నీతి ఆయోగ్
azadi ka amrit mahotsav

పరిశ్రమల నేతృత్వంలోని ఆవిష్కరణలు, అంకురాల భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ‘జీసీసీ కాన్‌క్లేవ్ ఆన్ ఇన్నోవేషన్ 2026’ను నిర్వహించిన ఏఐఎం, ఎస్‌టీపీఐ

प्रविष्टि तिथि: 30 JUN 2026 12:47PM by PIB Hyderabad

నీతి ఆయోగ్‌ పరిధిలోని అటల్ ఇన్నోవేషన్ మిషన్ (ఏఐఎం), సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్‌టీపీఐభాగస్వామ్యంతో ‘జీసీసీ కాన్‌క్లేవ్ ఆన్ ఇన్నోవేషన్ 2026’ సదస్సును బెంగళూరులో నిర్వహించిందిదేశంలోని ఆవిష్కరణలువ్యవస్థాపక వ్యవస్థలో మరింత లోతైన భాగస్వామ్యానికి గల మార్గాలను అన్వేషించడం కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీనాయకులుపరిశోధనఅభివృద్ధి విభాగాల అధినేతలుఆవిష్కరణ రంగానికి చెందిన నాయకులుస్టార్టప్ వ్యవస్థ నిర్వహకులుఇంక్యుబేటర్లుప్రభుత్వ విధాన రూపకర్తలు హాజరయ్యారు.

ఈ సదస్సులో ఇంటెల్ఐబీఎంబాష్అమెజాన్ఎస్ఏపీథర్మో ఫిషర్ సైంటిఫిక్సీజీఐషెల్మెర్సిడెస్ బెంజ్ఫిలిప్స్మోర్గాన్ స్టాన్లీఎన్విడియాశాంసంగ్శాన్‌డిస్క్విప్రోయాహూ వంటి ప్రముఖ జీసీసీలుసాంకేతిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారువీరితోపాటు అటల్ టింకరింగ్ ల్యాబ్స్ (ఏటిఎల్స్), అటల్ ఇంక్యుబేషన్ కేంద్రాలుఅటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ కేంద్రాలుఎస్‌టీపీఐ సెంటర్స్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్కర్ణాటక డిజిటల్ ఎకానమీ మిషన్ ప్రతినిధులుఇతర పరిశ్రమల భాగస్వాములు కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు.

దేశ ఆవిష్కరణల రంగానికిగ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు (జీసీసీమధ్య బలమైన సంబంధాలను ఏర్పరచడమే లక్ష్యంగా ఈ సదస్సును నిర్వహించారుఅటల్ ఇన్నోవేషన్ మిషన్ అందిస్తున్న వివిధ కార్యక్రమాల ద్వారా సరికొత్త అవకాశాలను అన్వేషించడానికి ఈ వేదిక ఉపయోగపడుతుందిపాఠశాల స్థాయిలోనే విద్యార్థుల్లో సరికొత్త ఆలోచనలను పెంచే అటల్ టింకరింగ్ ల్యాబ్స్ నుంచి కొత్త కంపెనీల ఏర్పాటుకు మద్దతు ఇచ్చే ఇంక్యుబేషన్ కేంద్రాల వరకు అన్ని దశల్లోనూ భాగస్వామ్యాన్ని పెంపొందించడంపై ఈ కార్యక్రమంలో చర్చించారువీటితోపాటు అంకుర సంస్థలను పెద్ద కంపెనీలుగా మార్చేందుకు త్వరలో రాబోతున్న పరిశ్రమల ఆధారిత యాక్సిలరేటర్ కార్యక్రమం ‘యాక్సెస్’ (అటల్ యాక్సిలరేషన్ సెంటర్స్ ఫర్ స్కేల్ అప్ ఆఫ్ స్టార్టప్స్ద్వారా కలిగే ప్రయోజనాలపై కూడా చర్చించారు.

 

ఈ సదస్సులో సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ శ్రీ అరవింద్ కుమార్ మాట్లాడుతూ.. దేశంలో సాంకేతికఆవిష్కరణల రంగాన్ని శక్తిమంతం చేయడంలో ఎస్‌టీపీఐ కీలక పాత్ర పోషిస్తోందని అన్నారుక్షేత్రస్థాయి నుంచి వచ్చే సరికొత్త ఆవిష్కరణలను ప్రపంచ మార్కెట్ స్థాయికి తీసుకెళ్లడానికి ఈ జీసీసీ సదస్సు ఒక అద్భుతమైన వేదికగా నిలుస్తుందని తెలిపారు.

 

‘‘దేశవ్యాప్తంగా 2,100కు పైగా కేంద్రాలతో భారత్ జీసీసీ వ్యవస్థ దాదాపు 100 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జిస్తోందిప్రపంచ స్థాయి లక్ష్యాలకు భారతీయ ప్రతిభ తోడైతే ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చో ఇది నిరూపించింది. 1991 నుంచి ఈ ప్రయాణంలో సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా బలమైన భాగస్వామ్యాన్ని కలిగి ఉందిసాంకేతిక మౌలిక సదుపాయాలువిధానపరమైన నిర్ణయాలువ్యవస్థల అనుసంధానతను పటిష్టం చేయడం ద్వారా భారత్‌ను ప్రపంచ స్థాయి సామర్థ్యాల అభివృద్ధికి అత్యుత్తమ కేంద్రంగా మార్చిందిప్రస్తుతం మేం ఈ భాగస్వామ్యాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్తున్నాందేశవ్యాప్తంగా ఉన్న ఎస్‌టీపీఐ సాంకేతిక పార్కులువ్యవస్థాపక కేంద్రాలుడిజిటల్ మౌలిక సదుపాయాలను అటల్ ఇన్నోవేషన్ మిషన్ పరిధిలోని పాఠశాలలుఇంక్యుబేటర్లుయాక్సిలరేషన్ కార్యక్రమాలతో నేరుగా అనుసంధానిస్తున్నాంఈ ఏకీకరణ ద్వారా జీసీసీలు భారతీయ అంకుర సంస్థలతో కలిసి కొత్త ఆవిష్కరణలు రూపొందించడానికిసరికొత్త సాంకేతికతలను పరీక్షించడానికిదేశ ఆవిష్కరణల ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో చురుకైన పాత్ర పోషించడానికి ప్రభుత్వం మద్దతుతో కూడిన ఒక వ్యవస్థీకృతప్రభుత్వ మద్దతుగల వేదిక లభిస్తుందిఇక్కడ ఉన్న ప్రతి జీసీసీని ఈ లక్ష్యంలో భాగస్వాములు కావాలని నేను ఆహ్వానిస్తున్నానుఅందరం కలిసి అంతర్జాతీయంగా పోటీపడగల పరిశ్రమలను నిర్మిస్తూ, ‘వికసిత్ భారత్ 2047’ దిశగా భారత్ పయనాన్ని మరింత వేగవంతం చేద్దాం’’ అని తెలిపారు.

 

ఈ సదస్సును ఉద్దేశించి నీతి ఆయోగ్ పరిధిలోని అటల్ ఇన్నోవేషన్ మిషన్ (ఏఐఎంమిషన్ డైరెక్టర్ దీపక్ బాగ్లా మాట్లాడుతూ.. దేశ ఆవిష్కరణల ఆధారిత వృద్ధి ప్రస్థానాన్ని రూపొందించడంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.

‘‘అభివృద్ధి చెందిన భారత్‌ను నిర్మించడంలో ‘జై అనుసంధాన్’ కీలక చోదక శక్తిగా మారాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎప్పుడూ చెబుతుంటారుగత దశాబ్ద కాలంలో అటల్ ఇన్నోవేషన్ మిషన్ దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 10,000కి పైగా అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ద్వారా యువ ఆవిష్కర్తలను ప్రోత్సహిస్తూ, 100కు పైగా ఇంక్యుబేటర్ల ద్వారా అంకుర సంస్థలకుక్షేత్రస్థాయి పరిశోధకులకు అండగా నిలుస్తూ ఈ దార్శనికతను సాకారం చేసేందుకు కృషి చేస్తోందినేడు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు భారత్‌ను సాంకేతికతఇంజనీరింగ్సరికొత్త ఉత్పత్తుల ఆవిష్కరణలకు ప్రపంచ కేంద్రంగా నిలబెట్టాయిమనకున్న బలాలన్నింటినీ ఒకే తాటిపైకి తీసుకురావడం ద్వారా కొత్త ప్రతిభను పెంపొందించవచ్చువ్యవస్థాపకతను వేగవంతం చేయవచ్చుపరిశ్రమల్లో నూతన విధానాల అవలంబనను ప్రోత్సహించడంతోపాటు వికసిత్ భారత్ 2047 దార్శనికతకు దోహదపడే ప్రపంచ పోటీతత్వ సంస్థలను నిర్మించవచ్చు’’ అని పేర్కొన్నారు.

 

పాఠశాల విద్యార్థులలో ఉత్సుకతను పెంపొందించడం నుంచి అంతర్జాతీయ స్థాయిలో పోటీతత్వ సంస్థలను నిర్మించడం వరకు ఆవిష్కరణల ప్రయాణం ఎక్కడా ఆగకుండా నిరంతరాయంగా సాగడమే ఏఐఎం ముఖ్య ఉద్దేశమని చెప్పారుదేశీయ అంకుర సంస్థలకు మార్గదర్శకత్వం అందించడంఆవిష్కరణల సవాళ్లను ఎదుర్కొనడంప్రయోగాత్మక ప్రాజెక్టులు చేపట్టడంఅంతర్జాతీయ మార్కెట్ అవకాశాలను కల్పించడంస్టార్టప్ పరిశ్రమల మధ్య భాగస్వామ్యాలను పెంపొందించడం ద్వారా ఏఐఎం కార్యక్రమాలలో పాల్గొనవలసిందిగా జీసీసీ ప్రతినిధులను ఆయన ఆహ్వానించారు.

 

ఈ సదస్సులో ఎస్‌టీపీఐ బెంగళూరు డైరెక్టర్ డాక్టర్ సంజయ్ త్యాగి మాట్లాడుతూ.. దేశీయ స్టార్టప్ వ్యవస్థఇంక్యుబేషన్ మౌలిక సదుపాయాలుజీసీసీ వ్యవస్థల మధ్య పరస్పర సమన్వయ అవసరాన్ని వివరించారు.

‘‘దేశంలోనే అత్యధిక సంఖ్యలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు కలిగిన నగరంగా బెంగళూరు ప్రత్యేక గుర్తింపు పొందిందిగత మూడు దశాబ్దాలుగా ఈ వ్యవస్థ అభివృద్ధిలో ఎస్‌టీపీఐ బెంగళూరు కీలక పాత్ర పోషిస్తోందిదేశంలో జీసీసీలు తమ వ్యాపారాలను విస్తరించుకోవడానికిఆవిష్కరణలను పెంచుకోవడానికి అవసరమైన సాంకేతిక మౌలిక సదుపాయాలనునిబంధనల అమలు మద్దతునుప్రభుత్వ విధానపరమైన మద్దతును ఇది అందిస్తుందిఈ సదస్సు ద్వారా అటల్ ఇన్నోవేషన్ మిషన్ పరిధిలోని వివిధ ఆవిష్కరణల దశలతో జీసీసీలు నేరుగా భాగస్వామ్యం కావడానికి మేం స్పష్టమైనఆచరణాత్మక మార్గాలను అన్వేషిస్తున్నాందీనివల్ల జీసీసీ ప్రతినిధులు అటల్ టింకరింగ్ ల్యాబ్స్‌లోని యువ విద్యార్థులకు మార్గదర్శకత్వం అందించవచ్చుఅటల్ ఇంక్యుబేషన్ కేంద్రాల్లోని అంకుర సంస్థలతో కలిసి కొత్త ఉత్పత్తులను సృష్టించవచ్చుత్వరలో ప్రారంభం కాబోయే యాక్సెస్ ఇండస్ట్రియల్ యాక్సిలరేటర్ కార్యక్రమాల్లో భాగస్వాములు కావచ్చుదేశంలోని జీసీసీ వ్యవస్థ కేవలం తక్కువ ఖర్చుతో పనులు పూర్తి చేసే కేంద్రాల స్థాయి నుంచి నేడు సాంకేతిక అభివృద్ధిఉత్పత్తి ఇంజనీరింగ్సరికొత్త ఆవిష్కరణలకు అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన శక్తిమంతమైన కేంద్రంగా ఎదిగిందిఎస్‌టీపీఐఏఐఎంల పరస్పర బలాలుజీసీసీల అంతర్జాతీయ సామర్థ్యాలను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని మార్కెట్లోకి తీసుకురావడానికిస్టార్టప్‌లు పెద్ద కంపెనీలుగా ఎదగడానికిపరిశ్రమల నేతృత్వంలోని వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి కొత్త మార్గాలను అన్వేషించవచ్చుఈ వ్యవస్థల కలయికకు పూర్తి మద్దతు ఇవ్వడానికి ఎస్‌టీపీఐ బెంగళూరు కట్టుబడి ఉందినేడు ఇక్కడ కుదిరిన భాగస్వామ్యాలు భారత్‌ను ప్రపంచంలోనే తిరుగులేని ఆవిష్కరణల రాజధానిగా నిలబెట్టడానికి సహాయపడతాయని నేను భావిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

ఈ సదస్సులో నాలుగు కీలక అంశాలపై చర్చించారుఅవి…

1. అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ద్వారా పాఠశాల ఆవిష్కరణలకు కొత్త రూపం

2, ఏఐసీలుఏసీఐసీల ద్వారా ఆవిష్కరణలను వ్యాపార స్థాయికి ప్రోత్సహించడం

3. ఏఐఎం ఇండస్ట్రియల్ యాక్సిలరేటర్ కార్యక్రమం (యాక్సెస్ద్వారా ఆవిష్కరణలను పెద్ద ఎత్తున ప్రోత్సహించడం

4. ఉమ్మడి యాక్సిలరేటర్ వేదికలు, ఎస్‌టీపీఐ వ్యవస్థాపక కేంద్రాల ద్వారా పరిశ్రమల నేతృత్వంలోని ఆవిష్కరణలు

 

ఈ సదస్సులో ఏఐఎం మద్దతిస్తున్న ఆవిష్కర్తలుఅంకుర సంస్థలుఇంక్యుబేటర్లతో జీసీసీలు ఏ విధంగా కలిసి పనిచేయవచ్చనే అంశాలపై సుదీర్ఘంగా చర్చించారుముఖ్యంగా అంకుర సంస్థలకు మార్గదర్శకత్వం అందించడంకొత్త సాంకేతికతలను పరీక్షించడంప్రయోగాత్మక ప్రాజెక్టుల అమలుసవాళ్లతో కూడిన ఆవిష్కరణ కార్యక్రమాలను నిర్వహించడంమార్కెట్ అవకాశాలను కల్పించడంనిర్దిష్ట రంగాలపై ఆధారపడిన ఉమ్మడి యాక్సిలరేటర్ కార్యక్రమాను రూపొందించడం వంటి అవకాశాలపై చర్చించారు.

ఈ చర్చల్లో ఏఐఎం త్వరలో ప్రారంభించబోయే యాక్సెస్ ఇండస్ట్రియల్ యాక్సిలరేటర్ కార్యక్రమం ప్రధాన ఆకర్షణగా నిలిచిందివృద్ధి దశలో ఉన్న అంకుర సంస్థలు పారిశ్రామిక వాతావరణంలో తమ ఉత్పత్తులను పరీక్షించుకోవడానికిప్రయోగాత్మక ప్రాజెక్టులు చేపట్టడానికిపరిశ్రమల నిపుణుల నుంచి మార్గదర్శకత్వం పొందడానికితమ వ్యాపారాలను విస్తరించడానికి ఈ కార్యక్రమం ఎంతో తోడ్పడుతుందిఈ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా రూపొందించడం కోసం జీసీసీలుప్రముఖ పరిశ్రమలు తమ ఆలోచనలనుభాగస్వామ్య నమూనాలను పంచుకోవాలని ఏఐఎం ఆహ్వానించిందిఅంకుర సంస్థల వృద్ధికిసరికొత్త సాంకేతికతలను పరిశ్రమలు స్వీకరించడానికి తద్వారా దేశ ఆర్థిక వృద్ధికి ఎలా సహకరించవచ్చో వివరించాలని కోరింది.

దేశవ్యాప్తంగా ఉన్న ఆవిష్కర్తలుఅంకుర సంస్థలుపారిశ్రామికవేత్తలుసాంకేతిక సంస్థలను ప్రోత్సహించడంలో ఒకరికొకరు ఏ విధంగా తోడ్పడగలమనే పరస్పర ప్రయోజనకరమైన సహకార రంగాలపై కూడా అటల్ ఇన్నోవేషన్ మిషన్ఎస్‌టీపీఐ ఈ సదస్సులో లోతుగా చర్చించాయిదేశాన్ని ప్రపంచ ఆవిష్కరణలసాంకేతిక కేంద్రంగా మార్చడమే లక్ష్యంగా ఈ సదస్సు ముగిసిందిఇందులో భాగంగా కొత్త ఆవిష్కరణలను వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికివ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి భవిష్యత్తులోనూ ఇలాంటి సంయుక్త చర్చలుభాగస్వామ్య కార్యక్రమాలను నిరంతరం కొనసాగించాలని భాగస్వామ్య పక్షాలన్నీ తీర్మానించాయి.

***


(रिलीज़ आईडी: 2279468) आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Gujarati , Urdu , हिन्दी , Kannada