రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

రాష్ట్రపతిని కలిసిన బస్తర్ మండల ప్రతినిధి బృందం


ప్రభుత్వ కృషి, ప్రజల క్రియాశీల భాగస్వామ్యంతో అభివృద్ధి పథంలో పయనిస్తున్న బస్తర్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

प्रविष्टि तिथि: 30 JUL 2026 6:18PM by PIB Hyderabad

‘బస్తర్ పండుమ్-202’6 విజేతలైన పర్గానా మాంఝీచాల్కీలతో కూడిన బస్తర్ మండల ప్రతినిధి బృందం ఇవాళ (జూలై 30, 2026) రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్మును కలిసిందిఈ కార్యక్రమంలో కేంద్ర హోంసహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షాఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి శ్రీ విష్ణు దేవ్ సాయ్ తదితరులు పాల్గొన్నారు.

సభను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తూ.. బస్తర్ పండుమ్ కేవలం ఒక సాంస్కృతిక వేడుక మాత్రమే కాదని.. బస్తర్ సంప్రదాయాలుసాంస్కృతిక అస్తిత్వానికి సంబంధించిన వేడుకని రాష్ట్రపతి అన్నారుజాతీయఅంతర్జాతీయ వేదికలపై బస్తర్ నిజమైన గుర్తింపును చాటటమే దీని లక్ష్యంసంప్రదాయాలుఆచారాలుసాంస్కృతిక వారసత్వంతో యువతను అనుసంధానించటంలో బస్తర్ పండుమ్ వంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషించాయని ఆమె స్పష్టం చేశారుఇటువంటి కార్యక్రమాలు పర్యాటకాన్ని ప్రోత్సహించటంతో పాటు ఉపాధి అవకాశాలను కల్పిస్తాయన్నారు.

సామాజిక జీవనాన్నిసాంస్కృతిక విలువలను పరిరక్షించటంలో మంఝీచాల్కీల పాత్రను రాష్ట్రపతి ప్రశంసించారువారు సమాజానికిపరిపాలనకు మధ్య సమర్థవంతమైన వారధులని అన్నారువారి అంకితభావంనాయకత్వ గుణాల ద్వారా సమాజంలో సంతోషంశాంతిసంక్షేమానికి నిరంతరం కృషి చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ కృషిబస్తర్ ప్రజల క్రియాశీల భాగస్వామ్యంతో ఆ ప్రాంతం అభివృద్ధి దిశగా కొత్త బాటలో పయనిస్తుండటం పట్ల గౌరవ రాష్ట్రపతి సంతోషం వ్యక్తం చేశారుప్రజలు హింసాత్మక వాతావరణం నుంచి బయటపడివిద్యఉపాధిఅభివృద్ధికి కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారని ఆమె తెలిపారుఈ మార్పు బస్తర్ ఉజ్వల భవిష్యత్తుకు సంకేతమని అన్నారురోడ్లువిద్యుత్తాగునీరు వంటి సౌకర్యాలు మారుమూల గ్రామాలకు కూడా చేరుతున్నాయని.. చాలా కాలంగా మూతపడిన పాఠశాలలు ఇప్పుడు మళ్లీ పిల్లల సందడితో కళకళలాడుతున్నట్లు తెలిపారువిద్యా కాంతి ప్రతి ఇంటికీ చేరుతోందినేడు బస్తర్‌లో ఆశనమ్మకంపురోగతితో కూడిన వాతావరణం నెలకొందని అన్నారుఈ పరివర్తన యావత్ దేశానికి ఆనందాన్నిగర్వాన్ని కలిగించే విషయమని పేర్కొన్నారు.

విద్యవిజ్ఞానశాస్త్రంకళలుక్రీడల వంటి వివిధ రంగాల్లో గిరిజన యువత ప్రతిభను చాటుతున్నారని రాష్ట్రపతి అన్నారుగిరిజనులకు క్రీడలుకళల్లో సహజసిద్ధమైన ప్రతిభ ఉంటుందిఛత్తీస్‌గఢ్‌లో ఇటీవల బస్తర్ ఒలింపిక్స్ నిర్వహించటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

గిరిజన ప్రజలు సాంస్కృతిక అస్తిత్వాన్ని కాపాడుకుంటూప్రోత్సహిస్తూ అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములై దేశ నిర్మాణానికి కృషి చేస్తారని రాష్ట్రపతి విశ్వాసం వ్యక్తం చేశారుసహకారంసామరస్యంతో సంస్కృతిని బలోపేతం చేయటం మనందరి బాధ్యతని పేర్కొన్నారుమహిళలుపిల్లలుసమాజంలోని అట్టడుగు వర్గాలువృద్ధుల సాధికారతకు కృషి చేయాల్సిన అవశ్యకతను వివరించారునీరుపర్యావరణంసహజ వనరుల పరిరక్షణను జీవితంలో అంతర్భాగం చేసుకోవాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు.

 

***

 

(रिलीज़ आईडी: 2292148) आगंतुक पटल : 14
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Malayalam