ఉప రాష్ట్రపతి సచివాలయం
సిమ్లాలోని ఐఐఏఎస్లో వందేమాతరం ప్రస్థానంపై శాశ్వత ప్రదర్శనను, సర్దార్ పటేల్ విజన్ అంతర్జాతీయ సదస్సును వర్చువల్గా ప్రారంభించనున్న ఉప రాష్ట్రపతి
प्रविष्टि तिथि:
09 JUL 2026 2:50PM by PIB Hyderabad
హిమాచల్ప్రదేశ్లోని సిమ్లాలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ (ఐఐఏఎస్)లో వందేమాతరం ప్రస్థానంపై శాశ్వత ప్రదర్శనను, "సర్దార్ పటేల్ విజన్.. సమగ్రత, ఐక్యత, సమాఖ్య విధానం" అంతర్జాతీయ సదస్సును భారత ఉప రాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ వర్చువల్గా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ప్రసంగిస్తారు.
హిమాచల్ప్రదేశ్లోని సిమ్లాలో ప్రదర్శన, సదస్సును ఉప రాష్ట్రపతి స్వయంగా వెళ్లి ప్రారంభించాల్సి ఉండగా.. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా అక్కడకు వెళ్లలేకపోతున్నారు. దీంతో ప్రారంభ సమావేశానికి వర్చువల్గా హాజరవుతారు.
***
(रिलीज़ आईडी: 2282889)
आगंतुक पटल : 23