రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఒడిశా కొత్త తీరప్రాంత రహదారి... ఆధ్యాత్మిక, తీరప్రాంత పర్యాటకానికి ముఖద్వారం

प्रविष्टि तिथि: 19 JUL 2026 2:51PM by PIB Hyderabad

ఒడిశా తీరప్రాంతంలో రవాణా అనుసంధానాన్ని సమూలంగా మార్చనున్న 160.18 కిలోమీటర్ల పొడవైన 'రామేశ్వర్-పారాదీప్ తీరప్రాంత రహదారినిర్మాణంతో ఈ ప్రాంతంలో మరింత అభివృద్ధికి అవకాశం కలిగిందిరూ. 8,300.79 కోట్ల వ్యయంతో కేంద్ర రహదారి రవాణాజాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్టును చేపడుతోందిఖుర్దాపూరీకేంద్రపడజగత్‌సింగ్‌పూర్ జిల్లాల మీదుగా సాగే ఈ రహదారి... రాష్ట్రంలోని ముఖ్యమైన సాంస్కృతికఆధ్యాత్మికపర్యాటకఆర్థిక కేంద్రాల మధ్య సజావైన రవాణా అనుసంధానాన్ని కల్పిస్తుంది.

వేగవంతమైనసురక్షితమైనసజావైన ప్రయాణాన్ని అందించడం లక్ష్యంగా రూపొందించిన ఈ ప్రాజెక్టులో భాగంగా రామేశ్వర్ నుంచి కోణార్క్ వరకు 4-వరుసల యాక్సెస్-నియంత్రిత జాతీయ రహదారికోణార్క్ నుంచి పారాదీప్ వరకు 2-వరుసల జాతీయ రహదారిని నిర్మిస్తారుగంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేందుకు వీలుండే ఈ మార్గం అందుబాటులోకి వస్తే... రామేశ్వర్-పారాదీప్ మధ్య ప్రయాణ సమయాన్ని ఈ కారిడార్ దాదాపు గంటల 30 నిమిషాలు తగ్గిస్తుందిప్రయాణికుల రవాణాతో పాటు ఇది సరుకు రవాణా కనెక్టివిటీనీ మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు.

ఒడిశా ఆధ్యాత్మిక వారసత్వ అనుసంధానం

ఒడిశాలోని అత్యంత ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రాలకు వేగంగా చేరుకునే అవకాశాన్ని కల్పించడం ద్వారా ఆధ్యాత్మికసాంస్కృతిక పర్యాటక రంగానికి ఈ కొత్త తీరప్రాంత రహదారి ఒక ప్రధాన చోదక శక్తిగా మారుతుంది.

ఈ కారిడార్ పూరీలోని ప్రపంచ ప్రఖ్యాత జగన్నాథ ఆలయంచారిత్రక కోణార్క్ సూర్య దేవాలయంపవిత్రమైన రామచండీ ఆలయం మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేస్తుందిప్రతియేటా ఒడిశాకు వచ్చే లక్షలాది మంది భక్తుల తీర్థయాత్ర అనుభవాన్ని ఇది మరింత సౌకర్యవంతంగా మార్చనుంది.

మెరుగైన రహదారి మౌలిక సదుపాయాలు ప్రయాణ సమయాన్ని తగ్గించడం సహా... పర్యాటకులుభక్తుల కోసం సురక్షితమైనమరింత సౌకర్యవంతమైన రవాణా సదుపాయాన్ని కల్పిస్తూ వారి మొత్తం యాత్ర అనుభవాన్నీ మెరుగుపరుస్తాయిఈ ప్రాంతంలో రాబోయే విమానాశ్రయ మౌలిక సదుపాయాలతో దేశవిదేశాల నుంచి వచ్చే సందర్శకులు సులభంగా గమ్యస్థానాలకు చేరుకునేందుకు వీలుంటుందిఒక ప్రధాన ఆధ్యాత్మిక పర్యాటక గమ్యస్థానంగా ఒడిశా స్థానం మరింత మెరుగవుతుంది.

రవాణాకు అతీతంగా... చారిత్రక దేవాలయాలుసాంప్రదాయాలుఆధ్యాత్మిక కేంద్రాలతో ప్రజలను అనుసంధానించడం ద్వారా భారత సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకుప్రోత్సాహానికి ఆధునిక మౌలిక సదుపాయాలు ఎలా తోడ్పడగలవో ఈ రహదారి సూచిస్తుంది.

పూరీ నుంచి పారాదీప్ వరకుఒడిశా కొత్త పర్యాటక రహదారి

ఒడిశా తూర్పు తీరప్రాంతంలోని బీచ్‌లువారసత్వ ప్రదేశాలుజీవవైవిధ్య కేంద్రాలుస్థానిక కమ్యూనిటీలను అనుసంధానిస్తూ... రామేశ్వర్–పారాదీప్ కారిడార్ కొత్త తీరప్రాంత పర్యాటకానికి ముఖద్వారంగా మారనుంది.

పూరీకోణార్క్పారాదీప్ మధ్య అనుసంధానం మెరుగుపడటంతోఈ గమ్యస్థానాలు ఒక ఏకీకృత పర్యాటక సర్క్యూట్‌లో భాగంగా ఆవిర్భవిస్తాయిఇది ప్రయాణికులకు ఆధ్యాత్మిక వారసత్వంప్రాచీన వాస్తుశిల్పంబీచ్‌లుప్రకృతి సంబంధ ప్రదేశాల వరకు సంపూర్ణ తీరప్రాంత సందర్శన అనుభవాన్ని అందిస్తుంది.

ఈ రహదారి సముద్ర తీర పర్యాటకంపర్యావరణ పర్యాటకంప్రకృతి ఆధారిత ప్రయాణాలకు కొత్త అవకాశాలను కల్పిస్తుందివన్యప్రాణుల సంరక్షణ ప్రాంతాలుప్రసిద్ధ గహిర్మాతా తాబేళ్ల గూళ్ల ప్రదేశాలు సహా ముఖ్యమైన పర్యావరణ గమ్యస్థానాలకు సులభంగా చేరుకునేందుకు ఇది వీలు కల్పిస్తుంది.

మెరుగైన అనుసంధానంఒడిశాలోని విశిష్టమైన తీరప్రాంత జీవనవైవిధ్యంపరిరక్షణ ప్రయత్నాలపై అవగాహనను పెంచడం ద్వారా సుస్థిర పర్యాటక పద్ధతులనూ ఇది ప్రోత్సహిస్తుందిసున్నితమైన పర్యావరణ వ్యవస్థలను పరిరక్షించే బాధ్యతాయుత పర్యాటక నమూనాలకు మద్దతునిస్తూనేఇక్కడి సహజ ప్రకృతి దృశ్యాలనూ సందర్శకులు వీక్షించవచ్చు.

స్థానిక ఆర్థిక వ్యవస్థతీరప్రాంత అభివృద్ధికి ఊతం

ఈ కొత్త రహదారి... ఈ మార్గంలోని హోటళ్లుహోమ్‌స్టేలురెస్టారెంట్లుహస్తకళల విపణులుపర్యాటక ఆధారిత వ్యాపారాల వృద్ధిని ప్రోత్సహించడం ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలనూ కల్పిస్తుంది.

పీఎం గతిశక్తి మార్గదర్శక సూత్రాలకు అనుగుణంగా... ఈ ప్రాజెక్టు ఆర్థిక కేంద్రాలనుసరుకు రవాణా కేంద్రాలను అనుసంధానించడం ద్వారా ఒడిశా ఆర్థిక నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేస్తుందిఇది ఈ ప్రాంతంలోని కీలకమైన పారాదీప్ పోర్ట్పూరీ రైల్వే స్టేషన్పూరీ విమానాశ్రయంఇతర ప్రాంతీయ ఆర్థిక కేంద్రాలు మరింత మెరుగ్గా అందుబాటులోకి ఉండేలా చేస్తుంది.

 

***


(रिलीज़ आईडी: 2286424) आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Odia , Tamil