ఉప రాష్ట్రపతి సచివాలయం
ఆర్ఎస్ఎస్ శతాబ్ద కాలపు సేవాభావం భారతీయ సేవా సంప్రదాయానికి ప్రతిబింబం: ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్
ఆర్ఎస్ఎస్ శతాబ్ద కాలపు సేవపై డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ రచించిన పుస్తకాన్ని విడుదల చేసిన ఉపరాష్ట్రపతి
నాడు పోస్టు చేయడమైనది:
15 SEP 2026 8:43PM by PIB Hyderabad
నేడు న్యూఢిల్లీలోని ఉపరాష్ట్రపతి భవన్లో తెలంగాణ మాజీ గవర్నర్, పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ రచించిన “ఎ సెంచరీ ఆఫ్ సర్వీస్ -ది ఆర్ఎస్ఎస్ ఇన్ 100 యాక్ట్స్ ఆఫ్ సేవా” పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ప్రసంగిస్తూ.. ఆర్ఎస్ఎస్ శతాబ్ద కాలంగా అందిస్తున్న సేవలు, సామాజిక బాధ్యత, దేశ నిర్మాణంలో దాని కృషిని ఈ పుస్తకం నమోదు చేసిందని తెలిపారు.
“నేటి వార్త రేపటి చరిత్ర” అని పేర్కొన్న శ్రీ సీపీ రాధాకృష్ణన్.. మంచి పనులను నమోదు చేయడం ఎంతో ముఖ్యమని, లేకపోతే అవి ప్రజల జ్ఞాపకం నుంచి కనుమరుగయ్యే అవకాశం ఉందని అన్నారు. సేవాభావం నిరంతర సామాజిక సేవగా ఎలా రూపాంతరం చెందిందో ఈ పుస్తకం వివరిస్తుందని ఆయన పేర్కొన్నారు.
“సేవే ధర్మం; అది ఒక కర్తవ్యం” అనే భావనను ప్రాథమిక ఆదర్శంగా ఉపరాష్ట్రపతి అభివర్ణించారు. పేదలు, అణగారిన వర్గాలు, సమాజంలోని వివిధ వర్గాలు, కార్మికులు, మహిళలు, పిల్లలకు ఆర్ఎస్ఎస్ సేవా కార్యక్రమాలు చేరాయని తెలిపారు. కోవిడ్ 19 మహమ్మారి సమయంలో ఆహారం, మందులు, ఇతర అత్యవసర సహాయాన్ని అందించడంలో ఆర్ఎస్ఎస్ స్వచ్చంద కార్యకర్తలు పోషించిన పాత్రను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
పుస్తకంలోని “వ్యక్తిత్వ వికాసం ద్వారా దేశ నిర్మాణం” అనే అంశాన్ని ప్రస్తావిస్తూ.. దేశ నిర్మాణానికి దేశభక్తి, క్రమశిక్షణ, సామాజిక బాధ్యత, జాతీయ ఐక్యత ఎంతో అవసరమని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.
ఆర్ఎస్ఎస్ శతాబ్ద కాలపు సేవలకు సంబంధించిన రికార్డుగా మాత్రమే కాకుండా, దేశ సేవా సంప్రదాయం, సంస్కృతి, జాతీయ చైతన్యాన్ని భవిష్యత్తు తరాలకు ప్రతిబింబించే పత్రంగా కూడా ఈ పుస్తకం నిలుస్తుందని ఆయన అన్నారు.
డాక్టర్ తమిళిసై సౌందరరాజన్తో పాటు పుస్తక ప్రచురణకు సంబంధించిన ప్రతి ఒక్కరినీ ఉపరాష్ట్రపతి అభినందించారు. చరిత్రను నమోదు చేసే ఇలాంటి మరిన్ని ప్రయత్నాలు భవిష్యత్తులో కొనసాగుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో సమాచార, ప్రసార, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్, పుదుచ్చేరి హోం మంత్రి శ్రీ ఎ నమశ్శివాయం, డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2310752)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4