వ్యవసాయ మంత్రిత్వ శాఖ
పీఎంఎఫ్బీవై కింద వర్తించే నష్టభయాలు, విపత్తులు
प्रविष्टि तिथि:
04 AUG 2026 6:15PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్బీవై) 2016-17 నుంచి దేశంలో ప్రారంభమైంది. రాష్ట్రాలు, రైతులు దీనిని స్వచ్ఛందంగా ఎంచుకోవచ్చు. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసిన పంటలు, ప్రాంతాలకు విత్తనాలు వేసే ముందు దశ నుంచి పంట కోత అనంతర దశ వరకు నిరోధించలేని సహజ విపత్తుల వల్ల జరిగే పంట నష్టానికి ఈ పథకం సమగ్ర బీమా రక్షణను అందిస్తుంది. అడవి జంతువుల వల్ల జరిగే పంట నష్టాలు నిరోధించే అవకాశం ఉండటంతో మొదట్లో వీటిని ఈ పథకంలో చేర్చలేదు. పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వాల సొంత ఖర్చుతో ‘యాడ్-ఆన్ కవర్’ రూపంలో వ్యక్తిగత అంచనా ఆధారంగా అడవి జంతువుల వల్ల జరిగే నష్టాలను కూడా తెలియజేయటానికి రాష్ట్రాలకు అనుమతి ఇచ్చారు. దీనికి సంబంధించిన వివరణాత్మక నిబంధనలు, నియమాలను ఈ పథకానికి సంబంధించిన నిర్వహణ మార్గదర్శకాలలో పొందుపరిచారు.
ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్బీవై) కింద నోటిఫై చేసిన అన్ని పంటలకు వరదలు, నీటిలో మునక వల్ల కలిగే నష్టానికి బీమా రక్షణ అందుబాటులో ఉంటుంది. అయితే వరి, జనుము, మేస్తా, చెరకు వంటి నీటిని ఎక్కువగా తట్టుకునే లేదా నీటిలో పెరిగే పంటలకు స్థానిక ప్రాంతాల అంచనా, పరిమిత ప్రాంతాల క్లెయిమ్ల మినహా సాధారణ బీమా రక్షణ వర్తిస్తుంది.
ఈ సమాచారాన్ని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ రామ్నాథ్ ఠాకూర్ ఈ రోజు లోక్సభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం రూపంలో వెల్లడించారు.
***
(रिलीज़ आईडी: 2294676)
आगंतुक पटल : 8