ప్రధాన మంత్రి కార్యాలయం
గౌరవం, విశ్వాసం, సమర్థ నాయకత్వానికి... శీలమే పునాది! ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
27 JUL 2026 7:43AM by PIB Hyderabad
సత్ప్రవర్తన కలిగిన వ్యక్తి సమాజంలో గౌరవాన్ని పొందుతారనీ, అలాంటి వ్యక్తిని ప్రతి బాధ్యతా తీసుకోవడానికి సమర్థుడిగా భావిస్తారనీ తెలియజెప్పే ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ :
‘‘శీలవాన్ పూజితో లోకే శీలవాన్ సాధుసమ్మతః
శీలవాన్ సర్వకర్మార్హః శీలవాన్ ప్రియదర్శనః’’ అని పేర్కొన్నారు.
‘సదాచార స్వభావాన్ని కలిగివుండే మనిషి సమాజంలో గౌరవాన్నీ, మంచివారి ప్రశంసలనూ పొందుతారు. ఇలాంటి వ్యక్తి తన నిజాయతీ, అణకువ, క్రమశిక్షణతో కూడిన ప్రవర్తన కారణంగా ఏ బాధ్యతనైనా నిర్వహించడానికి తగిన వ్యక్తి అని ప్రజలు భావిస్తారు. ఆ మనిషి వ్యక్తిత్వం ప్రశంసనీయంగాను, స్ఫూర్తిదాయకంగాను ఉండడమే కాక అనుసరణ యోగ్యం కూడా అవుతుంది. నిజానికి సత్ప్రవర్తనను కలిగివుండడం సదా విజయాలకీ, ప్రభావవంతమైన నాయకత్వానికీ, విశ్వాసానికీ సిసలైన పునాదిగా నిలుస్తుంది’ అని మనకు ఈ సుభాషితం బోధిస్తోంది.
***
(रिलीज़ आईडी: 2289970)
आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam