సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల శాఖకు అధికార భాషా శ్రేష్ఠతా పురస్కారం
నాడు పోస్టు చేయడమైనది:
14 SEP 2026 5:14PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల శాఖకు 2025 - 26 సంవత్సరానికి ‘అధికార భాషా శ్రేష్ఠతా పురస్కారం’ లభించింది. అధికార భాష అమలులో విశేష కృషి, నిరంతర అత్యుత్తమ పనితీరుకు గుర్తింపుగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన అధికార భాషా విభాగం ఈ పురస్కారాన్ని ప్రదానం చేసింది.
ఈ రోజు హిందీ దినోత్సవం సందర్భంగా మహారాష్ట్రలోని నవీ ముంబైలో సిడ్కో ఎగ్జిబిషన్ సెంటర్లో జరిగిన ఆరో అఖిల భారత అధికార భాషా సదస్సులో కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల శాఖ కార్యదర్శి శ్రీమతి నివేదిత శుక్లా వర్మ ఈ పురస్కారాన్ని స్వీకరించారు.
పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల శాఖ అధికార భాషా విభాగం నుంచి 2023 -24, 2024 - 25 సంవత్సరాల్లో వరుసగా రెండేళ్ల పాటు అధికార భాషా కీర్తి పురస్కారాన్ని అందుకుంది.
ఈ ఏడాది కూడా అధికార భాష అమలులో అత్యుత్తమ పనితీరు కనబరిచి ప్రథమ స్థానాన్ని సాధించింది.
నిబంధనల ప్రకారం ఒక మంత్రిత్వ శాఖ / విభాగం వరసగా రెండేళ్లు మొదటి బహుమతి అందుకుంటే తరువాతి సంవత్సరం ఈ పురస్కారం ఇవ్వరు.
అయితే, పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల శాఖ గత కొన్నేళ్లుగా అధికార భాష అమలులో నిరంతరం అత్యుత్తమ పనితీరు కనబరుస్తోంది. అందువల్ల అధికార భాష అమలులో శాఖ కొనసాగిస్తున్న విశిష్ట ప్రతిభకు గుర్తింపుగా ఈ ఏడాది ప్రత్యేక అధికార భాషా శ్రేష్ఠతా పురస్కారాన్ని ప్రదానం చేశారు.
***
(రిలీజ్ ఐడి: 2310204)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7