ప్రధాన మంత్రి కార్యాలయం
పురుషుల ట్రిపుల్ జంప్లో రజతం గెలుచుకున్న ప్రవీణ్ చిత్రవేల్ను అభినందించిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
02 AUG 2026 12:47AM by PIB Hyderabad
గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్-2026 పురుషుల ట్రిపుల్ జంప్ ఈవెంట్లో రజత పతకం గెలుచుకున్న ప్రవీణ్ చిత్రవేల్కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
ప్రవీణ్ చిత్రవేల్ తన క్రీడా జీవితంలోనే అత్యుత్తమ జంప్ను నమోదు చేయడం పట్ల ప్రధానమంత్రి సంతోషం వ్యక్తం చేశారు.
ఈ ఘనత సాధించిన సందర్భంగా చిత్రవేల్ను అభినందించిన శ్రీ మోదీ, భవిష్యత్ ప్రయత్నాలన్నింటిలోనూ విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
“కామన్వెల్త్ క్రీడలు-2026 పురుషుల ట్రిపుల్ జంప్ ఈవెంట్లో ప్రవీణ్ చిత్రవేల్ రజత పతకం గెలుచుకోవడం, తన క్రీడా జీవితంలోనే అత్యుత్తమ జంప్ను నమోదు చేయడం చాలా సంతోషంగా ఉంది. అతనికి అభినందనలు. అతని భవిష్యత్ ప్రయాణంలో అన్ని ప్రయత్నాల్లోనూ విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా.
**************
MJPS/SS/ST
(रिलीज़ आईडी: 2293241)
आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam