వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఉన్నత స్థాయి భేటీలతో భారత్-సింగపూర్ ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసిన కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్

సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్‌‌తో శ్రీ పీయూష్ గోయల్ భేటీ

4వ భారత్-సింగపూర్ మంత్రివర్గ స్థాయి, వాణిజ్యంపై ఏర్పాటు చేసిన సమావేశాల్లో పాల్గొన్న కేంద్రమంత్రి

భారత్-సింగపూర్ వాణిజ్య,పెట్టుబడుల సహకార బలోపేతానికి జీ2బీ సమావేశాలు

प्रविष्टि तिथि: 20 AUG 2026 5:09PM by PIB Hyderabad

2026 ఆగస్టు 20న సింగపూర్‌లో పలు ఉన్నతస్థాయి ద్వైపాక్షికవ్యాపార సమావేశాల్లో కేంద్ర వాణిజ్యపరిశ్రమల మంత్రి శ్రీ పీయూష్ గోయల్ పాల్గొన్నారుదీర్ఘకాలంగా కొనసాగుతున్న భారత్-సింగపూర్ ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు వాణిజ్యంపెట్టుబడులుసాంకేతికతవ్యాపార రంగాల్లో సహకారాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా ఈ సమావేశాలు జరిగాయి.

పర్యటనలో భాగంగా తొలుత ఇస్తానాలో సింగపూర్ ప్రధానమంత్రి శ్రీ లారెన్స్ వాంగ్‌తో  శ్రీ పీయూష్ గోయల్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారుఅనంతరం షాంగ్రిలా హోటల్‌లో జరిగిన 4వ భారత్-సింగపూర్ మంత్రుల స్థాయి రౌండ్‌టేబుల్ (ఐఎస్ఎంఆర్), 4వ భారత్-సింగపూర్ వాణిజ్య (ఐఎస్‌బీఆర్సమావేశాల్లో పాల్గొన్నారుద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసే మార్గాలుపరస్పర ప్రయోజనకరమైన సహకారానికి కొత్త అవకాశాలను గుర్తించడం వంటి అంశాలపై ఈ సమావేశాల్లో చర్చించారుఈ సమావేశాల అనంతరం పలు ఒప్పందాలపై సంతకాల కార్యక్రమం జరిగింది.

ప్రపంచ ఆర్థికసాంకేతిక వ్యవస్థ (జీఎఫ్‌టీఎన్)కెపెల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థలతో పాటు అంతర్జాతీయ వ్యాపారసంస్థాగత రంగాలకు చెందిన సీనియర్ ప్రతినిధులతో మధ్యాహ్నం శ్రీ పీయూష్ గోయల్ వరుసగా ప్రభుత్వ-వ్యాపార (జీ2బీసమావేశాలు నిర్వహించారువ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులుజీసీసీ ఆధారిత వాణిజ్య పార్కులుఫిన్‌టెక్సుస్థిర మౌలిక వసతులు వంటి రంగాల్లో భారత్సింగపూర్ సహకారాన్ని బలోపేతం చేయడంపై ఈ సమావేశాల్లో చర్చించారు.

సింగపూర్ విదేశాంగవాణిజ్యపరిశ్రమలశాఖ సహాయ మంత్రి శ్రీమతి గాన్ సియో హువాంగ్‌తో కలిసి సిటీ స్క్వేర్ మాల్‌లో ఏపీఈడీఏ-ఫెయిర్‌ప్రైస్  కార్యక్రమాన్ని శ్రీ గోయల్ సందర్శించారుభారత్సింగపూర్ మధ్య పెరుగుతున్న వ్యవసాయ వాణిజ్యంవిస్తరిస్తున్న మార్కెట్ అనుసంధానాన్ని ఈ కార్యక్రమం ప్రతిబింబించింది. 

 

ఫిక్కీ (ఎఫ్‌ఐసీసీఐఆధ్వర్యంలో ఇన్‌సీడ్‌ ఆసియా క్యాంపస్‌లో నిర్వహించిన భారత్సింగపూర్ వ్యాపార వేదికలో శ్రీ పీయూష్‌ గోయల్ పాల్గొన్నారునూతన ప్రపంచ వృద్ధి సమీకరణంలో భారత్ఆసియాప్రపంచంలోని వ్యాపారాలకు వృద్ధిఅవకాశాలు” అనే అంశంపై జరిగిన ముఖాముఖి చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారుఅనంతరం వ్యాపార వర్గాల ప్రతినిధులతో జరిగిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో పాల్గొని వారి సందేహాలకు సమాధానమిచ్చారు.

 

ఈ వరుస సమావేశాలు భారత్సింగపూర్ ఆర్థిక భాగస్వామ్యంలో కొనసాగుతున్న బలమైన పురోగతిని మరోసారి చాటిచెప్పాయివాణిజ్యంపెట్టుబడులుసాంకేతికతవ్యాపార సంస్థల మధ్య సంబంధాలను మరింతగా విస్తరించడంతో పాటు పరస్పర ప్రయోజనకరమైన వృద్ధికి కొత్త అవకాశాలను సృష్టించేందుకు భారత్ కట్టుబడి ఉందని ఈ కార్యక్రమాలు స్పష్టం చేశాయి

 

4వ భారత్–సింగపూర్ మంత్రివర్గ స్థాయి సమావేశంలో భారత ప్రతినిధి బృందంలో కేంద్ర ఆర్థికకార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్‌ ఎస్ జైశంకర్కేంద్ర వాణిజ్యపరిశ్రమల మంత్రి శ్రీ పీయూష్ గోయల్వాణిజ్యశాఖ సహాయ మంత్రి శ్రీ జితిన్ ప్రసాద పాల్గొన్నారుసింగపూర్ బృందంలో ఉప ప్రధానివాణిజ్య–పరిశ్రమల మంత్రి శ్రీ గాన్ కిమ్ యోంగ్సీనియర్ మంత్రిజాతీయ భద్రత సమన్వయహోం వ్యవహారాల మంత్రి శ్రీ కే షణ్ముగంవిదేశాంగ మంత్రి డాక్టర్‌ వివియన్ బాలకృష్ణన్డిజిటల్ అభివృద్ధిసమాచార శాఖ మంత్రి శ్రీమతి జోసెఫిన్ టియోరవాణాఆర్థికశాఖ రెండో సహాయ మంత్రి శ్రీ జెఫ్రీ సియో పాల్గొన్నారు.

 

****


(रिलीज़ आईडी: 2301770) आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Gujarati , Malayalam