సహకార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మహారాష్ట్రలో భారత్ ట్యాక్సీ సేవలను ప్రారంభించిన ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర సహకార శాఖ సహాయ మంత్రి శ్రీ మురళీధర్ మోహోల్


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘సహకార్ సే సమృద్ధి’ దార్శనికతను సాకారం చేస్తూ కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా నాయకత్వంలో రవాణా రంగంలో సహకార నమూనాను ఆచరణలోకి తెస్తున్న భారత్ ట్యాక్సీ
భారత్ ట్యాక్సీ ద్వారా మహారాష్ట్రలోని యువత, మహిళలు, స్థానికులకు కొత్త ఉపాధి అవకాశాలు: కేంద్ర సహకార శాఖ సహాయ మంత్రి శ్రీ మురళీధర్ మోహోల్

సహకార సారథులుగానూ, సంపన్న మహారాష్ట్ర నిర్మాణంలో భాగస్వాములుగానూ మారాలని యువతకు కేంద్ర సహకార శాఖ సహాయ మంత్రి శ్రీ మురళీధర్ మోహోల్ పిలుపు

భారత్ ట్యాక్సీలో కేవలం సేవలందించే వ్యక్తులుగా మాత్రమే కాకుండా సంస్థకు యజమానులు, వాటాదారులుగా కూడా ‘సారథులు’

భారత్ టాక్సీలో రద్దీని బట్టీ అదనపు ఛార్జీలు, ముందుగా చెప్పకుండా విధించే చార్జీలు లేకుండా ప్రయాణికులకు అందుబాటు ధరల్లో సేవలు, సారథులకు కష్టానికి తగిన ఆదాయం

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, కేంద్ర సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ప్రారంభించిన సహకార విప్లవం ఇప్పుడు మహారాష్ట్ర రవాణా రంగానికీ చేరింది: మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్

ఢిల్లీ, గుజరాత్‌ తర్వాత మహారాష్ట్రలో ప్రారంభంతో సహకారం ద్వారా ఉపాధి, ఉపాధి ద్వారా సమృద్ధి సాధించే దిశగా ముందుకు సాగుతున్న భారత్ ట్యాక్సీ నమూనా

प्रविष्टि तिथि: 23 JUL 2026 5:53PM by PIB Hyderabad

సహకారంఆవిష్కరణలుసమ్మిళిత అభివృద్ధి ద్వారా దేశ రవాణా రంగంలో మార్పులు తీసుకురావడంలో భాగంగా మహారాష్ట్రలో భారత్ ట్యాక్సీ సేవలు ప్రారంభమయ్యాయినవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్వహించిన కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్కేంద్ర సహకార శాఖ సహాయ మంత్రి శ్రీ మురళీధర్ మోహోల్ ఈ సేవలను ప్రారంభించారుప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ‘సహకార్ సే సమృద్ధి’ దార్శనికతకు అనుగుణంగాకేంద్ర హోం,  సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారుఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులుసహకార రంగ ప్రతినిధులుఅధికారులు,  భారత్ ట్యాక్సీతో పని చేసే సారథులు పాల్గొన్నారుట్యాక్సీ సారథులను కేవలం డ్రైవర్లుగా కాకుండా సేవకు యజమానులుగాసహకార సంస్థ సభ్యులుగాసంస్థ అభివృద్ధిలో భాగస్వాములుగా గుర్తించే సమానత్వ సహకార రవాణా నమూనాను భారత్ ట్యాక్సీ ముందుకు తీసుకువెళుతోంది.

కేంద్ర సహకార శాఖ సహాయ మంత్రి శ్రీ మురళీధర్ మోహోల్ మాట్లాడుతూమహారాష్ట్రలో భారత్ ట్యాక్సీ ప్రారంభం రాష్ట్ర సహకార రంగంలో కొత్త అధ్యాయానికి నాంది పలికిందని అన్నారుమహారాష్ట్ర సహకార ఉద్యమానికి పుణ్యభూమి అనివందేళ్లకు పైగా సుసంపన్నమైన సహకార సంప్రదాయాన్ని కలిగి ఉందని ఆయన పేర్కొన్నారుదేశవ్యాప్తంగా ఉన్న 8.60 లక్షలకు పైగా సహకార సంఘాల్లో దాదాపు 2.5 లక్షల సంఘాలు ఒక్క మహారాష్ట్రలోనే పనిచేస్తున్నాయనిఇది భారత సహకార ఉద్యమంలో రాష్ట్రం అందిస్తున్న గణనీయమైన భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపారు.

దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంప్రతి రంగానికి సహకార ప్రయోజనాలను విస్తరించడంసహకార సంస్థల సమగ్ర అభివృద్ధిని సాధించడం లక్ష్యంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ 2021లో ప్రత్యేకంగా సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారని శ్రీ మురళీధర్ మోహోల్ గుర్తు చేశారుసహకార రంగంలో విశేష అనుభవం కలిగిన శ్రీ అమిత్ షాను దేశ తొలి సహకార శాఖ మంత్రిగా నియమించిన అనంతరంసహకార ఉద్యమానికి కొత్త దిశనూతన వేగంమరింత విస్తృత ప్రాచుర్యం లభించిందని ఆయన పేర్కొన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం లక్ష్య సాధనలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థసహకార రంగం కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు.

సహకార రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటు అనంతరం గత ఐదేళ్లలో దాదాపు 152 కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారువీటిలో కొత్త జాతీయ సహకార విధానందేశవ్యాప్తంగా రెండు లక్షల కొత్త బహుళ ప్రయోజన సహకార సంఘాల ఏర్పాటు లక్ష్యంప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్ఆర్థికంగా బలోపేతం అయ్యేలా చేపట్టిన చర్యలు ముఖ్యమైనవని పేర్కొన్నారుఇప్పటికే దాదాపు 40 వేల కొత్త సహకార సంఘాలు ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.

దాదాపు రూ. 3,000 కోట్ల వ్యయంతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను (పీఏసీఎస్కంప్యూటరీకరణ చేస్తున్నామనివాటిని 25కు పైగా ఆర్థికవాణిజ్య కార్యకలాపాలు నిర్వహించేలా బలోపేతం చేస్తున్నామని శ్రీ మోహోల్  తెలిపారుదేశవ్యాప్తంగా దాదాపు 39 వేల సహకార సంఘాలు ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలుగా పనిచేస్తున్నాయనిసుమారు 54 వేల పీఏసీఎస్‌లు కామన్ సర్వీస్ సెంటర్లుగా సేవలు అందిస్తున్నాయని పేర్కొన్నారుసహకార సంస్థలు ప్రస్తుతం పెట్రోల్ బంకులుజన ఔషధి కేంద్రాల నిర్వహణతో పాటు ధాన్య నిల్వలువివిధ గ్రామీణ సేవా కార్యక్రమాల్లో కూడా భాగస్వాములవుతున్నాయని తెలిపారు గ్రామస్థాయి సహకార సంస్థలను బలోపేతం చేయడం ద్వారా రైతులుగ్రామాలుతాలూకాలుజిల్లాలురాష్ట్రాలు ఆర్థికంగా సాధికారత సాధించి అభివృద్ధిసమృద్ధి దిశగా ముందుకు సాగేలా చేయడమే ఈ ప్రయత్నాల ప్రధాన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారురైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడంసేంద్రియ ఉత్పత్తులకు హామీతో కూడిన మార్కెట్లు కల్పించడంవ్యవసాయ ఉత్పత్తులకు ఎగుమతి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా భారతీయ విత్తన సహకార సమితి (బీబీఎస్ఎస్ఎల్), నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ (ఎన్‌సీఓఎల్), నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్ (ఎన్‌సీఈఎల్)లను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారుదేశవ్యావ్యాప్తంగా దాదాపు 70 వేల సహకార సంస్థలు ఈ మూడు జాతీయ సహకార సంస్థల్లో సభ్యులుగా చేరాయని తెలిపారుసహకార రంగానికి అవసరమైన శిక్షణ పొందిన మానవ వనరులను అభివృద్ధి చేయడం లక్ష్యంగా దేశంలో తొలి సహకార విశ్వవిద్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

మహారాష్ట్రలో సహకార రంగాన్ని బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ నాయకత్వంలో తీసుకుంటున్న చర్యలను ప్రస్తావిస్తూనేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌సీడీసీద్వారా రాష్ట్రంలోని సహకార చక్కెర కర్మాగారాలకు దాదాపు రూ.10,000 కోట్ల ఆర్థిక సహాయం అందించినట్లు శ్రీ మోహోల్ తెలిపారురాష్ట్రంలో ఇథనాల్కంప్రెస్డ్ బయోగ్యాస్‌కు సంబంధించిన కార్యకలాపాలను  ప్రోత్సహిస్తున్నట్లు కూడా ఆయన పేర్కొన్నారుసహకార గృహ నిర్మాణ రంగానికి స్వతంత్ర న్యాయపరమైన వ్యవస్థను ఏర్పాటు చేయడంస్వీయ పునరాభివృద్ధిని ప్రోత్సహించడం దిశగా కూడా కీలక చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారుసహకార సంస్థల ద్వారా టిష్యూ కల్చర్‌ను ప్రోత్సహించే కార్యక్రమానికి భూమిని అందించిన దేశంలోనే తొలి రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచిందని ఆయన పేర్కొన్నారు.

మహారాష్ట్రలో పెద్ద సంఖ్యలో ఉన్న సహకార సంస్థలువ్యవస్థల ద్వారా రాబోయే రోజుల్లో భారత్ ట్యాక్సీ సేవలను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు విస్తరించనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారురాష్ట్రంలోని యువతమహిళలు పెద్ద సంఖ్యలో భారత్ ట్యాక్సీలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారుభారత్ ట్యాక్సీ నూతన ఉపాధిస్వయం ఉపాధి అవకాశాలను సృష్టించడంతో పాటు సారథులను సహకార సంస్థ అభివృద్ధిలాభాల్లో భాగస్వాములుగా నిలుపుతుందని పేర్కొన్నారుప్రజలంతా సహకార సారథులుగాసంపన్న మహారాష్ట్ర నిర్మాణంలో భాగస్వాములుగా మారాలని ఆయన కోరారు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూప్రధాని శ్రీ నరేంద్ర మోదీదేశ తొలి సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా నాయకత్వంలో సహకార రంగంలో వచ్చిన నూతన విప్లవ ప్రభావం ఇప్పుడు మహారాష్ట్ర రవాణా రంగంలోనూ కనిపిస్తోందని తెలిపారుఢిల్లీగుజరాత్‌ల తర్వాత మహారాష్ట్రలో భారత్ ట్యాక్సీ ప్రారంభంతోసహకారం ద్వారా ఉపాధిఉపాధి ద్వారా సమృద్ధి సాధించే నూతన నమూనా మరింత ముందుకు సాగుతుందని ఆయన పేర్కొన్నారుగ్రామస్థాయి ప్రాథమిక సహకార సంఘాల నుంచి వివిధ సహకార సంస్థల వరకు వాటిని బలోపేతం చేయడంఆధునికీకరించడంమరింత పారదర్శకత తీసుకురావడంతో పాటువాటి కోసం కొత్త వ్యాపార నమూనాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారుఈ మార్పు దిశలో భారత్ ట్యాక్సీ ఒక ముఖ్యమైన భాగమని పేర్కొన్నారు.

యాప్ ఆధారిత ట్యాక్సీ సేవలు ప్రయాణికులకు రవాణాను మరింత సౌకర్యవంతం చేశాయనిఅయితే డిమాండ్ పెరిగినప్పుడు అదనపు ఛార్జీలుచెప్పకుండా వసూలు చేసే రుసుములుఅధిక కమిషన్లు వంటి సమస్యలు ప్రయాణికులుడ్రైవర్లు ఇద్దరికీ తరచూ ఇబ్బందులు కలిగించాయని తెలిపారుఈ సమస్యలకు భారత్ ట్యాక్సీ సహకార విధానంలో పరిష్కారం అందిస్తుందని ఆయన పేర్కొన్నారుఈ నమూనాలో ట్యాక్సీ సారథులు కేవలం డ్రైవర్లుగా కాకుండాసహకార సంస్థకు యజమానులువాటాదారులుగా కూడా ఉంటారనిసంస్థ ఆర్జించే లాభాల్లో వారికి వాటా లభిస్తుందని తెలిపారుఈ సేవలో రద్దీ చార్జీలుచెప్పకుండా వసూలు చేసే ఛార్జీలు ఉండవనినిర్ణీత సేవా రుసుము ఆధారంగా ఇది పనిచేస్తుందని చెప్పారుభారత్ ట్యాక్సీ ద్వారా ప్రజలకు సురక్షితమైనవిశ్వసనీయమైననాణ్యమైన రవాణా సేవలు అందుతాయని ఆయన పేర్కొన్నారుమహిళా ప్రయాణికుల భద్రతప్రయాణికులతో మర్యాదపూర్వక ప్రవర్తనపారదర్శకమైన ఛార్జీలుజవాబుదారీతనంతో కూడిన సేవల వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని తెలిపారుదివంగత డి.బిపాటిల్ కోఆపరేటివ్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ఎంతో కీలకమైనదని పేర్కొంటూనవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో నివసించే దాదాపు 3,000 నుంచి 4,000 మంది స్థానికులకు రుణ సౌకర్యం ద్వారా ట్యాక్సీలు అందించివారిని భారత్ ట్యాక్సీ వేదికతో అనుసంధానం చేసేందుకు ప్రయత్నాలు చేస్తామని తెలిపారుఇందువల్ల స్థానిక యువతకు కొత్త ఉపాధివ్యాపార అవకాశాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో భారత్ ట్యాక్సీతో అనుబంధం ఉన్న సారథులకు షేర్ సర్టిఫికెట్లుసేవా కిట్లను పంపిణీ చేశారుదళారుల ఆధారిత వ్యవస్థ స్థానంలో సారథి కేంద్రిత రవాణా వ్యవస్థను తీసుకురావడమే భారత్ ట్యాక్సీ ఉద్దేశంసారథులకు స్థిరమైన ఆదాయం కల్పించడంప్రయాణికులకు పారదర్శక ఛార్జీలతో సురక్షిత సేవలు అందించడంసంస్థ ఆర్జించే లాభాలను సారథులతో పంచుకోవడం లక్ష్యంగా ఇది పనిచేస్తుంది.  రానున్న కాలంలో రాష్ట్రంలోని సహకార సంస్థలురవాణా సంస్థలుస్థానిక సంస్థల సహకారంతో మరింత మంది ట్యాక్సీ డ్రైవర్లుయువతమహిళలుస్థానిక సమాజాలను ఈ వేదికతో అనుసంధానం చేస్తూ దశలవారీగా భారత్ ట్యాక్సీ సేవలను మహారాష్ట్ర అంతటా విస్తరించనున్నారు.

 

***


(रिलीज़ आईडी: 2288648) आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Gujarati , Tamil