ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కామన్‌వెల్త్‌ మహిళల బాక్సింగ్ 57 కిలోల విభాగంలో స్వర్ణం సాధించిన జాస్మిన్ లాంబోరియాకు ప్రధానమంత్రి అభినందన

प्रविष्टि तिथि: 02 AUG 2026 12:45AM by PIB Hyderabad

   గ్లాస్గో కామన్‌వెల్త్‌ గేమ్స్‌-2026 మహిళల బాక్సింగ్‌ 57 కిలోల విభాగంలో స్వర్ణ పతకం కైవసం చేసుకున్న జాస్మిన్ లాంబోరియాను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

బాక్సింగ్‌ క్రీడపై అంకితభావం, ప్రతిభా ప్రదర్శనలో స్థిరత్వం ఆమె సాధించిన ఈ విజయాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

భవిష్యత్తులోనూ ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ శ్రీ మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ (ట్విట్టర్) ద్వారా పంపిన సందేశంలో:

“గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌ మహిళల బాక్సింగ్‌ 57 కిలోల విభాగంలో స్వర్ణపతక విజేత జాస్మిన్ లాంబోరియాకు అభినందనలు. ఈ విజయంలో ఆమె అంకితభావం, స్థిరత్వం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆమెకు నా శుభాకాంక్షలు” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

 


***************


MJPS/SS/ST


(रिलीज़ आईडी: 2293247) आगंतुक पटल : 3
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Assamese , Gujarati , Kannada , Malayalam