాతల కేంద్రీకరణ కలిగిన ఇతర ముఖ్యమైన నగరాల్లో పూణే, నాసిక్ కూడా ఉన్నాయి.
ఖర్చుతో కూడిన వైద్య చికిత్స
భారతదేశ మెడికల్ టూరిజం ఆకర్షణ ఖర్చులో పోటీతత్వం ద్వారా గణనీయంగా బలోపేతమైంది. భారతదేశంలో నాణ్యమైన వైద్య చికిత్స అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే గణనీయంగా తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉంటుంది. అదే సమయంలో సమానమైన క్లినికల్ ప్రమాణాలను కలిగి ఉంటుంది.
ఈ సరసమైన ధర ఆధునిక వైద్య సాంకేతికత, నైపుణ్యం కలిగిన నిపుణుల ద్వారా మద్దతు పొందుతోంది. ఇది అంతర్జాతీయ రోగులు సుదీర్ఘ నిరీక్షణ కాలం లేకుండా ప్రత్యేక చికిత్సను పొందేలా చేస్తుంది.
ఆయుష్ నేతృత్వంలోని మెడికల్ వాల్యూ ట్రావెల్ బలోపేతం
ఆయుష్ - ఆయుర్వేదం, యోగా, ప్రకృతి వైద్యం, యునాని, సిద్ధ, హోమియోపతి అని పిలిచే శతాబ్దాల నాటి సాంప్రదాయ వైద్య వ్యవస్థల ద్వారా భారతదేశం వెల్నెస్ టూరిజంలో ఒక ప్రత్యేక ప్రయోజనాన్ని కలిగి ఉంది.
యోగా, ఆయుర్వేదానికి జన్మస్థలం కావడంతో భారతదేశం ఈ వ్యవస్థలను సంపూర్ణ ఆరోగ్యం, నివారణ సంరక్షణలో సమగ్ర భాగాలుగా ప్రోత్సహిస్తూనే ఉంది.
- ఆయుష్ వీసా సౌలభ్యం: అంతర్జాతీయ రోగుల ప్రవేశాన్ని సులభతరం చేయడానికి భారత ప్రభుత్వం 27 జూలై 2023న ప్రత్యేక ఆయుష్ వీసాను ప్రవేశపెట్టింది. ఇది విదేశీయులు, వారి సహాయకులు ప్రత్యేకంగా గుర్తింపు పొందిన ఆయుష్ వ్యవస్థల క్రింద చికిత్స కోసం భారతదేశానికి ప్రయాణించడానికి వీలు కల్పిస్తుంది.
- నాణ్యత ప్రమాణాలు: ఈ రంగంలో విశ్వసనీయత, ప్రామాణీకరణను బలోపేతం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) మెడికల్ వెల్నెస్ టూరిజం సేవలకు సంబంధించిన అంతర్జాతీయ ప్రమాణం ఐఎస్ఓ 22525ను ఆమోదించింది.
- బీమా కవరేజ్: ఆయుష్ థెరపీల కోసం బీమా కవరేజ్ కూడా గణనీయంగా విస్తరించింది. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా నిబంధనల ప్రకారం బీమా సంస్థలు ఆయుష్ కింద చికిత్సలను కవర్ చేయాలి. ఫలితంగా దాదాపు 27 బీమా కంపెనీలు ఇప్పుడు ఆయుష్ చికిత్సలను కవర్ చేసే 140కు పైగా పాలసీ ఉత్పత్తులను అందిస్తున్నాయి.
- ప్రపంచ ఆదరణ, అభివృద్ధి: ప్రధాన ఆయుష్ కార్యక్రమాలలో మెడికల్ వాల్యూ ట్రావెల్ ఒక కీలక అంశంగా ఉంది. ఇందులో ముంబై(2024), చెన్నై (మే 2025)లో జరిగిన “గ్లోబల్ సినర్జీ ఇన్ ఆయుష్: ట్రాన్స్ఫార్మింగ్ హెల్త్ అండ్ వెల్నెస్ త్రూ మెడికల్ వాల్యూ ట్రావెల్” సదస్సు ఉన్నాయి.
- హెల్త్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ కింద ఆయుష్ సబ్-కౌన్సిల్ వంటి కార్యక్రమాల ద్వారా సామర్థ్య నిర్మాణం బలోపేతమవుతోంది.
- డబ్ల్యూహెచ్ఓ గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సదస్సు, నో ఇండియా కార్యక్రమం, మహా కుంభమేళా 2025 సమయంలో ప్రదర్శించిన ఆయుష్ కార్యక్రమాల వంటి వేదికల ద్వారా ప్రపంచవ్యాప్త విస్తరణ కూడా పెరుగుతోంది.

వ్యూహాత్మక కార్యక్రమాలు: కేంద్ర బడ్జెట్ 2026-27 ముఖ్యాంశాలు
కేంద్ర బడ్జెట్ 2026-27 ద్వారా దేశాన్ని ప్రపంచ వైద్య కేంద్రంగా నిలబెట్టేందుకు భారత ప్రభుత్వం ఒక దార్శనిక మార్గాన్ని ఆవిష్కరించింది.
రీజినల్ మెడికల్ హబ్స్
రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా ఐదు ప్రాంతీయ వైద్య కేంద్రాలను ఏర్పాటు చేయడం ఒక కీలక ప్రతిపాదన. ఈ కేంద్రాలు వైద్య, విద్య, పరిశోధనా సౌకర్యాలను ఒకే ఛత్రం కింద ఉంచే సమీకృత ఆరోగ్య సంరక్షణ కాంప్లెక్స్లుగా రూపొందుతాయి.
సమగ్ర స్వస్థత అనుభవాన్ని అందించేందుకు ఈ కేంద్రాల్లో ఉండేవి:
- ప్రత్యేక కేంద్రాలు: ప్రతి హబ్లో ఆయుష్ కేంద్రాలు, అంకితమైన మెడికల్ వాల్యూ టూరిజం(ఎంవీటీ) ఫెసిలిటేషన్ కేంద్రాలు ఉంటాయి.
- ఎండ్-టు-ఎండ్ కేర్: అధునాతన రోగనిర్ధారణ, చికిత్స అనంతర సంరక్షణ, నివసించేందుకు కోసం మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తారు.
- ఉపాధి కల్పన: ఈ కాంప్లెక్స్లు వైద్యులు, అనుబంధ వైద్య నిపుణులు(ఏహెచ్పీ) కోసం విభిన్న ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తాయని భావిస్తున్నారు.
వెల్నెస్ కోసం మౌలిక సదుపాయాలు
ఆధునిక ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంతో పాటు సాంప్రదాయ వైద్య వ్యవస్థలలో దేశ సామర్థ్యాన్ని కూడా ప్రభుత్వం విస్తరిస్తోంది.
- ఆయుర్వేదంలో విద్య, పరిశోధన, క్లినికల్ సేవలను మెరుగుపరచడానికి మూడు కొత్త ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద సంస్థల ఏర్పాటుకు ప్రతిపాదన
- దీంతో పాటు సాంప్రదాయ వైద్య వ్యవస్థలలో సాక్ష్యం-ఆధారిత పరిశోధన, ప్రపంచ సహకారాన్ని బలోపేతం చేయడానికి జామ్నగర్లోని డబ్ల్యూహెచ్ఓ గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్ను ఆధునికీకరిస్తున్నారు.
ఈ కార్యక్రమాలు మెడికల్ చికిత్స సేవలు, వెల్నెస్-ఆధారిత స్వస్థత సంప్రదాయాలు రెండింటినీ భారతదేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ పరిపూరకరమైన స్తంభాలుగా అభివృద్ధి చేయాలనే ప్రభుత్వ సమీకృత విధానాన్ని ప్రతిబింబిస్తాయి.
నాణ్యత, పాలన కోసం రోడ్మ్యాప్
భారతదేశ పోటీతత్వాన్ని కొనసాగించడానికి పర్యాటక మంత్రిత్వ శాఖ మెడికల్, వెల్నెస్ టూరిజం కోసం ఒక జాతీయ వ్యూహం, మార్గప్రణాళికను రూపొందించింది.
ఈ రోడ్మ్యాప్ పాలనలోని మూడు కీలక అంశాలపై దృష్టి పెడుతుంది:
- సంస్థాగత ఛట్రం: నేషనల్ మెడికల్ & వెల్నెస్ టూరిజం ప్రమోషన్ బోర్డ్(ఎన్ఎండబ్ల్యూటీబీ) మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ రంగాల మధ్య సమన్వయం చేయడానికి ఒక కేంద్రీకృత సంస్థగా పనిచేస్తుంది.
- నాణ్యత హామీ: ఆసుపత్రులు, వెల్నెస్ కేంద్రాలు, దంత వైద్య క్లినిక్ల కోసం ప్రభుత్వం ఎన్ఏబీహెచ్ అక్రిడిటేషన్ను బలోపేతం చేస్తోంది. అంతర్జాతీయ నమ్మకాన్ని పెంచడానికి మెడికల్ వాల్యూ ట్రావెల్(ఎంవీటీ) ఫెసిలిటేటర్ల రిజిస్ట్రేషన్, రేటింగ్ను కూడా ప్రోత్సహిస్తోంది.
- నైపుణ్యం, సామర్థ్య పెంపు: కేంద్ర బడ్జెట్ 2026-27లో 12 వారాల శిక్షణా కోర్సు ద్వారా 20 ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలలో 10,000 మంది గైడ్ల నైపుణ్యాన్ని పెంచడానికి ఒక పైలట్ పథకాన్ని ప్రతిపాదించింది. అదనంగా, అంతర్జాతీయ రోగులకు మెరుగైన సేవలు అందించడానికి పారామెడికల్, నాన్-మెడికల్ సిబ్బందికి విభిన్న సంస్కృతుల పట్ల అవగాహన, విదేశీ భాషలలో శిక్షణ ఇస్తున్నారు.
ఈ పాలన, నాణ్యత చర్యలను ఏకీకృతం చేయడం ద్వారా భారతదేశాన్ని సంపూర్ణ స్వస్థత కోసం ఏడాది పొడవునా సందర్శించదగిన గమ్యస్థానంగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సమగ్ర కమ్యూనికేషన్ వ్యూహం, "ఇన్క్రెడిబుల్ ఇండియా" ఉప-బ్రాండ్గా ప్రచారం చేస్తోంది. ఈ కార్యక్రమాల ద్వారా భారతదేశం "సంపూర్ణ ఆరోగ్య విప్లవం" కోసం మరింత లాంఛనప్రాయమైన, నియంత్రిత, విశ్వసనీయమైన ప్రపంచ హబ్గా మారుతోంది.
ప్రభుత్వ సదుపాయాలు, డిజిటల్ పరివర్తన
బలమైన డిజిటల్, విధానపరమైన జోక్యాల ద్వారా ప్రభుత్వం అంతర్జాతీయ రోగుల ప్రయాణాన్ని సరళీకృతం చేసింది. దీనికి ప్రధాన ఆధారం సులువుగా మార్చిన వీసా విధానం. ఈ-మెడికల్ వీసా, ఈ-మెడికల్ అటెండెంట్ వీసా సౌకర్యాలు 172 దేశాల పౌరులకు విస్తరించింది.
దీంతో పాటు భారతీయ సాంప్రదాయ చికిత్సలను కోరుకునే వారికి మద్దతుగా ఈ-ఆయుష్ వీసా, ఈ-ఆయుష్ అటెండెంట్ వీసా వంటి కొత్త విభాగాలను ప్రవేశపెట్టింది.
డిజిటల్ కార్యక్రమాలు "హీల్ ఇన్ ఇండియా" అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తున్నాయి:
- మెరుగైన ఎంవీటీ పోర్టల్: ప్రభుత్వం వన్-స్టాప్ మెడికల్ వాల్యూ ట్రావెల్ పోర్టల్ను "ఎండ్-టు-ఎండ్" పరిష్కారాన్ని అందించేలా ఆధునికీకరిస్తోంది. ఇది రోగులకు సేవలను అన్వేషించడానికి, ప్లాన్ చేయడానికి, బుక్ చేసుకోవడానికి, అలాగే చెల్లింపులు చేయడానికి, శస్త్రచికిత్స అనంతర సంరక్షణను పొందడానికి వీలు కల్పిస్తుంది.
- విమానాశ్రయలో సౌలభ్యం: ముఖ్యమైన విమానాశ్రయాలలో ఎంవీటీ కన్సీర్జ్, లాంజ్లను ఏర్పాటు చేసే ప్రణాళికలు ఉన్నాయి. ఇది ప్రయాణికులకు ఏరోబ్రిడ్జ్ వద్ద స్వాగతం పలకడానికి, ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్, సామాను సేకరణలో వారికి సహాయం చేయడానికి ఉద్దేశించినది.
మెడికల్, వెల్నెస్ టూరిజం కోసం సంస్థాగత యంత్రాంగం
మెడికల్ వాల్యూ ట్రావెల్ సమన్వయ అభివృద్ధిని నిర్ధారించడానికి ప్రభుత్వం ఒక సంస్థాగత చట్రాన్ని ఏర్పాటు చేసింది.
నేషనల్ మెడికల్ & వెల్నెస్ టూరిజం ప్రమోషన్ బోర్డ్(ఎన్ఎండబ్ల్యూటీబీ): కేంద్ర పర్యాటక శాఖ మంత్రి అధ్యక్షతన 2015లో పర్యాటక మంత్రిత్వ శాఖ చేత ఏర్పాటైంది. ఇది భారతదేశంలో మెడికల్, వెల్నెస్ టూరిజంను ప్రోత్సహించడంతో పాటు సులభతరం చేస్తుంది.
మల్టీ-స్టేక్హోల్డర్ ప్లాట్ఫారమ్: ఈ బోర్డు మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, ఆసుపత్రులు, వెల్నెస్ కేంద్రాలు, అక్రిడిటేషన్ సంస్థలు మరియు పరిశ్రమ వాటాదారులను ఒకచోట చేర్చుతుంది. కలిసి, వారు మెడికల్ వాల్యూ ట్రావెల్ వ్యవస్థను బలోపేతం చేస్తారు.
రాష్ట్ర స్థాయి సమన్వయం: ప్రాంతీయ అభివృద్ధి, ప్రచారానికి మద్దతు ఇవ్వడానికి అంకితమైన మెడికల్, వెల్నెస్ టూరిజం ప్రమోషన్ బోర్డులు లేదా సెల్లను ఏర్పాటు చేయాలని రాష్ట్రాలను ప్రోత్సహిస్తోంది.
వెల్నెస్, సాంస్కృతిక అనుసంధానంతో ప్రచారం
భారతదేశ విస్తృత ఆరోగ్య పర్యాటక వ్యూహంలో వెల్నెస్ టూరిజం ఒక ముఖ్యమైన భాగం. యోగా, ధ్యానం, ఆయుర్వేదం, ఆధ్యాత్మిక స్వస్థతలో దేశం గొప్ప సంప్రదాయాలు వెల్నెస్ను సాంస్కృతిక పర్యాటకంతో అనుసంధానించడానికి అద్భుతమైన అవకాశాలను అందిస్తాయి.
సంపూర్ణ ఆరోగ్యానికి గ్లోబల్ బ్రాండ్గా యోగా
యోగా అనేది సంస్కృత మూలం ‘యుజ్’ (అంటే "కలవడం" లేదా "ఏకం చేయడం") నుంచి ఉద్భవించిన పురాతన భారతీయ సంప్రదాయ అమూల్యమైన కానుక. ఇది భారతదేశ గ్లోబల్ సాఫ్ట్ పవర్ మూలస్తంభంగా ఉద్భవించింది. ఇది మనస్సు, శరీరం, ఆలోచన, చర్యల ఐక్యతను సూచిస్తుంది. శ్రేయస్సు పట్ల సంపూర్ణ విధానాన్ని ప్రోత్సహిస్తుంది.
11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం 2025 జాతీయ, ప్రపంచ స్పృహలోకి వెల్నెస్ను చేర్చడానికి ప్రాథమిక వాహనంగా పనిచేసింది. "ఒకే భూమి, ఒకే ఆరోగ్యం కోసం యోగా" అనే థీమ్ కింద ఈ ఈవెంట్ యోగాను స్థిరత్వం, ప్రపంచ శ్రేయస్సుతో అనుసంధానించింది.
భారతదేశం యోగా, సాంప్రదాయ చికిత్సలకు ఇష్టపడే గమ్యస్థానంగా నిలిచింది. ఇది విదేశీ పర్యాటకుల రాకను ఆకర్షిస్తోంది. వారు ప్రత్యేకంగా తమ వెల్నెస్ జీవనశైలిని కొనసాగించడానికి లేదా నివారణ ఆరోగ్య సంరక్షణను కోరుకోవడానికి ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఇప్పుడు ప్రభుత్వం కేటాయించిన ఈ-ఆయుష్ వీసా సౌకర్యం ద్వారా గణనీయంగా సరళీకృతమైంది.
గ్లోబల్ హీలింగ్ హబ్ వైపు
భారతదేశపు మెడికల్, వెల్నెస్ టూరిజం వ్యవస్థ సమీకృత ఆరోగ్య సంరక్షణ ప్రపంచవ్యాప్త విశ్వసనీయ నమూనాగా అభివృద్ధి చెందుతోంది. ఇది ఆధునిక వైద్య మౌలిక సదుపాయాలను ఆయుష్ వంటి సాంప్రదాయ వ్యవస్థలతో మిళితం చేస్తుంది. ఇది నివారణ, స్వస్థత సంరక్షణ రెండింటినీ అనుమతిస్తుంది.
బలమైన ప్రభుత్వ విధానం, డిజిటల్ సౌలభ్యం, అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలు ఈ వృద్ధికి మద్దతు ఇస్తున్నాయి. విస్తరిస్తున్న ప్రపంచవ్యాప్త విస్తరణ మెడికల్ వాల్యూ ట్రావెల్ కోసం ఒక సమగ్ర గమ్యస్థానంగా భారతదేశ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తోంది.
ప్రపంచవ్యాప్త డిమాండ్ పెరుగుతున్న కొద్దీ ప్రపంచ ఆరోగ్య సంరక్షణ, వెల్నెస్ ప్రయాణ భవిష్యత్తును రూపొందించడంలో భారతదేశం కీలక పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉంది.
***
(Explainer ID: 158454)
आगंतुक पटल : 65
Provide suggestions / comments