ప్రధాన మంత్రి కార్యాలయం
2026 కామన్వెల్త్ గేమ్స్లో అద్భుతంగా రాణించిన భారత క్రీడాకారులు… ప్రధానమంత్రి హర్షం
प्रविष्टि तिथि:
03 AUG 2026 9:55AM by PIB Hyderabad
గ్లాస్గో 2026 కామన్వెల్త్ గేమ్స్లో భారతీయ క్రీడాకారుల బృందం చూపిన ప్రతిభాపాటవాలపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.
భారత్ తరఫున 13 స్వర్ణ పతకాలతో సహా 39 పతకాలు గెలుచుకున్న క్రీడాకారులను ప్రధానమంత్రి అభినందించారు.
క్రీడలు మొదలైనప్పటి నుంచి భారతీయ క్రీడాకారులు అసాధారణ నైపుణ్యాన్నీ, దృఢసంకల్పాన్నీ, అంకితభావాన్నీ కనబరిచారని శ్రీ మోదీ ప్రశంసించారు. వారి శ్రమ దేశ యువతకు స్ఫూర్తిని ఇస్తుందని ఆయన అన్నారు.
భారతీయ క్రీడాకారుల బృందం రాబోయే కాలంలో కూడా రాణించాలని కోరుకుంటూ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. వారు దేశానికి మరింత కీర్తిని సంపాదించి పెడతారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని శ్రీ మోదీ పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు:
‘‘గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో మన బృందం ఆటతీరు అభినందనీయం.
భారత్ 13 స్వర్ణాలు సహా 39 పతకాలను గెలవడం సంతోషదాయకం. పతకాలు గెలిచిన వారికి అభినందనలు.
గేమ్స్లో మన ప్రతిభావంతులైన అథ్లెట్లు అసాధారణ నైపుణ్యాన్నీ, దృఢసంకల్పాన్నీ, అంకితభావాన్నీ కనబరిచారు.
వారి శ్రమ మన యువతకు స్ఫూర్తిని అందిస్తుంది.
భారతీయ క్రీడాకారుల బృందం రాబోయే కాలంలో కూడా రాణించాలని నేను కోరుకుంటూ, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారు తమ అత్యుత్తమ ప్రదర్శనతో దేశానికి మరింత కీర్తిని సంపాదించిపెట్టాలని అభిలషిస్తున్నాను.’’
***
(रिलीज़ आईडी: 2293728)
आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
Malayalam
,
Assamese
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil