మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

తీర ప్రాంత మత్స్య పరిశ్రమలో మహిళల కోసం సముద్ర ఆర్థిక వ్యూహం

प्रविष्टि तिथि: 30 JUL 2026 3:05PM by PIB Hyderabad

ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్‌వైపరిధిలో ఆంధ్రప్రదేశ్ సహా తీర ప్రాంతాల్లోని మహిళలకు ప్రాధాన్యం కల్పిస్తూ.. వారి ఉద్యోగజీవనోపాధి అవసరాలు సముద్ర ఆర్థిక వ్యవస్థ విధాన నియమావళిలో ఏకీకృతమయ్యాయిఈ పథకం మహిళలను ప్రధాన లబ్ధిదారు బృందంగా గుర్తించిమత్స్యఆక్వాకల్చర్ రంగంలో వారి భాగస్వామ్యానికిసాధికారతకు మద్దతు అందించేలా అధిక ఆర్థిక సాయాన్నీలక్షిత కార్యక్రమాలనూ అందిస్తుందిప్రభుత్వం నుంచి 60 శాతం వరకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పొందడానికి మహిళా లబ్ధిదారులు అర్హులుసాధారణ కేటగిరీకి చెందిన వారికి 40 శాతం మాత్రమే ఆర్థిక సాయం లభిస్తుందిఇది వ్యక్తిగతసామూహిక కార్యకలాపాలు రెండింటికీ వర్తిస్తుందితద్వారా మత్స్య సంబంధిత వ్యాపారాలకు నిధులు సమకూర్చుకోవడం మహిళలకు సులభతరమవుతుంది.

.       ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలియజేసిన వివరాల ప్రకారంసహకార సంస్థలను బలోపేతం చేసేందుకు వ్యూహాత్మక కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ మత్స్యకార సహకార సంస్థ (ఏఎఫ్‌సీవోఎఫ్చేపట్టిందిదీనిలో భాగంగా నెల్లూరుతో సహా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మత్స్య రైతు ఉత్పత్తి సంఘాలు (ఎఫ్ఎఫ్‌పీవోలుఏర్పాటు చేయడం సులభతరమవుతుందిఅలాగే మహిళల నేతృత్వంలోని సహకార సంస్థలకు ప్రత్యేక ప్రాధాన్యం లభిస్తుందిసమష్టి ప్రయత్నంసంస్థాగత మద్దతు ద్వారా మత్స్య రైతులకు సాధికారత కల్పించడమే ఈ పథకం లక్ష్యంఅంతేకాకుండా.. భారత ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన (పీఎం-ఎంకేఎస్ఎస్‌వైపథకాల ద్వారా అందుబాటులో ఉన్న ఆర్థిక సాయంమౌలిక సదుపాయాలుసామర్థ్యం పెంపుఇతర ప్రయోజనాలను పొందేలా ఎఫ్‌ఎఫ్‌పీవోలకు వీలు కల్పిస్తుంది.

.    చేపల ఉత్పత్తినిఉత్పాదకతను పెంచడంవిలువైన వ్యాపార వ్యవస్థను ఆధునికీకరించడంలో భాగంగా సముద్రం లోతుల్లో చేపల వేటనువేట యాంత్రీకరణను ప్రోత్సహించడానికి పీఎంఎంఎస్‌వైతో సహా మత్స్య శాఖ అమలు చేస్తున్న విధానాలుపథకాలు అధిక ప్రాధాన్యమిస్తాయిమత్స్యకార మహిళల సంప్రదాయ జీవనోపాధిని కాపాడటానికీబలోపేతం చేయడానికీ పీఎంఎంఎస్‌వై పరిధిలో ప్రత్యేక సాయం అందుతుందిసాధారణ కేటగిరీకి చెందిన వారికి లభించే 40 శాతం ఆర్థిక సాయంతో పోలిస్తే... సముద్ర లోతుల్లో చేపల వేటకు ఉపయోగించే పడవలను కొనుగోలు చేయడంతో సహా మత్స్య రంగంలో వివిధ కార్యకలాపాల నిర్వహణకు 60 శాతం ఆర్థిక సాయాన్ని పొందేందుకు మహిళా లబ్ధిదారులు అర్హులుఅదేవిధంగాసముద్ర నాచు సాగుఆర్నమెంటల్ ఫిషరీస్వరి-చేపల సమగ్ర సాగుకేజ్ కల్చర్చేపల శుద్ధివిలువ జోడింపుమార్కెటింగ్ లాంటి విభిన్న ఆదాయ మార్గాలకు కూడా ఈ సబ్సిడీ వర్తిస్తుందితద్వారా జీవనోపాధిలో వైవిధ్యానికీస్థిరత్వానికీ ప్రోత్సాహం లభిస్తోంది.

.    ఆంధ్రప్రదేశ్‌తో సహా అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మత్స్య సహకార సంఘాలను ఏర్పాటు చేయడానికివాటిని బలోపేతం చేయడానికి  పీఎంఎంఎస్‌వై ద్వారా మత్స్య విభాగం తోడ్పాటును అందిస్తుందిఆంధ్రప్రదేశ్‌లో 66 మహిళా మత్స్యకార సహకార సంఘాలు.. మత్స్య రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్ఎఫ్‌పీవోలు)గా నమోదయ్యాయని/రూపాంతరం చెందాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలియజేసింది. 10 ఎఫ్ఎఫ్‌పీవోలకు నిర్వహణ వ్యయంఈక్విటీ గ్రాంట్ కింద మొత్తం రూ. 69,11,452 విడుదలయ్యాయిఈ మొత్తం ఆయా సహకార సంఘాల్లో కార్యాలయ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికివ్యాపారాభివృద్ధి కార్యకలాపాలు చేపట్టడానికివాటి ఆర్థిక మూలాలను బలోపేతం  చేసేందుకు వీలు కల్పిస్తోందినెల్లూరు జిల్లాలో మహిళా మత్స్యకార సహకార సంఘాలు... ఎఫ్ఎఫ్‌పీవోలుగా రూపాంతరం చెందాయిఇప్పటి వరకు ఒక ఎఫ్ఎఫ్‌పీవోకు రూ.90,000ను వన్ టైమ్ గ్రాంటుగా మంజూరు చేశారు.

రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ సమాచారాన్ని మత్స్యపశుసంవర్ధకపాడి పరిశ్రమ శాఖ మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ సింగ్ అందించారు.

 

***


(रिलीज़ आईडी: 2291906) आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Bengali , Tamil